సూపర్ హీరోలు, రాకాసి ప్రాణుల హాలీవుడ్ సినిమాలకు మన దేశంలో క్రేజ్ ఎక్కువ. అందులోనూ కింగ్ కాంగ్, గాడ్జిల్లాలకు ఉండే క్రేజ్ తెలిసిందే. విడివిడిగానే ఇవి చేసే విన్యాసాల కోసం అభిమానులు ఎగబడతారు. అలాంటిది రెండు కలిసి స్క్రీన్ మీద చేయబోయే విధ్వంసం ఊహలకు అందుతుందా. అందుకే ఈ కంబైన్డ్ ఫ్రాంచైజ్ మొదలైనప్పటి నుంచి నిర్మాణ సంస్థకు వేల కోట్లు కురిపించే కామధేనువుగా మారిపోయింది. నిన్న గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ భారీ అంచనాల మధ్య నూతన సామ్రాజ్యం పేరుతో తెలుగుతో సహా అన్ని ప్రధాన భాషల్లో డబ్బింగ్ రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఎవరికీ కనిపించని పాతాళం లాంటి లోతైన హాలో ఎర్త్ లో కాంగ్ నివాసం ఉంటుంది. భూమి మీదకు దాడి చేసే టైటాన్స్ ని కాచుకుంటూ గాడ్జిల్లా ఖాళీ సమయంలో నిద్రపోతూ ఉంటుంది. వీటి మీద పరిశోధనలు చేసే మోనార్క్ సంస్థ డాక్టర్, ఆమె కూతురికి గ్రావిటీ (గురుత్వాకర్షణ) కు సంబంధించిన కొన్ని ప్రమాదరకమైన సంకేతాలు అందుతాయి. మానవాళి ప్రమాదంలో ఉందని గుర్తించి కాపాడమని అడిగేందుకు ఒక టీమ్ హాలో ఎర్త్ కు వెళ్తుంది. రాకాసి కోతులు, జలచరాలతో భయంకరంగా ఉన్న ఆ సమూహం నుంచి మనుషులను కాంగ్, గాడ్జిల్లాలు ఎలా కాపాడారనేది అసలు కథ.
విపరీతమైన అంచనాలు పెట్టుకుంటే కష్టం కానీ కాంగ్, గాడ్జిలా ఫ్యాన్స్ ని ఈ కొత్త సీక్వెల్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఘటాన్ని అబ్బురపరిచే రీతిలో చిత్రీకరించాడు దర్శకుడు ఆడం విన్ గార్డ్. కేవలం రెండు గంటల లోపే నిడివితో స్క్రీన్ ప్లేని నడిపించడంతో బోర్ కొట్టే అవకాశం పెద్దగా ఇవ్వలేదు. ఫస్ట్ హాఫ్ కొంత ల్యాగ్ ఉన్నప్పటికీ మరీ తీవ్రంగా అయితే లేదు. మెయిన్ విలన్ టైటాన్ ని ఆశించిన స్థాయిలో డిజైన్ చేయకపోవడం, ముందు భాగాల మాదిరి కాకుండా ఇందులో ఎమోషన్ ని వదిలేయడం మైనసయ్యింది. విజువల్ ఎఫెక్ట్స్ కోసమైనా చూడాల్సిన సినిమాగా రికమండ్ చేసేలానే ఉంది.
This post was last modified on March 30, 2024 10:31 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…