నిన్ను కోరి, ఊపిరి, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, గీత గోవిందం, మజిలీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ లాంటి చిత్రాల్లో మెస్మరైజింగ్ మెలోడీస్తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్. ఐతే కెరీర్ ఆరంభంలో మాదిరి ఆయన మెరుపులు మెరిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. పైగా పాత ట్యూన్లను రిపీట్ చేస్తున్నాడని.. వేరే సంగీత దర్శకుల పాటలను అనుకరిస్తున్నాడనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
‘గీత గోవిందం’ తర్వాత పరశురామ్-విజయ్ దేవరకొండ కలయికలో తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్’ విషయంలో గోపీసుందర్ ఆరంభం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ సినిమా టీజర్కు అతడి స్కోర్ అస్సలు సూట్ కాలేదు. దాని మీద బాగా ట్రోలింగ్ జరిగింది. పాటల విషయంలోనూ అసంతృప్తే వ్యక్తమవుతోంది.
‘ఫ్యామిలీ స్టార్’ నుంచి రిలీజ్ చేసిన రెండో పాట ‘కళ్యాణి వచ్చా’ పాట చాలా పాత పాటల మిక్స్ లాగా అనిపించింది. ‘ఒక్కడు’ సినిమాలోని ‘అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా..’ పాట ట్యూన్కు చాలా దగ్గరగా అనిపించింది ఈ ట్యూన్. రెంటినీ పోలుస్తూ సోషల్ మీడియాలో గోపీసుందర్ను నెటిజన్లు ఆడుకున్నారు.
ఇక ‘ఫ్యామిలీ స్టార్’ నుంచి కొత్తగా ఇంకో పాట వచ్చింది. మధురము కదా.. అంటూ సాగిన ఆ పాట వినసొంపుగా ఉంది. శ్రీమణి లిరిక్స్తో పాటు ట్యూన్, శ్రేయా ఘోషల్ సింగింగ్.. అన్నీ బాగున్నాయి. కానీ ఈ పాట మొదలవగానే.. ‘దిల్ సే’ సినిమాలోని ‘జియా చలే’ పాటే గుర్తుకు వస్తోంది. సేమ్ స్టయిల్లో ఈ పాట సాగింది. గోపీసుందర్ తెలిసి చేశాడా.. తెలియక చేశాడా తెలియదు కానీ.. ‘జియా చలే’కు ఇది కాపీలాగే ఉంది. ట్యూన్ చేసినపుడు కొంచెమైనా చెక్ చేసుకోరా.. ఇలా కాపీ కొట్టేస్తారా అంటూ నెటిజన్లు అతడిపై కౌంటర్లు వేస్తున్నారు.
This post was last modified on March 25, 2024 4:17 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…