నిన్న దుబాయ్ మేడం టుస్సాడ్ మ్యూజియంలో తన మైనపు బొమ్మ ఆవిష్కరణకు అల్లు అర్జున్ స్వయంగా విచ్చేయడం అభిమానులకు ఎక్కడ లేని ఆనందాన్ని కలిగించింది. ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం 20023 తన కెరీర్ మొదలైన గంగోత్రి విడుదల రోజు మార్చి 28నే ఈ సంఘటన జరగడం బన్నీకి మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ఇలా టాలీవుడ్ నుంచి మైనపు బొమ్మలు ప్రతిష్టించుకునే గౌరవం దక్కించుకున్న ప్రభాస్, మహేష్ బాబు లాంటి స్టార్ల సరసన ఐకాన్ స్టార్ నిలవడం ఫ్యాన్స్ ని ఊపేస్తోంది. దీని తాలూకు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
కేవలం బొమ్మ కోణమనే కాకుండా అల్లు అర్జున్ కు పుష్ప తర్వాత ఒక్కసారిగా స్థాయి ఎక్కడికో వెళ్ళిపోయింది. మహామహులకే సాధ్యం కానీ జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని టాలీవుడ్ కు తీసుకొచ్చింది. అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రతినిధిగా పాల్గొనే గౌరవాన్ని ఇచ్చింది. కేరళ లాంటి ప్రాంతీయాభిమానం మెండుగా ఉన్న రాష్ట్రాల్లో ఫాలోయింగ్ అమాంతం పెంచింది. పుష్ప 2 ది రూల్ మీద ఎంత లేదన్నా వెయ్యి కోట్లకు పైగా థియేటర్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరుగుతుందనే అంచనాలు ట్రేడ్ వర్గాల్లో బలంగా ఉన్నాయి. బ్రాండ్ ఇమేజ్ సైతం ఆకాశమే హద్దుగా పరుగులు పెడుతోంది.
తగ్గేదేలే అన్న మాటను నిజం చేస్తూ అల్లు అర్జున్ దూసుకుపోతున్న వైనం నిజంగానే స్ఫూర్తినిచ్చేదే. ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ మీద అంచనాలు అంతకంతా పెరిగిపోతున్నాయి. రామ్ చరణ్ తో దర్శకుడు సుకుమార్ సినిమా అధికారికంగా ప్రకటించాక కూడా పుష్ప 3 గురించి వార్తలు ఆగడం లేదు. గంగోత్రి హిట్ తో కెరీర్ మొదలై రెండో సినిమా ఆర్యతోనే అదిరిపోయే బ్రేక్ అందుకున్న బన్నీ ఆ తర్వాత రేసు గుర్రం, రుద్రమదేవి, అల వైకుంఠపురములో లాంటి ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశాడు. ఇప్పుడీ టుస్సాడ్ మైలురాయి ప్రయాణంలో ఒక మజిలీ మాత్రమే.
This post was last modified on March 29, 2024 11:20 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…