సూపర్ హీరోలు, రాకాసి ప్రాణుల హాలీవుడ్ సినిమాలకు మన దేశంలో క్రేజ్ ఎక్కువ. అందులోనూ కింగ్ కాంగ్, గాడ్జిల్లాలకు ఉండే క్రేజ్ తెలిసిందే. విడివిడిగానే ఇవి చేసే విన్యాసాల కోసం అభిమానులు ఎగబడతారు. అలాంటిది రెండు కలిసి స్క్రీన్ మీద చేయబోయే విధ్వంసం ఊహలకు అందుతుందా. అందుకే ఈ కంబైన్డ్ ఫ్రాంచైజ్ మొదలైనప్పటి నుంచి నిర్మాణ సంస్థకు వేల కోట్లు కురిపించే కామధేనువుగా మారిపోయింది. నిన్న గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ భారీ అంచనాల మధ్య నూతన సామ్రాజ్యం పేరుతో తెలుగుతో సహా అన్ని ప్రధాన భాషల్లో డబ్బింగ్ రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఎవరికీ కనిపించని పాతాళం లాంటి లోతైన హాలో ఎర్త్ లో కాంగ్ నివాసం ఉంటుంది. భూమి మీదకు దాడి చేసే టైటాన్స్ ని కాచుకుంటూ గాడ్జిల్లా ఖాళీ సమయంలో నిద్రపోతూ ఉంటుంది. వీటి మీద పరిశోధనలు చేసే మోనార్క్ సంస్థ డాక్టర్, ఆమె కూతురికి గ్రావిటీ (గురుత్వాకర్షణ) కు సంబంధించిన కొన్ని ప్రమాదరకమైన సంకేతాలు అందుతాయి. మానవాళి ప్రమాదంలో ఉందని గుర్తించి కాపాడమని అడిగేందుకు ఒక టీమ్ హాలో ఎర్త్ కు వెళ్తుంది. రాకాసి కోతులు, జలచరాలతో భయంకరంగా ఉన్న ఆ సమూహం నుంచి మనుషులను కాంగ్, గాడ్జిల్లాలు ఎలా కాపాడారనేది అసలు కథ.
విపరీతమైన అంచనాలు పెట్టుకుంటే కష్టం కానీ కాంగ్, గాడ్జిలా ఫ్యాన్స్ ని ఈ కొత్త సీక్వెల్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఘటాన్ని అబ్బురపరిచే రీతిలో చిత్రీకరించాడు దర్శకుడు ఆడం విన్ గార్డ్. కేవలం రెండు గంటల లోపే నిడివితో స్క్రీన్ ప్లేని నడిపించడంతో బోర్ కొట్టే అవకాశం పెద్దగా ఇవ్వలేదు. ఫస్ట్ హాఫ్ కొంత ల్యాగ్ ఉన్నప్పటికీ మరీ తీవ్రంగా అయితే లేదు. మెయిన్ విలన్ టైటాన్ ని ఆశించిన స్థాయిలో డిజైన్ చేయకపోవడం, ముందు భాగాల మాదిరి కాకుండా ఇందులో ఎమోషన్ ని వదిలేయడం మైనసయ్యింది. విజువల్ ఎఫెక్ట్స్ కోసమైనా చూడాల్సిన సినిమాగా రికమండ్ చేసేలానే ఉంది.
This post was last modified on March 30, 2024 10:31 am
బస్సులో మనం ఒక సీట్ ని రిజర్వ్ చేసుకుని, తీరా ప్రయాణానికి వెళ్లలేకపోతే వేరొకరికి ఇవ్వడమో లేదా అమ్మడమో జరుగుతుంది.…
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన కొడుకు ఆరవ్ ను హిట్…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ మీద బజ్ బాగానే ఉంది. కిరణ్ అబ్బవరం కెరీర్…
దేశ రాజధానిలో రగులుకున్న విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న పరిస్తితి. ఈ పరిస్థితికి కారణం బీజేపీ సీనియర్ మోస్ట్ నేత, కేంద్ర…
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని…
అటు పార్లమెంటులోనూ.. ఇటు బయట కూడా.. నీట్ ప్రశ్నపత్రాలకు సంబంధించిన నిరసనలు కొనసాగుతున్న సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని…