‘అంధాదూన్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకి చూపించాలనేది నితిన్ ముచ్చట. అత్యద్భుతమైన కథ కథనాలతో అంతర్జాతీయ శ్రేణి సినిమాలకు తీసిపోని ఆ హిందీ చిత్రాన్ని తెలుగు యువత చాలా వరకు చూసేసినా కానీ మెజారిటీ తెలుగు ప్రేక్షకులకు చూపించాలని నితిన్ ఆశ పడుతున్నాడు. అందుకే ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో చేయాలని తలపెట్టాడు.
ఎక్స్ప్రెస్ రాజా దర్శకుడు మేర్లపాక గాంధీ స్క్రిప్ట్ పని కూడా పూర్తి చేసేసాడు. అయితే అంధాధూన్లో హీరో క్యారెక్టర్ కంటే కీలకం ఒక ఆంటీ పాత్ర. హిందీలో టబు ఆ పాత్రని అద్దిరిపోయే లెవల్లో పర్ఫార్మ్ చేయడం వల్లే ఆ సినిమా అంతగా క్లిక్ అయింది. తెలుగు రీమేక్లో ఆ పాత్ర ఎవరితో చేయించాలనేది నితిన్కి మొదట్నుంచీ సవాల్గా మారింది. ఆ పాత్ర రేంజ్కి తగ్గట్టు వుండాలని నయనతారలాంటి వాళ్లను కూడా సంప్రదించాడు. కానీ అలాంటి పాత్ర చేయడానికి నయనతార ఏకంగా తొమ్మిది కోట్ల పారితోషికం అడిగిందట.
ఆమెకు అంతిస్తే వ్యాపార పరంగా ‘అంధకారం’ తప్పదని భయపడి టబునే సంప్రదించారు. అయితే ఒకసారి చేసేసిన పాత్ర మళ్లీ చేయడం టబుకి నచ్చదు కనుక ఆమె నో అనేసింది. దీంతో శ్రియ, ప్రియమణి లాంటి వాళ్ల పేర్లు పరిశీలనలో వున్నాయి కానీ ఎవరనేది ఇంకా తేలలేదు. నితిన్ మాత్రం అవుట్డేటెడ్ హీరోయిన్లు చేస్తే ఏమి మజా వుంటుందని అంటున్నట్టు సమాచారం.
This post was last modified on September 13, 2020 9:31 pm
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…