బాలీవుడ్లో సుదీర్ఘ చరిత్ర ఉన్న ఫ్యామిలీ కపూర్లది. ఆ కుటుంబం నుంచి ఎంతో మంది సినీ రంగంలోకి వచ్చారు. వారిలో నటుడిగా అనిల్ కపూర్ గొప్ప స్థాయిని అందుకుంటే.. ఆయన సోదరుడు బోనీ కపూర్ నిర్మాతగా పెద్ద రేంజికి ఎదిగాడు. ఈ అన్నదమ్ముల మధ్య మంచి అనుబంధమే ఉంది. ఐతే బోనీ తీయబోయే కొత్త సినిమాలో అనిల్ కపూర్ ఛాన్స్ ఇవ్వమంటే మాత్రం ఇవ్వలేదట. దీంతో అనిల్ అలిగాడట. ఈ విషయాన్ని బోనీనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 2
005లో విడుదలైన నో ఎంట్రీ మూవీ అప్పట్లో సూపర్ హిట్టయింది. ఇందులో అనిల్ కపూర్, సల్మాన్ ఖాన్, బిపాసా బసు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అనీస్ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా నవ్వించింది. ఈ సినిమాకు సీక్వెల్ తీయడానికి బోనీ రెడీ అయ్యాడు.
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో సినిమాను సెట్స్ మీదికి వెళ్లబోతోంది. నో ఎంట్రీ వచ్చిన 20 ఏళ్లకు, అంటే వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఐతే నో ఎంట్రీ సీక్వెల్ రాబోతోందని తెలిసి.. తాను కూడా అందులో నటిస్తానని అనిల్ కపూర్ ముందుకు వచ్చాడట. ఐతే ఈ సినిమాలో నిన్ను తీసుకోవడానికి ఖాళీ లేదని తేల్చి చెప్పేశాడట బోనీ కపూర్. దీంతో అనిల్ కపూర్ అలిగాడట. తాను ఈ విషయంలో సర్దిచెబుదామని అనిల్కు కాల్ చేస్తుంటే అతను స్పందించట్లేదని మీడియాకు వెల్లడించాడు బోనీ.
ఇక ఈ చిత్రంలో తన కొడుకు అర్జున్ కపూర్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్ హీరోలుగా నటిస్తున్నట్లు వెల్లడించాడు బోనీ. ఇందులో పదిమంది హీరోయిన్లు నటిస్తారని బోనీ చెప్పడం విశేషం.
బాక్సాఫీస్ వద్ద సునామిలాగా విరుచుకుపడుతున్న ది ఒడిస్సి షూటింగ్ కేవలం 93 రోజుల్లో అయిపోయిందంటే నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం.…
వచ్చే నెల ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు వస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమా వారణాసి ఒకటే కాబట్టి…
తాను కథానాయికగా నటించే రోజుల్లో ప్యాడెడ్ బ్రాలు, బంప్ బ్రాలు పెట్టుకోమని ఫిలిం మేకర్స్ విపరీతంగా ఒత్తిడి తెచ్చేవాళ్లని సమీరా…
దేశ రాజధాని ఢిల్లీ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రులతో…
కొలువులు అడిగితే యువతను పోలీసులతో కొట్టిస్తున్నారని.. కాంగ్రెస్కు డెత్ డిక్లరేషన్ రాసే సమయం వచ్చిందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదల శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి…