రంగస్థలం.. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే సినిమా. కంటెంట్ పరంగా క్లాసిక్ అనిపించడమే కాదు.. కమర్షియల్గానూ తిరుగులేని విజయాన్నందుకుని ఆ టైంకి నాన్ బాహుబలి హిట్గా నిలిచిందీ సినిమా. మళ్లీ రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్లో ఇంకో సినిమా కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు అభిమానులు.
ఇదిగో అదిగో అనుకుంటూ ఎట్టకేలకు ఈ ఏడాది రామ్ చరణ్ పుట్టిన రోజు ముంగిట ఈ సినిమాను అనౌన్స్ చేశారు. రంగస్థలం నిర్మాతలే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా కథ గురించి రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ మూవీలో ఇంట్రడక్షన్ సీన్ గురించి గతంలో తనకు చరణ్ చెప్పాడంటూ రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం వైరల్ అయింది. రాజమౌళికే ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసిన సీక్వెన్స్ అందరూ దాని గురించి మాట్లాడుకున్నారు.
ఒక్క ఎపిసోడే ఆ రేంజిలో ఉంటే సినిమా ఎలా ఉంటుందో అని చర్చించుకున్నారు జనాలు. ఐతే అసలు విషయం ఏంటంటే.. ఈ సినిమాకు ఇప్పటిదాకా కథ అయితే ఏమీ అనుకోలేదట. సుకుమార్ గతంలో ఒక ఇంట్రో సీక్వెన్స్ మాత్రమే చరణ్కు చెప్పాడు. అప్పటికి కూడా కథంటూ ఏమీ అనుకోలేదు. సుకుమార్ను దగ్గరగా చూసిన వాళ్లకు ఆయన వ్యవహారం గురించి బాగా ఐడియా ఉంటుంది. ఆయన కథ సహా ఏ విషయానికీ ఫిక్స్ అయి ఉండరు. మొదట ఐడియా అనుకున్న సమయానికి.. సినిమా మేకింగ్ టైంకి పూర్తి భిన్నంగా ఉంటుంది. సుదీర్ఘ కసరత్తు చేసి కథను ఒక కొలిక్కి తెచ్చినా.. షూటింగ్ టైంకి మళ్లీ మార్పులు చేసేస్తారు. దేనికీ ఒక పట్టాన సంతృప్తి చెందని మనిషి ఆయన.
చరణ్ సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతానికి మూవీ అనౌన్స్మెంట్ మాత్రమే జరిగింది. ఏ కథా అనుకోలేదు. ‘పుష్ప-2’ రిలీజైన కొంత కాలానికి స్క్రిప్టు పనులు మొదలవుతాయి. అప్పుడు రకరకాల ఐడియాలు అనుకుని అందులోంచి ఒకటి సెలక్ట్ చేసి దాని మీద టీంతో సుదీర్ఘ చర్చలు జరుపుతారు. ముందు అనుకున్న సీక్వెన్స్ ఆ కథలో సింక్ అయితేనే ఉంటుంది. లేదంటే ఇంకో కొత్త మెరుపు లాంటి ఇంట్రో సీక్వెన్స్ రెడీ చేస్తారు. కాబట్టి ఇప్పుడే ఏదీ ఫిక్స్ అయిపోవడానికి లేదు.
This post was last modified on April 1, 2024 1:50 pm
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…