థియేటర్లలోనే రిలీజ్ చేస్తాం.. థియేటర్లలోనే రిలీజ్ చేస్తాం అంటూ వచ్చిన ‘వి’ సినిమాను చివరికి ఓటీటీలోకి వదిలేశారు. పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడి థియేటర్లు తెరుచుకునే, మామూలుగా నడిచే అవకాశం లేకపోవడంతో మంచి డీల్ వచ్చేసరికి ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు కాదనలేకపోయాడు. ఈ వరుసలో మరికొన్ని పేరున్న సినిమాలు కూడా ఇలాగే నేరుగా ఓటీటీల్లో రిలీజయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
తాజాగా ‘ఒరేయ్ బుజ్జిగా’ ఓటీటీ రిలీజ్ కన్ఫమ్ అయింది. ఈ చిత్రాన్ని సొంతం చేసుకున్న ‘ఆహా’లోనే ‘కలర్ ఫోటో’ కూడా వస్తుందంటున్నారు. ఇవి కాక సోలో బ్రతుకే సో బెటర్, నిశ్శబ్దం, గుడ్ లక్ సఖి, మిస్ ఇండియా కూడా లైన్లో ఉన్నాయి. ఐతే వీటన్నింటితో పోలిస్తే కొంచెం ఎక్కువ రేంజ్, క్రేజ్ ఉన్న సినిమా ఒకటి ఓటీటీలో రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే.. లవ్ స్టోరి.
బ్లాక్ బస్టర్ మూవీ ‘ఫిదా’ తర్వాత శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం.. లవ్ స్టోరి. అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవిల క్రేజీ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ఏడాది ప్రథమార్ధంలోనే రిలీజ్ అనుకున్నారు కానీ.. కరోనా వల్ల ఆలస్యమైంది. ఇటీవలే అన్ని జాగ్రత్తలతో షూటింగ్ పున:ప్రారంభించారు.
సింగిల్ షెడ్యూల్లో మిగతా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెలాఖరుకల్లా సినిమా పూర్తయిపోతుందట. ఈ చిత్రానికి ఒక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ రూ.30 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఐతే దీని నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాకు ఇదే తొలి చిత్రం. వాళ్లకు పెద్ద సంఖ్యలో థియేటర్లు అందుబాటులో ఉన్నాయి. పేరున్న సినిమాలను నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేయడం పట్ల ఎగ్జిబిటర్లలో వ్యతిరేకత కనిపిస్తోంది.
తమిళనాట అయితే ఈ విషయంలో ఆందోళనలు కూడా నిర్వహించారు. అలాంటిది ఇక్కడ పేరున్న ఎగ్జిబిటర్ తమ సినిమాను ఓటీటీల్లో రిలీజ్ చేస్తే ఆ వర్గాల్లో వ్యతిరేకత రావడం ఖాయం. తమ వ్యవస్థను తామే ఇబ్బందుల్లోకి నెట్టినట్లవుతుంది. ఈ నేపథ్యంలో ‘లవ్ స్టోరి’ని ఓటీటీకి ఇస్తారా లేదా అన్నది సందేహమే.
This post was last modified on September 14, 2020 3:50 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…