నిన్ను కోరి, ఊపిరి, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, గీత గోవిందం, మజిలీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ లాంటి చిత్రాల్లో మెస్మరైజింగ్ మెలోడీస్తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్. ఐతే కెరీర్ ఆరంభంలో మాదిరి ఆయన మెరుపులు మెరిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. పైగా పాత ట్యూన్లను రిపీట్ చేస్తున్నాడని.. వేరే సంగీత దర్శకుల పాటలను అనుకరిస్తున్నాడనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
‘గీత గోవిందం’ తర్వాత పరశురామ్-విజయ్ దేవరకొండ కలయికలో తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్’ విషయంలో గోపీసుందర్ ఆరంభం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ సినిమా టీజర్కు అతడి స్కోర్ అస్సలు సూట్ కాలేదు. దాని మీద బాగా ట్రోలింగ్ జరిగింది. పాటల విషయంలోనూ అసంతృప్తే వ్యక్తమవుతోంది.
‘ఫ్యామిలీ స్టార్’ నుంచి రిలీజ్ చేసిన రెండో పాట ‘కళ్యాణి వచ్చా’ పాట చాలా పాత పాటల మిక్స్ లాగా అనిపించింది. ‘ఒక్కడు’ సినిమాలోని ‘అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా..’ పాట ట్యూన్కు చాలా దగ్గరగా అనిపించింది ఈ ట్యూన్. రెంటినీ పోలుస్తూ సోషల్ మీడియాలో గోపీసుందర్ను నెటిజన్లు ఆడుకున్నారు.
ఇక ‘ఫ్యామిలీ స్టార్’ నుంచి కొత్తగా ఇంకో పాట వచ్చింది. మధురము కదా.. అంటూ సాగిన ఆ పాట వినసొంపుగా ఉంది. శ్రీమణి లిరిక్స్తో పాటు ట్యూన్, శ్రేయా ఘోషల్ సింగింగ్.. అన్నీ బాగున్నాయి. కానీ ఈ పాట మొదలవగానే.. ‘దిల్ సే’ సినిమాలోని ‘జియా చలే’ పాటే గుర్తుకు వస్తోంది. సేమ్ స్టయిల్లో ఈ పాట సాగింది. గోపీసుందర్ తెలిసి చేశాడా.. తెలియక చేశాడా తెలియదు కానీ.. ‘జియా చలే’కు ఇది కాపీలాగే ఉంది. ట్యూన్ చేసినపుడు కొంచెమైనా చెక్ చేసుకోరా.. ఇలా కాపీ కొట్టేస్తారా అంటూ నెటిజన్లు అతడిపై కౌంటర్లు వేస్తున్నారు.
This post was last modified on March 25, 2024 4:17 pm
బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా పలు గొప్ప చిత్రాలతో బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…