ఒక ఏడాది పాటు టాలీవుడ్లో రీరిలీజ్ల హంగామా నడిచింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి టాప్ స్టార్ల పాత సినిమాలు అభిమానులను ఒక ఊపు ఊపేశాయి. కొత్త సినిమాలు కూడా వెలవెలబోయేలా పాత చిత్రాలు వసూళ్ల మోత మోగించడం ట్రేడ్ వర్గాలకు పెద్ద షాక్. అనువాద చిత్రాలు, పైగా ఫస్ట్ రిలీజ్ టైంలో సరిగా ఆడని సూర్య సన్నాఫ్ కృష్ణన్, 3 లాంటి మూవీస్కు కూడా హౌస్ ఫుల్స్ పడటం మామూలు విషయం కాదు.
ఐతే అతి సర్వత్ర వర్జయేత్ అనే ఒక సామెత ప్రకారమే.. ఈ రీరిలీజ్ల సంఖ్య మరీ ఎక్కువ అయిపోవడం.. సరైన ప్లానింగ్ లేకపోవడం ఈ ట్రెండ్ను దెబ్బ కొట్టింది. గత కొన్ని నెలల్లో వచ్చిన రీ రిలీజ్లు ఏవీ పెద్దగా ప్రభావం చూపలేదు. రాను రాను ప్రేక్షకుల్లో వీటి పట్ల ఆసక్తి సన్నగిల్లిపోయింది. ఫలితమే.. పాత సినిమాల రీ రిలీజ్ రైట్స్ కొన్న వాళ్లకు చేదు అనుభవం.
కాగా ఇప్పుడు రెండు పేరున్న పాత సినిమాలు రీ రిలీజ్కు రెడీ అయ్యాయి. అందులో ఒకటి ఇండస్ట్రీ హిట్ అయిన మగధీర. ఇంకోటి బాలయ్య కెరీర్లో అప్పట్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ‘లెజెండ్’. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘మగధీర’ను బుధవారమే రిలీజ్ చేస్తున్నారు. కానీ హైదరాబాద్లోని ఒకట్రెండు మెయిన్ థియేటర్లలో తప్ప రెస్పాన్స్ లేదు. సోషల్ మీడియాలో కూడా దీని గురించి హడావుడి కనిపించడం లేదు. మెగా ఫ్యాన్సే ‘మగధీర’ రీ రిలీజ్ను పెద్దగా ఓన్ చేసుకున్నట్లు కనిపించడం లేదు.
నిజానికి గతంలో వసూళ్ల మోత మోగించిన చాలా రీ రిలీజ్లతో పోలిస్తే.. ‘మగధీర’కు ఎక్కువ క్రేజ్ ఉండాలి. వసూళ్లు కూడా భారీగా రావాలి. కానీ టైమింగ్ తేడా కొట్టడంతో స్పందన అంతంతమాత్రంగా ఉ:ది. ఇక బాలయ్య మూవీ ‘లెజెండ్’ను స్వయంగా నిర్మాతలైన ‘14 రీల్స్’ వాళ్లే రీ రిలీజ్ చేస్తున్నారు. దీని కోసం రీ రిలీజ్ ట్రైలర్ కూడా వదిలారు. కానీ 30న రాబోతున్న ఈ సినిమా గురించి కూడా సామాజిక మాధ్యమాల్లో పెద్దగా సౌండ్ లేదు. బుకింగ్స్, కలెక్షన్లు కూడా గొప్పగా ఉంటాయనే సంకేతాలేమీ కనిపించడం లేదు. చూస్తుంటే రీ రిలీజ్ల వైభవానికి తెరపడినట్లే కనిపిస్తోంది.
This post was last modified on March 27, 2024 2:49 pm
సోషల్ మీడియాలోకి మంగళవారం ఎంట్రీ ఇచ్చిన ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో చూడటానికి పెద్దగా ఏమీ…
ఏపీ అసెంబ్లీలో వైసీపీకి నిబంధనల ప్రకారం ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు అన్న విషయం తెలిసిందే. కానీ, తమకు ప్రతిపక్ష…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను సీఎం చంద్రబాబు అభినందించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన…
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఇటీవల ఊహించని పరిణామం సంచలనం సృష్టించింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది…
అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు అడ్డుకోవడాన్ని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. నిన్న చీకటి…
ఏపీకి మంగళవారం ఓ విశిష్ట అతిథి విచ్చేశారు. నేరుగా ఏపీ రాజదాని అమరావతి వచ్చిన సదరు అతిథి… ఏపీ సీఎం…