Movie News

బీజేపీపై సాములోరి ఆగ్ర‌హం.. టికెట్ కోసం బెదిరింపులు!

స‌ర్వ‌సంఘ ప‌రిత్యాగుల‌మ‌ని చెప్పుకొనే స్వాములు.. మ‌ఠాలు న‌డుపుకొనే స్వామీజీలు కూడా.. కొన్నాళ్లుగా రాజ‌కీయ నేత‌లుగా మారిపోయిన విష‌యం తెలిసిందే. మ‌ధ్య ప్ర‌దేశ్‌లోని భోపాల్ నియోజ‌క‌వ‌ర్గం దీనికి తొలి బీజం వేసింది. ఇక్క‌డ నుంచి బీజేపీ త‌ర‌ఫున ఫైర్ బ్రాండ్ మ‌హిళా స్వామీజీ సాధ్వి ప్ర‌జ్ఞ పోటీ చేసి విజయం ద‌క్కించుకున్నారు. ఇక‌, అక్క‌డ నుంచి  బీజేపీలో స్వాములు పోటీ చేయ‌డం విజ‌యం ద‌క్కించుకోవ డం కామ‌న్‌గా మారిపోయింది. యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ కూడా ఇదే బ్యాచ్‌.

ఇక‌, ఎటొచ్చీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే స్వామీజీల‌కు, మ‌ఠాధిప‌తుల‌కు బీజేపీ టికెట్ ఇవ్వ‌లేదు. అయితే.. ఇప్పుడు అది కూడా తెర‌మీదికి వ‌చ్చింది. త‌న‌కు టికెట్ ఇవ్వ‌క‌పోతే.. ఇండిపెండెంట్ అయినా.. పోటీ చేసి గెలుస్తాన‌ని.. కాకినాడ శ్రీపీఠం అధిప‌తి.. బీజేపీ నాయ‌కుడు స్వామిప‌రిపూర్ణానంద తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించారు. దీంతో ఇప్పుడు బీజేపీపై సాములోరికి కోపం వ‌చ్చిందంటూ.. సోష‌ల్ మీడియాలో స‌టైర్లు వేస్తున్నారు.

హిందూపురం నుంచి పోటీచేయాలని ఆశించి భంగపడిన పరిపూర్ణానందస్వామి ఆగ్ర‌హంతో ఊగిపోయారు. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా హిందూపురం టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. అక్కడి నుంచి పోటీచేయాలని భావించిన పరిపూర్ణానందకు ఇది తీవ్ర నిరాశ మిగిలింది. ఈ నేపథ్యంలో ఆయన సంచలన‌ వ్యాఖ్యలు చేశారు. టికెట్ విషయంలో పునరాలోచన చేయకుంటే హిందూపురం నుంచి ఇండిపెండెంట్‌‌గా పోటీచేసేందుకు వెనుకాడబోనని హెచ్చరించారు.

వాస్త‌వానికి గ‌త రెండేళ్లుగా స్వామి ప‌రిపూర్ణానంద‌.. హిందూపురంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌న‌కు టికెట్ ఇవ్వాల‌ని కూడా ఆయ‌న ద‌ర‌ఖాస్తు చేస్తున్నారు. అయితే.. బీజేపీ ఆయ‌న‌కు టికెట్ నిరాకరించిం ది. దీంతో తీవ్ర ఆగ్ర‌హానికి, అదేస‌మ‌యంలో మనస్తాపానికి గురయ్యారు. తాను హిందూపురం నుంచి బరిలోకి దిగుతానని పొత్తులకు ముందే అధిష్ఠానానికి చెప్పానని గుర్తుచేశారు. అయితే.. చిత్రంగా ఇక్క‌డ ఆయ‌న టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

“హిందూపురం సీటును స్వామీజీకి ఇస్తే ముస్లింలు దూరమవుతారని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు.  ముస్లింల కోసం హిందువులను తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యారు. ముస్లింల కోసం 85 శాతం ఓటుబ్యాం కు ఉన్న హిందువులను బొందలో పెట్టేందుకు ఆయన టికెట్ రాకుండా చేశారు. నేను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తిని. దక్షిణాదిలో హిందూపురం చాలా ముఖ్యమైన ప్రాంతం పేరులోనే హిందూ ఉంది. అందుకే ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌డం ఖాయం” అని స్వాములోరు సెలవిచ్చారు.

This post was last modified on March 28, 2024 9:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సుహాస్ స్టామినాకిది అగ్ని పరీక్ష

చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…

59 minutes ago

ఇలాంటి రాజకీయ నాయకులను ఏమనాలి?

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తూ…

1 hour ago

రాజు గారు రెచ్చిపోతున్నారు

నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగాక..…

1 hour ago

కాంట్రావర్సీ ముదురుతున్న కేరళ స్టోరీ 2

వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…

2 hours ago

సుప్రీం వ్యాఖ్యలను రాష్ట్రాలు ఎలా తీసుకుంటాయి?

రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…

2 hours ago

శంకర్‌ డ్రీమ్ ప్రాజెక్టులో ధనుష్?

ఒకప్పుడు శంకర్‌తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…

3 hours ago