ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ కాంబోలో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్టు పుష్ప 2 ది రూల్ కు సంబంధించి రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో సమంతా మరోసారి స్పెషల్ సాంగ్ చేయొచ్చనే టాక్ కూడా ఉంది. మొదటి భాగంలో ఊ అంటావా ఊహూ అంటావా అంటూ హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా అందరిని షేక్ చేసిన సామ్ మళ్ళీ బన్నీతో కాలు కదుపుతోందని, ప్రత్యేకంగా కొన్ని డైలాగులతో కూడిన సన్నివేశాలు కూడా పెట్టారని ప్రచారంలోకి వచ్చింది. కానీ అవేవి నిజం కాదని, అసలు ఆ ఆలోచన కూడా సుకుమార్ లో లేదని యూనిట్ టాక్.
స్పెషల్ సాంగ్ చేయడానికి హీరోయిన్ కోసం సుకుమార్ కసరత్తు చేస్తున్న మాట నిజమే కానీ ఆ టెన్షన్ లో పడి అసలు పనిని రిస్క్ లో పెట్టడం లేదు. సీరియస్ గా టాకీ పార్ట్ ని పూర్తి చేసేందుకు రేయి పగలు కష్టపడుతున్నారు. స్క్రిప్ట్ డిమాండ్ చేయడంతో యాగంటికి వెళ్లి మరీ కీలక ఎపిసోడ్ తీస్తున్నారు. ఫహద్ ఫాసిల్ తో పెండింగ్ ఉన్న సీన్లను త్వరలోనే ఫినిష్ చేయబోతున్నారు. రష్మిక మందన్న ఇతర కమిట్ మెంట్లకు చిన్న బ్రేక్ ఇచ్చి పుష్ప 2కే ఎక్కువ సమయం కేటాయిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ పాటల పని పూర్తి చేసి రీ రికార్డింగ్ చేయడానికి కాపీ కోసం ఎదురు చూస్తున్నాడు.
ఇక వాయిదాకు సంబంధించిన గాసిప్ లో కూడా ఎలాంటి పస లేదు. ఆగస్ట్ 15కి కట్టుబడాలని మైత్రి మేకర్స్ డిసైడ్ అయ్యారు. కల్కి 2898 ఏడి కనక మే నుంచి తప్పుకున్నా సరే దాంతో సహా ఎవరికీ ఆ డేట్ ఇచ్చేందుకు సుముఖంగా లేరు. ఇంకా నాలుగు నెలలే సమయం ఉన్నప్పటికీ బన్నీ, సుకుమార్ ఎలాంటి ఒత్తిడి తీసుకోకుండా ప్లాన్ ప్రకారం మొత్తం పూర్తయ్యేలా చూసుకుంటున్నారు. పబ్లిసిటీని జూన్ నుంచి లాంచ్ చేయబోతున్నారట. ఈసారి ముందు నుంచే హిందీ వెర్షన్ కు సంబంధించిన ప్రమోషన్లను మొదలుపెడతారని తెలిసింది. సో ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వొచ్చు.
This post was last modified on March 27, 2024 12:08 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…