బాలీవుడ్లో సుదీర్ఘ చరిత్ర ఉన్న ఫ్యామిలీ కపూర్లది. ఆ కుటుంబం నుంచి ఎంతో మంది సినీ రంగంలోకి వచ్చారు. వారిలో నటుడిగా అనిల్ కపూర్ గొప్ప స్థాయిని అందుకుంటే.. ఆయన సోదరుడు బోనీ కపూర్ నిర్మాతగా పెద్ద రేంజికి ఎదిగాడు. ఈ అన్నదమ్ముల మధ్య మంచి అనుబంధమే ఉంది. ఐతే బోనీ తీయబోయే కొత్త సినిమాలో అనిల్ కపూర్ ఛాన్స్ ఇవ్వమంటే మాత్రం ఇవ్వలేదట. దీంతో అనిల్ అలిగాడట. ఈ విషయాన్ని బోనీనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 2
005లో విడుదలైన నో ఎంట్రీ మూవీ అప్పట్లో సూపర్ హిట్టయింది. ఇందులో అనిల్ కపూర్, సల్మాన్ ఖాన్, బిపాసా బసు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అనీస్ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా నవ్వించింది. ఈ సినిమాకు సీక్వెల్ తీయడానికి బోనీ రెడీ అయ్యాడు.
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో సినిమాను సెట్స్ మీదికి వెళ్లబోతోంది. నో ఎంట్రీ వచ్చిన 20 ఏళ్లకు, అంటే వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఐతే నో ఎంట్రీ సీక్వెల్ రాబోతోందని తెలిసి.. తాను కూడా అందులో నటిస్తానని అనిల్ కపూర్ ముందుకు వచ్చాడట. ఐతే ఈ సినిమాలో నిన్ను తీసుకోవడానికి ఖాళీ లేదని తేల్చి చెప్పేశాడట బోనీ కపూర్. దీంతో అనిల్ కపూర్ అలిగాడట. తాను ఈ విషయంలో సర్దిచెబుదామని అనిల్కు కాల్ చేస్తుంటే అతను స్పందించట్లేదని మీడియాకు వెల్లడించాడు బోనీ.
ఇక ఈ చిత్రంలో తన కొడుకు అర్జున్ కపూర్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్ హీరోలుగా నటిస్తున్నట్లు వెల్లడించాడు బోనీ. ఇందులో పదిమంది హీరోయిన్లు నటిస్తారని బోనీ చెప్పడం విశేషం.
This post was last modified on March 31, 2024 7:44 am
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…