సూపర్ హీరోలు, రాకాసి ప్రాణుల హాలీవుడ్ సినిమాలకు మన దేశంలో క్రేజ్ ఎక్కువ. అందులోనూ కింగ్ కాంగ్, గాడ్జిల్లాలకు ఉండే క్రేజ్ తెలిసిందే. విడివిడిగానే ఇవి చేసే విన్యాసాల కోసం అభిమానులు ఎగబడతారు. అలాంటిది రెండు కలిసి స్క్రీన్ మీద చేయబోయే విధ్వంసం ఊహలకు అందుతుందా. అందుకే ఈ కంబైన్డ్ ఫ్రాంచైజ్ మొదలైనప్పటి నుంచి నిర్మాణ సంస్థకు వేల కోట్లు కురిపించే కామధేనువుగా మారిపోయింది. నిన్న గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ భారీ అంచనాల మధ్య నూతన సామ్రాజ్యం పేరుతో తెలుగుతో సహా అన్ని ప్రధాన భాషల్లో డబ్బింగ్ రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఎవరికీ కనిపించని పాతాళం లాంటి లోతైన హాలో ఎర్త్ లో కాంగ్ నివాసం ఉంటుంది. భూమి మీదకు దాడి చేసే టైటాన్స్ ని కాచుకుంటూ గాడ్జిల్లా ఖాళీ సమయంలో నిద్రపోతూ ఉంటుంది. వీటి మీద పరిశోధనలు చేసే మోనార్క్ సంస్థ డాక్టర్, ఆమె కూతురికి గ్రావిటీ (గురుత్వాకర్షణ) కు సంబంధించిన కొన్ని ప్రమాదరకమైన సంకేతాలు అందుతాయి. మానవాళి ప్రమాదంలో ఉందని గుర్తించి కాపాడమని అడిగేందుకు ఒక టీమ్ హాలో ఎర్త్ కు వెళ్తుంది. రాకాసి కోతులు, జలచరాలతో భయంకరంగా ఉన్న ఆ సమూహం నుంచి మనుషులను కాంగ్, గాడ్జిల్లాలు ఎలా కాపాడారనేది అసలు కథ.
విపరీతమైన అంచనాలు పెట్టుకుంటే కష్టం కానీ కాంగ్, గాడ్జిలా ఫ్యాన్స్ ని ఈ కొత్త సీక్వెల్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఘటాన్ని అబ్బురపరిచే రీతిలో చిత్రీకరించాడు దర్శకుడు ఆడం విన్ గార్డ్. కేవలం రెండు గంటల లోపే నిడివితో స్క్రీన్ ప్లేని నడిపించడంతో బోర్ కొట్టే అవకాశం పెద్దగా ఇవ్వలేదు. ఫస్ట్ హాఫ్ కొంత ల్యాగ్ ఉన్నప్పటికీ మరీ తీవ్రంగా అయితే లేదు. మెయిన్ విలన్ టైటాన్ ని ఆశించిన స్థాయిలో డిజైన్ చేయకపోవడం, ముందు భాగాల మాదిరి కాకుండా ఇందులో ఎమోషన్ ని వదిలేయడం మైనసయ్యింది. విజువల్ ఎఫెక్ట్స్ కోసమైనా చూడాల్సిన సినిమాగా రికమండ్ చేసేలానే ఉంది.
This post was last modified on March 30, 2024 10:31 am
ఒక టైంలో నిలకడగా హిట్లు కొడుతూ మంచి ఊపులో కనిపించాడు యువ కథానాయకుడు విశ్వక్సేన్. కానీ కొన్నేళ్లుగా అతడికి విజయాలు…
రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభ ఘట్టానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి అనూహ్యంగా తెలుగు వారి…
నోట్ల రద్దు తర్వాత సడన్ గా వచ్చిన రూ.2000 నోట్లను తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్…
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల దేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరులకు గడువు…
నిన్న సూర్య రెట్రోతో పాటు తమిళంలో టూరిస్ట్ ఫ్యామిలీ విడుదలయ్యింది. తెలుగు డబ్బింగ్ చేయలేదు కానీ కోలీవుడ్ లో దీని…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజధాని అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన 18 కీలక ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనలు,…