ఆయేషా ఖాన్.. కొన్ని రోజులుగా సోషల్ మీడియలో ట్రెండ్ అవుతున్న పేరు. టాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ ‘ఓం భీం బుష్’లో ఈ అమ్మాయి ఓ పాత్ర చేసింది. సినిమాలో మరీ అంత ప్రాధాన్యం ఉన్న పాత్రేమీ కాదు తనది. ఒక వ్యాంప్ తరహాలో ఉంటుంది తన క్యారెక్టర్.
కానీ హీరోయిన్ ప్రీతి ముకుందన్ కంటే ఆయేషా మీదే ప్రేక్షకుల ఫోకస్ నిలిచింది. అందుక్కారణం ఆమె గ్లామరస్గా కనిపించడం. చేపల ఫ్రై అమ్మే అమ్మాయిగా ఆమె చేసిన క్లీవేజ్ షో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఈ అమ్మాయికి బ్రేక్ ఇవ్వాలని ఫిక్సయిన యువ ప్రేక్షకులు తన పేరును సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు.
ఇంతలోనే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో ఆయేషా చేసిన ‘మోత మోగిపోద్ది’ అనే పాటకు సంబంధించి ప్రోమో రిలీజ్ కాగా.. అందులోనూ ఆయేషా చేసిన క్లీవేజ్ షో పాట పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగించింది. ఈ రోజు దీని లిరికల్ సాంగ్ రిలీజైంది. అందులో ఆయేషా కనిపించిన ప్రతిసారీ హైలైట్ అయింది. కేవలం ఆయేషా వల్లే ఈ పాట ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది.
సూపర్ సెక్సీగా, హాట్ హాట్గా కనిపించే ఆయేషా మున్ముందు టాలీవుడ్ను ఒక ఊపు ఊపేలా కనిపిస్తోంది. హిందీ ‘బిగ్ బాస్’ 17వ సీజన్లో కంటెస్టెంట్గా వెళ్లడం ద్వారా ఆయేషా ఫేమ్ సంపాదించింది. ఆమె సినిమా కెరీర్ టాలీవుడ్తోనే మొదలైంది. ఆల్రెడీ ‘ముఖచిత్రం’ అనే సినిమాలో నటించిన ఆయేషా.. దుల్కర్ సల్మాన్ ‘లక్కీ’ భాస్కర్లోనూ ఒక స్పెషల్ రోల్ చేస్తోంది.
This post was last modified on March 25, 2024 4:23 pm
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…