టాలీవుడ్ వేసవి వినోదం టిల్లు స్క్వేర్ మూవీతో మొదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో ఏమాత్రం తగ్గలేదు. టిల్లు పాత్ర మరోసారి పండడం.. అందులో సిద్ధు జొన్నలగడ్డ పెర్ఫామెన్స్ అదిరిపోవడం.. డైలాగులు టపాసుల్లా పేలడంతో టిల్లు స్క్వేర్ థియేటర్లలో కోలాహలం కనిపిస్తోంది. కథ కొంచెం వీక్ అయినా.. లాజిక్కులు కొండెక్కేసినా.. ఎంటర్టైన్మెంట్కు ఢోకా లేకపోవడం టిల్లు స్క్వేర్కు ప్లస్ అయింది. పైసా వసూల్ అనిపిస్తున్న సినిమాతో మెజారిటీ ప్రేక్షకులు సంతృప్తి చెందుతున్నారు. ఐతే సినిమా ఆఖర్లో ప్రేక్షకులు కోరుకున్న మెరుపు లేకపోవడం మాత్రం కొంత నిరాశను మిగిల్చింది.
ఇంతగా క్లిక్ అయిన టిల్లు పాత్రను ఇక్కడితో ఆపేయకుండా సిద్ధు టిల్లు-3 కూడా చేస్తాడని.. దాని గురించి రెండో భాగం చివర్లో హింట్ కచ్చితంగా ఉంటుందని ప్రేక్షకులు అంచనా వేశారు. కానీ అలాంటిదేమీ లేకుండా ఈ కథను ముగించి రోలింగ్ టైటిల్స్ వేసేశారు. దీంతో టిల్లు-3 ఉండదేమో అని ప్రేక్షకులు భావించారు.
కానీ శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్లలో టిల్లు స్క్వేర్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ అసలు విషయం చెప్పాడు. టిల్లు-3 ఉంటుందని.. దాని గురించి హింట్ సినిమాలో పెట్టడం కుదరలేదని వెల్లడించాడు. వీకెండ్ అయ్యాక సినిమాలో ఆ బిట్ యాడ్ చేస్తామని.. సోమవారం నుంచి మూడో పార్ట్ గురించి కొసమెరుపు ఉంటుందని చెప్పాడు. ఇది టిల్లు అభిమానులకు మంచి ఉత్సాహాన్నిచ్చే వార్తే. కాగా తొలి రోజు టిల్లు స్క్వేర్కు రూ.25 కోట్ల మేర గ్రాస్ వస్తుందని అంచనా అని.. ఫుల్ రన్లో ఈ సినిమా వంద కోట్ల మార్కును అందుకుంటుందని వంశీ ధీమా వ్యక్తం చేయడం విశేషం.
This post was last modified on March 30, 2024 8:40 am
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…