ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ కాంబోలో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్టు పుష్ప 2 ది రూల్ కు సంబంధించి రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో సమంతా మరోసారి స్పెషల్ సాంగ్ చేయొచ్చనే టాక్ కూడా ఉంది. మొదటి భాగంలో ఊ అంటావా ఊహూ అంటావా అంటూ హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా అందరిని షేక్ చేసిన సామ్ మళ్ళీ బన్నీతో కాలు కదుపుతోందని, ప్రత్యేకంగా కొన్ని డైలాగులతో కూడిన సన్నివేశాలు కూడా పెట్టారని ప్రచారంలోకి వచ్చింది. కానీ అవేవి నిజం కాదని, అసలు ఆ ఆలోచన కూడా సుకుమార్ లో లేదని యూనిట్ టాక్.
స్పెషల్ సాంగ్ చేయడానికి హీరోయిన్ కోసం సుకుమార్ కసరత్తు చేస్తున్న మాట నిజమే కానీ ఆ టెన్షన్ లో పడి అసలు పనిని రిస్క్ లో పెట్టడం లేదు. సీరియస్ గా టాకీ పార్ట్ ని పూర్తి చేసేందుకు రేయి పగలు కష్టపడుతున్నారు. స్క్రిప్ట్ డిమాండ్ చేయడంతో యాగంటికి వెళ్లి మరీ కీలక ఎపిసోడ్ తీస్తున్నారు. ఫహద్ ఫాసిల్ తో పెండింగ్ ఉన్న సీన్లను త్వరలోనే ఫినిష్ చేయబోతున్నారు. రష్మిక మందన్న ఇతర కమిట్ మెంట్లకు చిన్న బ్రేక్ ఇచ్చి పుష్ప 2కే ఎక్కువ సమయం కేటాయిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ పాటల పని పూర్తి చేసి రీ రికార్డింగ్ చేయడానికి కాపీ కోసం ఎదురు చూస్తున్నాడు.
ఇక వాయిదాకు సంబంధించిన గాసిప్ లో కూడా ఎలాంటి పస లేదు. ఆగస్ట్ 15కి కట్టుబడాలని మైత్రి మేకర్స్ డిసైడ్ అయ్యారు. కల్కి 2898 ఏడి కనక మే నుంచి తప్పుకున్నా సరే దాంతో సహా ఎవరికీ ఆ డేట్ ఇచ్చేందుకు సుముఖంగా లేరు. ఇంకా నాలుగు నెలలే సమయం ఉన్నప్పటికీ బన్నీ, సుకుమార్ ఎలాంటి ఒత్తిడి తీసుకోకుండా ప్లాన్ ప్రకారం మొత్తం పూర్తయ్యేలా చూసుకుంటున్నారు. పబ్లిసిటీని జూన్ నుంచి లాంచ్ చేయబోతున్నారట. ఈసారి ముందు నుంచే హిందీ వెర్షన్ కు సంబంధించిన ప్రమోషన్లను మొదలుపెడతారని తెలిసింది. సో ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వొచ్చు.
This post was last modified on March 27, 2024 12:08 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…
తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…
ఏపీలో కూటమి ప్రభుత్వం చేసే ఖర్చులు, తీసుకునే నిర్ణయాలను సమీక్షించి.. నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేకంగా మూడు కమిటీలు ఉంటాయి. ఇది…
ఏపీలో కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించి.. ఏడు మాసాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఫీడ్ బ్యాక్ ఏంటి?…
పాతికేళ్ల క్రితం 2001 సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చిన శ్రియ టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడింది. చిరంజీవి, బాలకృష్ణతో మొదలుపెట్టి ప్రభాస్,…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్.. లండన్ నుంచి ఇలా వచ్చారో లేదో.. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు,…