బహుశా విడుదలకు ముందు టీమ్ ఈ సినిమా పెద్ద హిట్ అయితే చాలనుకున్నారేమో కానీ టిల్లు స్క్వేర్ అంచనాలకు మించి బాక్సాఫీస్ ని కమ్మేస్తున్నాడు. ముఖ్యంగా నిన్న దాదాపు అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్ బోర్డులతో వసూళ్లను హోరెత్తించాడు. మండిపోయే ఎండల్లోనూ ప్రేక్షకులు థియేటర్లకు రావడం స్టార్ హీరోలకు మాత్రమే జరుగుతుంది. అలాంటిది సిద్దు జొన్నలగడ్డ ఈ రేంజ్ లో జనాన్ని రప్పించడం చిన్న విషయం కాదు. ఈవెనింగ్ షోలే కాదు మ్యాట్నీలు సైతం వేరే సినిమాలు ఆడుతున్న స్క్రీన్లను తీసుకుని మరీ సర్దుబాటు చేసేంత రేంజ్ లో వసూళ్ల వర్షం కురిసింది.
ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు వీకెండ్ పూర్తయ్యేలోపు టిల్లు స్క్వేర్ 45 నుంచి 55 కోట్ల మధ్యలో వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించాడు. నిర్మాణ సంస్థ అధికార ప్రకటన ఇంకా రాలేదు. యుఎస్ లో 2 మిలియన్ మార్క్ కు అతి దగ్గరలో ఉన్న టిల్లు స్క్వేర్ ఆ లాంఛనాన్ని ఇవాళ పూర్తి చేయడం ఖాయం. సోమవారం అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించినదాని కన్నా ఎక్కువే ఉంది. మాములుగా వీకెండ్ డ్రాప్ సహజమే. దానికి భిన్నంగా మంచి ఆక్యుపెన్సీలు నమోదు కావడం ఖాయమని బయ్యర్లు చెబుతున్నారు. ఫిబ్రవరి నుంచి ఫుల్ జోష్ ఇచ్చిన సినిమా ఏదీ లేని లోటుని టిల్లు స్క్వేర్ పూర్తిగా తీరుస్తోంది.
ఇక మొదటి వారం ఆధిపత్యం తేలిపోయింది కాబట్టి ఏప్రిల్ 5 శుక్రవారం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ వచ్చాక దాని టాక్ ని బట్టి టిల్లు స్క్వేర్ కొంత తగ్గడం పెరగడం ఆధారపడి ఉంది. కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న మూవీ కాబట్టి అంచనాలు భారీగా ఉన్నాయి. నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ వల్ల సరిపడా థియేటర్లు దొరకనున్నాయి. టిల్లు స్క్వేర్ ని రెండో వారంలో అధిక శాతం స్క్రీన్లలో కొనసాగించేందుకు పంపిణీదారులు సుముఖంగా ఉండటం ప్లస్ పాయింట్. టైర్ 2 హీరోల పేరు మీద ఉన్న అధిక శాతం రికార్డులు టిల్లు స్క్వేర్ కొల్లగొట్టేలానే ఉన్నాడు.
This post was last modified on April 1, 2024 1:37 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…