నిన్ను కోరి, ఊపిరి, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, గీత గోవిందం, మజిలీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ లాంటి చిత్రాల్లో మెస్మరైజింగ్ మెలోడీస్తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్. ఐతే కెరీర్ ఆరంభంలో మాదిరి ఆయన మెరుపులు మెరిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. పైగా పాత ట్యూన్లను రిపీట్ చేస్తున్నాడని.. వేరే సంగీత దర్శకుల పాటలను అనుకరిస్తున్నాడనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
‘గీత గోవిందం’ తర్వాత పరశురామ్-విజయ్ దేవరకొండ కలయికలో తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్’ విషయంలో గోపీసుందర్ ఆరంభం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ సినిమా టీజర్కు అతడి స్కోర్ అస్సలు సూట్ కాలేదు. దాని మీద బాగా ట్రోలింగ్ జరిగింది. పాటల విషయంలోనూ అసంతృప్తే వ్యక్తమవుతోంది.
‘ఫ్యామిలీ స్టార్’ నుంచి రిలీజ్ చేసిన రెండో పాట ‘కళ్యాణి వచ్చా’ పాట చాలా పాత పాటల మిక్స్ లాగా అనిపించింది. ‘ఒక్కడు’ సినిమాలోని ‘అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా..’ పాట ట్యూన్కు చాలా దగ్గరగా అనిపించింది ఈ ట్యూన్. రెంటినీ పోలుస్తూ సోషల్ మీడియాలో గోపీసుందర్ను నెటిజన్లు ఆడుకున్నారు.
ఇక ‘ఫ్యామిలీ స్టార్’ నుంచి కొత్తగా ఇంకో పాట వచ్చింది. మధురము కదా.. అంటూ సాగిన ఆ పాట వినసొంపుగా ఉంది. శ్రీమణి లిరిక్స్తో పాటు ట్యూన్, శ్రేయా ఘోషల్ సింగింగ్.. అన్నీ బాగున్నాయి. కానీ ఈ పాట మొదలవగానే.. ‘దిల్ సే’ సినిమాలోని ‘జియా చలే’ పాటే గుర్తుకు వస్తోంది. సేమ్ స్టయిల్లో ఈ పాట సాగింది. గోపీసుందర్ తెలిసి చేశాడా.. తెలియక చేశాడా తెలియదు కానీ.. ‘జియా చలే’కు ఇది కాపీలాగే ఉంది. ట్యూన్ చేసినపుడు కొంచెమైనా చెక్ చేసుకోరా.. ఇలా కాపీ కొట్టేస్తారా అంటూ నెటిజన్లు అతడిపై కౌంటర్లు వేస్తున్నారు.
This post was last modified on March 25, 2024 4:17 pm
మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్యాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న కన్నప్ప షూటింగ్ లో ప్రభాస్ అడుగు పెట్టాడు.…
ఐదేళ్ల పాలనను పూర్తి చేసుకుని ఎన్నికలకు వెళ్తున్నాడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఐతే 2019 ఎన్నికల ముంగిట ఇచ్చిన…
సినిమాలకు సంబంధించి కొన్ని డేట్లు చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి. వాటి ప్రస్తావన వచ్చినప్పుడంతా అభిమానులు పాత జ్ఞాపకాల్లో మునిగి…
గోనె ప్రకాశరావు. తరచుగా సీఎం జగన్పైనా.. వైసీపీపైనా నిప్పులు చెరిగే మాజీ వైసీపీ నాయకుడు.. ఒకప్పటి వైఎస్ రాజశేఖర్రెడ్డికి మిత్రుడు.…
వచ్చే వారం విడుదల కావాల్సిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి మళ్ళీ వాయిదా పడి మే 17 బదులు మే 31కి…
పవన్ కళ్యాణ్ పేరెత్తితే చాలు.. ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంత కోపం వస్తుందో…