‘అంధాదూన్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకి చూపించాలనేది నితిన్ ముచ్చట. అత్యద్భుతమైన కథ కథనాలతో అంతర్జాతీయ శ్రేణి సినిమాలకు తీసిపోని ఆ హిందీ చిత్రాన్ని తెలుగు యువత చాలా వరకు చూసేసినా కానీ మెజారిటీ తెలుగు ప్రేక్షకులకు చూపించాలని నితిన్ ఆశ పడుతున్నాడు. అందుకే ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో చేయాలని తలపెట్టాడు.
ఎక్స్ప్రెస్ రాజా దర్శకుడు మేర్లపాక గాంధీ స్క్రిప్ట్ పని కూడా పూర్తి చేసేసాడు. అయితే అంధాధూన్లో హీరో క్యారెక్టర్ కంటే కీలకం ఒక ఆంటీ పాత్ర. హిందీలో టబు ఆ పాత్రని అద్దిరిపోయే లెవల్లో పర్ఫార్మ్ చేయడం వల్లే ఆ సినిమా అంతగా క్లిక్ అయింది. తెలుగు రీమేక్లో ఆ పాత్ర ఎవరితో చేయించాలనేది నితిన్కి మొదట్నుంచీ సవాల్గా మారింది. ఆ పాత్ర రేంజ్కి తగ్గట్టు వుండాలని నయనతారలాంటి వాళ్లను కూడా సంప్రదించాడు. కానీ అలాంటి పాత్ర చేయడానికి నయనతార ఏకంగా తొమ్మిది కోట్ల పారితోషికం అడిగిందట.
ఆమెకు అంతిస్తే వ్యాపార పరంగా ‘అంధకారం’ తప్పదని భయపడి టబునే సంప్రదించారు. అయితే ఒకసారి చేసేసిన పాత్ర మళ్లీ చేయడం టబుకి నచ్చదు కనుక ఆమె నో అనేసింది. దీంతో శ్రియ, ప్రియమణి లాంటి వాళ్ల పేర్లు పరిశీలనలో వున్నాయి కానీ ఎవరనేది ఇంకా తేలలేదు. నితిన్ మాత్రం అవుట్డేటెడ్ హీరోయిన్లు చేస్తే ఏమి మజా వుంటుందని అంటున్నట్టు సమాచారం.
This post was last modified on September 13, 2020 9:31 pm
ప్యాన్ ఇండియా సినిమాల వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. జూన్ 13 విడుదలను లాక్ చేసుకుని ఆ మేరకు తమిళనాడు…
సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ గురించి తెలుగు నాట తెలియనివారెవరు.? మీడియాకి సంబంధించి ‘సీఈవో’ అన్న పదానికి పెర్ఫెక్ట్ నిర్వచనంగా రవిప్రకాష్…
బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం శ్యామల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల…
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కలలు గన్న…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత, సొంత అన్నపై ఆమె తీవ్రస్థాయిలో యుద్ధం…
పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్డేట్స్…