మొత్తానికి టాలీవుడ్లో వేసవి సందడి మొదలైపోయింది. గత వారం వచ్చిన ‘ఓం భీం బుష్’తోనే జోష్ వస్తుందని అనుకున్నారు కానీ.. అది అనుకున్న స్థాయిలో సౌండ్ చేయలేదు. కానీ ఈ వారం వచ్చిన క్రేజీ మూవీ ‘టిల్లు స్క్వేర్’ అంచనాలకు ఏమాత్రం తగ్గకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర హడావుడి మామూలుగా లేదు. తొలి రోజు ఉదయం 7 గంటల నుంచే టిల్లుగాని సందడి మొదలైపోయింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. యుఎస్లో సైతం ‘టిల్లు స్క్వేర్’ హౌస్ ఫుల్ వసూళ్లతో రన్ అయింది. ప్రతి చోటా వసూళ్ల మోత మోగిస్తోందీ చిత్రం. తొలి రోజు నిర్మాత నాగవంశీ అన్నట్లు రూ.25 కోట్ల దాకా గ్రాస్ రాబట్టడం అంటే చిన్న విషయం కాదు. నిర్మాత చెప్పిందానికి దగ్గర్లోనే వసూళ్లు ఉన్నాయన్నది ట్రేడ్ వర్గాల మాట. వీకెండ్ అంతా ‘టిల్లు స్క్వేర్’ జోరు కొనసాగబోతోంది. ఇక సినిమా చూసిన వాళ్లందరూ ఇందులోని డైలాగుల గురించే మాట్లాడుకుంటున్నారు.
ఐతే ‘డీజే టిల్లు’తో పాటు ‘టిల్లు స్క్వేర్’కూ హీరో సిద్ధు జొన్నలగడ్డే రైటర్ అని అందరికీ తెలుసు. కానీ ఈ సినిమాకు అతనొక్కడే రచయిత కాదు. టిల్లు పాత్రను ఇంత బాగా తీర్చిదిద్దడంలో.. ట్రెండీ డైలాగ్స్ రాయడంలో అతడికి ఇంకో హ్యాండ్ సాయపడింది. ఆ రైటర్ పేరు.. రవి ఆంటోనీ. ఈ పేరు జనాలు పెద్దగా విని ఉండరు. కానీ ఆ ‘మ్యాడ్’ సినిమా చూసిన వాళ్లంతా ఆ రైటర్ను నటుడిగా చూసి ఎంజాయ్ చేసిన విషయం తెలియదు.
అందులో ఆంటోనీ అనే పాత్రలో ట్యూబ్ లైట్ పట్టుకుని తిరుగుతుంటాడు ఓ నటుడు. సినిమాలో బాగా పేలిన.. మంచి వినోదం పంచిన పాత్రల్లో అదొకటి. ఆ పాత్రలో చేసిన నటుడే రవి ఆంటోనీ. అతనే సిద్ధు జొన్నలగడ్డతో కలిసి ‘డీజే టిల్లు’ స్క్రిప్టు రాశాడు. ఇప్పుడు ఆ సినిమాను మించి ‘టిల్లు స్క్వేర్’లో సిద్ధు-రవి జోడీ పంచులు పేల్చింది. ఈ సినిమాతో వీళ్లిద్దరికీ రచయితలుగా ఇంకా పేరు వచ్చిన నేపథ్యంలో ‘టిల్లు-3’కి వీరిపై అంచనాలు ఇంకా పెరిగిపోవడం ఖాయం.
బాక్సాఫీస్ వద్ద సునామిలాగా విరుచుకుపడుతున్న ది ఒడిస్సి షూటింగ్ కేవలం 93 రోజుల్లో అయిపోయిందంటే నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం.…
వచ్చే నెల ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు వస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమా వారణాసి ఒకటే కాబట్టి…
తాను కథానాయికగా నటించే రోజుల్లో ప్యాడెడ్ బ్రాలు, బంప్ బ్రాలు పెట్టుకోమని ఫిలిం మేకర్స్ విపరీతంగా ఒత్తిడి తెచ్చేవాళ్లని సమీరా…
దేశ రాజధాని ఢిల్లీ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రులతో…
కొలువులు అడిగితే యువతను పోలీసులతో కొట్టిస్తున్నారని.. కాంగ్రెస్కు డెత్ డిక్లరేషన్ రాసే సమయం వచ్చిందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదల శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి…