మొన్నటిదాకా ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శీను కలయికలో రూపొందే సినిమా ఓపెనింగ్ నిన్న జరిగిపోవాలి. కానీ అవ్వలేదు. 14 రీల్స్ బ్యానర్ తో పాటు మరొక నిర్మాణ సంస్థ భాగస్వామ్యం ఇందులో ఉంటుందనే టాక్ ఉంది కానీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బాలయ్య ఎన్నికల హడావిడిలో బిజీగా ఉన్నారు. ఎలక్షన్లకు కేవలం 40 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. టిడిపి జనసేన బిజెపి పొత్తుకు సానుకూల వాతావరణం ఉండటంతో వీలైనంత ప్రజల్లో ఉండాలని ఆ మేరకు నిర్ణయం తీసుకుని షూటింగులకు బ్రేక్ ఇచ్చినట్టు తెలిసింది.
వచ్చే వారం ఉగాది పండగ సందర్భంగా పూజా కార్యక్రమం లాంటిది జరిపే అవకాశాన్ని కొట్టి పారేయలేం. అయితే కొన్ని నెలల క్రితం బోయపాటి శీనుతో అల్లు అరవింద్ ఒక ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. హీరో ఎవరనేది చెప్పలేదు. అందరూ అల్లు అర్జున్ అనుకున్నారు కానీ అది నిజం కాదు. పోనీ బాలయ్య అనుకుంటే ఆల్రెడీ 14 రీల్స్ కమిట్ మెంట్ ఉంది. లేదంటే ఈ రెండు బ్యానర్లు చేతులు కలుపుతాయా అంటే ఖరారుగా చెప్పలేని పరిస్థితి. కథ సిద్ధంగా ఉందని, ఫైనల్ వెర్షన్ లాక్ కాగానే బోయపాటి లొకేషన్లు, క్యాస్టింగ్ తదితర పనులు మొదలుపెడతారని ఇన్ సైడ్ న్యూస్.
సో కొంత ఆలస్యం తప్పేలా లేదు. బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న భారీ చిత్రం కూడా బాలయ్య లేని ఎపిసోడ్లను పూర్తి చేసే పనిలో ఉంది. తక్కువ అయినా సరే వీలైనన్ని డేట్లు ఇచ్చి సహకరించాలని బాలయ్య చూస్తున్నారు కానీ అదంత సులభంగా లేదు. పవన్ కళ్యాణ్ తరహాలో బ్రేక్ తీసుకోక తప్పదు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వరస బ్లాక్ బస్టర్ల తర్వాత బాలయ్య మార్కెట్ గణనీయంగా పెరిగింది. సీనియర్ హీరోల్లో ప్రస్తుత ట్రెండ్ లో విజయాల శాతం ఎక్కువగా ఉన్నది బాలయ్యకే. అందుకే జాగ్రత్తగా ఉండటంలో తప్పేం లేదు.
This post was last modified on April 1, 2024 10:22 am
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…
గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…
గత నలభై ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సిల్వర్ స్క్రీన్ కాంబినేషన్ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. రజనీకాంత్, కమల్ హాసన్…
అంతా నా ఇష్టం…అంతా నా ఇష్టం…ఎడాపెడా ఏది చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం అంటూ కౌరవుడు సినిమాలో నాగబాబు మాదిరిగా…
చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే…
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…