బాలీవుడ్లో సుదీర్ఘ చరిత్ర ఉన్న ఫ్యామిలీ కపూర్లది. ఆ కుటుంబం నుంచి ఎంతో మంది సినీ రంగంలోకి వచ్చారు. వారిలో నటుడిగా అనిల్ కపూర్ గొప్ప స్థాయిని అందుకుంటే.. ఆయన సోదరుడు బోనీ కపూర్ నిర్మాతగా పెద్ద రేంజికి ఎదిగాడు. ఈ అన్నదమ్ముల మధ్య మంచి అనుబంధమే ఉంది. ఐతే బోనీ తీయబోయే కొత్త సినిమాలో అనిల్ కపూర్ ఛాన్స్ ఇవ్వమంటే మాత్రం ఇవ్వలేదట. దీంతో అనిల్ అలిగాడట. ఈ విషయాన్ని బోనీనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 2
005లో విడుదలైన నో ఎంట్రీ మూవీ అప్పట్లో సూపర్ హిట్టయింది. ఇందులో అనిల్ కపూర్, సల్మాన్ ఖాన్, బిపాసా బసు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అనీస్ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా నవ్వించింది. ఈ సినిమాకు సీక్వెల్ తీయడానికి బోనీ రెడీ అయ్యాడు.
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో సినిమాను సెట్స్ మీదికి వెళ్లబోతోంది. నో ఎంట్రీ వచ్చిన 20 ఏళ్లకు, అంటే వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఐతే నో ఎంట్రీ సీక్వెల్ రాబోతోందని తెలిసి.. తాను కూడా అందులో నటిస్తానని అనిల్ కపూర్ ముందుకు వచ్చాడట. ఐతే ఈ సినిమాలో నిన్ను తీసుకోవడానికి ఖాళీ లేదని తేల్చి చెప్పేశాడట బోనీ కపూర్. దీంతో అనిల్ కపూర్ అలిగాడట. తాను ఈ విషయంలో సర్దిచెబుదామని అనిల్కు కాల్ చేస్తుంటే అతను స్పందించట్లేదని మీడియాకు వెల్లడించాడు బోనీ.
ఇక ఈ చిత్రంలో తన కొడుకు అర్జున్ కపూర్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్ హీరోలుగా నటిస్తున్నట్లు వెల్లడించాడు బోనీ. ఇందులో పదిమంది హీరోయిన్లు నటిస్తారని బోనీ చెప్పడం విశేషం.
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు.. పార్టీలో అంతర్గత…
తెలంగాణ అన్న పదం డిక్షనరీలోనే లేదని.. కొందరు ప్రాంతీయ వాదులు సృష్టించిన పదమని.. ఇటీవల తెలంగాణకు చెందిన కీలక టీడీపీ…
ప్రేమికుల నుంచి నిజ జీవిత భార్యాభర్తలుగా మారిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ప్యాన్ ఇండియా మూవీ…
కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్ పట్టించుకోరని ప్రతి భాషలో రుజువవుతూనే ఉంది. మన దగ్గర బలగం,…
సంక్రాంతి తర్వాత వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్లో మళ్లీ కళ తెచ్చే సినిమా అవుతుందని అందరూ ‘పెద్ది’ మీదే ఆశలు పెట్టుకున్నారు.…
మలయాళంతో పాటు తెలుగులోనూ మంచి విజయం సాధించిన మూవీ ప్రేమలు. దీంట్లో జంటగా నటించిన నస్లెన్, మమిత బైజు ఎంత…