నిన్ను కోరి, ఊపిరి, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, గీత గోవిందం, మజిలీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ లాంటి చిత్రాల్లో మెస్మరైజింగ్ మెలోడీస్తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్. ఐతే కెరీర్ ఆరంభంలో మాదిరి ఆయన మెరుపులు మెరిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. పైగా పాత ట్యూన్లను రిపీట్ చేస్తున్నాడని.. వేరే సంగీత దర్శకుల పాటలను అనుకరిస్తున్నాడనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
‘గీత గోవిందం’ తర్వాత పరశురామ్-విజయ్ దేవరకొండ కలయికలో తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్’ విషయంలో గోపీసుందర్ ఆరంభం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ సినిమా టీజర్కు అతడి స్కోర్ అస్సలు సూట్ కాలేదు. దాని మీద బాగా ట్రోలింగ్ జరిగింది. పాటల విషయంలోనూ అసంతృప్తే వ్యక్తమవుతోంది.
‘ఫ్యామిలీ స్టార్’ నుంచి రిలీజ్ చేసిన రెండో పాట ‘కళ్యాణి వచ్చా’ పాట చాలా పాత పాటల మిక్స్ లాగా అనిపించింది. ‘ఒక్కడు’ సినిమాలోని ‘అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా..’ పాట ట్యూన్కు చాలా దగ్గరగా అనిపించింది ఈ ట్యూన్. రెంటినీ పోలుస్తూ సోషల్ మీడియాలో గోపీసుందర్ను నెటిజన్లు ఆడుకున్నారు.
ఇక ‘ఫ్యామిలీ స్టార్’ నుంచి కొత్తగా ఇంకో పాట వచ్చింది. మధురము కదా.. అంటూ సాగిన ఆ పాట వినసొంపుగా ఉంది. శ్రీమణి లిరిక్స్తో పాటు ట్యూన్, శ్రేయా ఘోషల్ సింగింగ్.. అన్నీ బాగున్నాయి. కానీ ఈ పాట మొదలవగానే.. ‘దిల్ సే’ సినిమాలోని ‘జియా చలే’ పాటే గుర్తుకు వస్తోంది. సేమ్ స్టయిల్లో ఈ పాట సాగింది. గోపీసుందర్ తెలిసి చేశాడా.. తెలియక చేశాడా తెలియదు కానీ.. ‘జియా చలే’కు ఇది కాపీలాగే ఉంది. ట్యూన్ చేసినపుడు కొంచెమైనా చెక్ చేసుకోరా.. ఇలా కాపీ కొట్టేస్తారా అంటూ నెటిజన్లు అతడిపై కౌంటర్లు వేస్తున్నారు.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…