టాలీవుడ్ వేసవి వినోదం టిల్లు స్క్వేర్ మూవీతో మొదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో ఏమాత్రం తగ్గలేదు. టిల్లు పాత్ర మరోసారి పండడం.. అందులో సిద్ధు జొన్నలగడ్డ పెర్ఫామెన్స్ అదిరిపోవడం.. డైలాగులు టపాసుల్లా పేలడంతో టిల్లు స్క్వేర్ థియేటర్లలో కోలాహలం కనిపిస్తోంది. కథ కొంచెం వీక్ అయినా.. లాజిక్కులు కొండెక్కేసినా.. ఎంటర్టైన్మెంట్కు ఢోకా లేకపోవడం టిల్లు స్క్వేర్కు ప్లస్ అయింది. పైసా వసూల్ అనిపిస్తున్న సినిమాతో మెజారిటీ ప్రేక్షకులు సంతృప్తి చెందుతున్నారు. ఐతే సినిమా ఆఖర్లో ప్రేక్షకులు కోరుకున్న మెరుపు లేకపోవడం మాత్రం కొంత నిరాశను మిగిల్చింది.
ఇంతగా క్లిక్ అయిన టిల్లు పాత్రను ఇక్కడితో ఆపేయకుండా సిద్ధు టిల్లు-3 కూడా చేస్తాడని.. దాని గురించి రెండో భాగం చివర్లో హింట్ కచ్చితంగా ఉంటుందని ప్రేక్షకులు అంచనా వేశారు. కానీ అలాంటిదేమీ లేకుండా ఈ కథను ముగించి రోలింగ్ టైటిల్స్ వేసేశారు. దీంతో టిల్లు-3 ఉండదేమో అని ప్రేక్షకులు భావించారు.
కానీ శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్లలో టిల్లు స్క్వేర్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ అసలు విషయం చెప్పాడు. టిల్లు-3 ఉంటుందని.. దాని గురించి హింట్ సినిమాలో పెట్టడం కుదరలేదని వెల్లడించాడు. వీకెండ్ అయ్యాక సినిమాలో ఆ బిట్ యాడ్ చేస్తామని.. సోమవారం నుంచి మూడో పార్ట్ గురించి కొసమెరుపు ఉంటుందని చెప్పాడు. ఇది టిల్లు అభిమానులకు మంచి ఉత్సాహాన్నిచ్చే వార్తే. కాగా తొలి రోజు టిల్లు స్క్వేర్కు రూ.25 కోట్ల మేర గ్రాస్ వస్తుందని అంచనా అని.. ఫుల్ రన్లో ఈ సినిమా వంద కోట్ల మార్కును అందుకుంటుందని వంశీ ధీమా వ్యక్తం చేయడం విశేషం.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…