Movie News

పంజా దర్శకుడికి కండల వీరుడి షాక్

పవన్ కళ్యాణ్ తో పంజా తీసిన దర్శకుడు విష్ణువర్ధన్ గుర్తున్నాడా. ఆ సినిమా ఫ్లాప్ అయినా అభిమానులకు స్టైలిష్ మేకింగ్ పరంగా ఇతనంటే బాగా ఇష్టం. తమిళంలో బిల్లా లాంటి బ్లాక్ బస్టర్ తో వెలుగులోకి వచ్చిన ఈ యాక్షన్ డైరెక్టర్ గత ఏడాదే సల్మాన్ ఖాన్ తో భారీ బడ్జెట్ తో ది బుల్ ప్లాన్ చేసుకున్నారు. కరణ్ జోహార్ నిర్మాతగా ప్రాజెక్టు కూడా అనౌన్స్ చేశారు. హీరోయిన్ గా సమంతాను తీసుకోవడం ఖాయమయ్యిందని ముంబై మీడియాలో వచ్చింది. ఇందులో ఆర్మీ ఆఫీసర్ వేషం కోసం కండల వీరుడు ప్రత్యేకంగా కసరత్తులు చేసి జుత్తుని కురచగా కత్తిరిచుకున్నాడు.

మొన్న దసరాకో దీపావళికో షూటింగ్ మొదలుపెట్టాలనుకున్నారు. కానీ వాయిదాల పర్వం కొనసాగుతూనే వస్తోంది. స్క్రిప్ట్, క్యాస్టింగ్, బడ్జెట్ ఇలా ఏవేవో కారణాలతో ముందుకు తీసుకెళ్లలేకపోయారు. దీంతో విసుగొచ్చిన సల్మాన్ ఖాన్ దీన్ని ఇక్కడితో ఆపేద్దామని నిర్మాతకు కబురు పంపినట్టు లేటెస్ట్ అప్డేట్. విధి ఈ మూవీని ఆపుతోందని బలవంతంగా తీస్తే ప్రతికూల ఫలితం వస్తుందని భావించి డ్రాప్ అయినట్టు సన్నిహితులతో అంటున్నాడట. దీని స్థానంలో అవే కాల్ షీట్లతో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీ త్వరలో ప్రారంభం కానుంది.

విష్ణువర్షన్ కి ఇది పెద్ద షాకే. క్యాన్సిలైన విషయం ఇంకా అధికారికంగా చెప్పలేదు కానీ దాదాపు కన్ఫర్మే. బాలీవుడ్ లో జెండా పాతుదామని చూసిన ఈ క్రియేటివ్ దర్శకుడికి ఇది ఊహించని షాకే. ఎందుకంటే ఈయనతో చేసేందుకు తమిళంలో పెద్ద హీరోలు అంతగా ఆసక్తి కనపరచడం లేదు. ఒకప్పుడు సూపర్ హిట్లు ఇచ్చినా ఆ మేజిక్ ఆయనలో లేదని వాళ్ళ ఫీలింగ్. అందుకే గౌతమ్ మీనన్ చక్కగా నటనకు పరిమితమై వరుస ఆఫర్లతో యమా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు విష్ణువర్థన్ ఏం చేస్తాడో వేచి చూడాలి. కిక్ 2 కూడా లైన్ లో పెట్టిన సల్మాన్ ఖాన్ దానికి పూర్తిగా కొత్త కథను ఎంచుకున్నాడు.

This post was last modified on March 30, 2024 5:09 pm

Share

Recent Posts

మైత్రీ సినిమాలన్నీ గతంలోకే వెళ్తున్నాయే!

మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో ఉన్న లైనప్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది. ప్రెజెంట్ నడుస్తున్న కథల కంటే…

1 hour ago

రేషన్ కార్డుపై మోదీ బొమ్మ వేయాల్సిందే!

ఈ రోజుల్లో పబ్లిసిటీకి కాదేదీ అనర్హం…రాజకీయ నేతలు మొదలు సినీ తారల వరకు అందరూ పబ్లిసిటీనే నమ్ముకున్నారంటే అతిశయోక్తి కాదు.…

1 hour ago

జగన్ కు అవమానం… జైలు సిబ్బంది క్లారిటీ

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ని పరామర్శించేందుకు కర్నూలు జిల్లా పంచలింగాల జైలు వద్దకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…

2 hours ago

వెంకటేష్ ప్రయాణానికి అప్పుడే 40 ఏళ్ళు

సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం ఇదే రోజు 1986 సంవత్సరం ఆగస్ట్ 14 కలియుగ పాండవులు రిలీజయ్యింది. మాములుగా స్టార్…

2 hours ago

సాక్ష్యాల తారుమారు కేసులో సీదిరి అప్పల రాజుకు బెయిల్

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ శర్మ చేసిన బైక్ యాక్సిడెంట్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…

3 hours ago

ఆవారాపన్ 2… అంతగా ఏముందబ్బా

కొత్తగా రిలీజైన సినిమాల్లో అడ్వాన్స్ బుకింగ్ పరంగా దూసుకుపోతున్న సినిమాగా ఆవారాపన్ 2 అన్ని రాష్టాల ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.…

3 hours ago