Movie News

బీజేపీపై సాములోరి ఆగ్ర‌హం.. టికెట్ కోసం బెదిరింపులు!

స‌ర్వ‌సంఘ ప‌రిత్యాగుల‌మ‌ని చెప్పుకొనే స్వాములు.. మ‌ఠాలు న‌డుపుకొనే స్వామీజీలు కూడా.. కొన్నాళ్లుగా రాజ‌కీయ నేత‌లుగా మారిపోయిన విష‌యం తెలిసిందే. మ‌ధ్య ప్ర‌దేశ్‌లోని భోపాల్ నియోజ‌క‌వ‌ర్గం దీనికి తొలి బీజం వేసింది. ఇక్క‌డ నుంచి బీజేపీ త‌ర‌ఫున ఫైర్ బ్రాండ్ మ‌హిళా స్వామీజీ సాధ్వి ప్ర‌జ్ఞ పోటీ చేసి విజయం ద‌క్కించుకున్నారు. ఇక‌, అక్క‌డ నుంచి  బీజేపీలో స్వాములు పోటీ చేయ‌డం విజ‌యం ద‌క్కించుకోవ డం కామ‌న్‌గా మారిపోయింది. యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ కూడా ఇదే బ్యాచ్‌.

ఇక‌, ఎటొచ్చీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే స్వామీజీల‌కు, మ‌ఠాధిప‌తుల‌కు బీజేపీ టికెట్ ఇవ్వ‌లేదు. అయితే.. ఇప్పుడు అది కూడా తెర‌మీదికి వ‌చ్చింది. త‌న‌కు టికెట్ ఇవ్వ‌క‌పోతే.. ఇండిపెండెంట్ అయినా.. పోటీ చేసి గెలుస్తాన‌ని.. కాకినాడ శ్రీపీఠం అధిప‌తి.. బీజేపీ నాయ‌కుడు స్వామిప‌రిపూర్ణానంద తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించారు. దీంతో ఇప్పుడు బీజేపీపై సాములోరికి కోపం వ‌చ్చిందంటూ.. సోష‌ల్ మీడియాలో స‌టైర్లు వేస్తున్నారు.

హిందూపురం నుంచి పోటీచేయాలని ఆశించి భంగపడిన పరిపూర్ణానందస్వామి ఆగ్ర‌హంతో ఊగిపోయారు. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా హిందూపురం టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. అక్కడి నుంచి పోటీచేయాలని భావించిన పరిపూర్ణానందకు ఇది తీవ్ర నిరాశ మిగిలింది. ఈ నేపథ్యంలో ఆయన సంచలన‌ వ్యాఖ్యలు చేశారు. టికెట్ విషయంలో పునరాలోచన చేయకుంటే హిందూపురం నుంచి ఇండిపెండెంట్‌‌గా పోటీచేసేందుకు వెనుకాడబోనని హెచ్చరించారు.

వాస్త‌వానికి గ‌త రెండేళ్లుగా స్వామి ప‌రిపూర్ణానంద‌.. హిందూపురంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌న‌కు టికెట్ ఇవ్వాల‌ని కూడా ఆయ‌న ద‌ర‌ఖాస్తు చేస్తున్నారు. అయితే.. బీజేపీ ఆయ‌న‌కు టికెట్ నిరాకరించిం ది. దీంతో తీవ్ర ఆగ్ర‌హానికి, అదేస‌మ‌యంలో మనస్తాపానికి గురయ్యారు. తాను హిందూపురం నుంచి బరిలోకి దిగుతానని పొత్తులకు ముందే అధిష్ఠానానికి చెప్పానని గుర్తుచేశారు. అయితే.. చిత్రంగా ఇక్క‌డ ఆయ‌న టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

“హిందూపురం సీటును స్వామీజీకి ఇస్తే ముస్లింలు దూరమవుతారని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు.  ముస్లింల కోసం హిందువులను తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యారు. ముస్లింల కోసం 85 శాతం ఓటుబ్యాం కు ఉన్న హిందువులను బొందలో పెట్టేందుకు ఆయన టికెట్ రాకుండా చేశారు. నేను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తిని. దక్షిణాదిలో హిందూపురం చాలా ముఖ్యమైన ప్రాంతం పేరులోనే హిందూ ఉంది. అందుకే ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌డం ఖాయం” అని స్వాములోరు సెలవిచ్చారు.

This post was last modified on March 28, 2024 9:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మానాన్న‌కు న్యాయం ఎప్పుడు? : సునీత‌

మా నాన్న‌కు న్యాయం ఎప్పుడు జ‌రుగుతుంది? మాకు ఎప్పుడు న్యాయం ల‌భిస్తుంది? అని వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ మ‌ర్రెడ్డి…

20 minutes ago

పవన్ ప్రసంగంతో ఉప్పొంగిన చిరంజీవి!

జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆ పార్టీ అదినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పరిధిలోని…

1 hour ago

ఈ ‘పోటీ’ పిచ్చి ఎంతటి దారుణం చేసిందంటే..?

నిజమే… ఈ విషయం విన్నంతనే.. ఈ సోకాల్డ్ ఆదునిక జనం నిత్యం పరితపిస్తున్న పోటీ… ఇద్దరు ముక్కు పచ్చలారని పిల్లల…

1 hour ago

స్టాలిన్ కు ఇచ్చి పడేసిన పవన్

జనసేన ఆవిర్భావ సభా వేదిక మీద నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా విషయాలను ప్రస్తావించారు. కొన్ని…

11 hours ago

ఛావాకు రెండో బ్రేక్ పడింది

మూడు వారాలు ఆలస్యంగా విడుదలైనా మంచి వసూళ్లతో తెలుగు వెర్షన్ బోణీ మొదలుపెట్టిన ఛావాకు వసూళ్లు బాగానే నమోదవుతున్నా ఏదో…

11 hours ago

ఖైదీ 2 ఎప్పుడు రావొచ్చంటే

సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనగరాజ్ కు మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది ఖైదీ. తెలుగులో…

11 hours ago