‘అంధాదూన్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకి చూపించాలనేది నితిన్ ముచ్చట. అత్యద్భుతమైన కథ కథనాలతో అంతర్జాతీయ శ్రేణి సినిమాలకు తీసిపోని ఆ హిందీ చిత్రాన్ని తెలుగు యువత చాలా వరకు చూసేసినా కానీ మెజారిటీ తెలుగు ప్రేక్షకులకు చూపించాలని నితిన్ ఆశ పడుతున్నాడు. అందుకే ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో చేయాలని తలపెట్టాడు.
ఎక్స్ప్రెస్ రాజా దర్శకుడు మేర్లపాక గాంధీ స్క్రిప్ట్ పని కూడా పూర్తి చేసేసాడు. అయితే అంధాధూన్లో హీరో క్యారెక్టర్ కంటే కీలకం ఒక ఆంటీ పాత్ర. హిందీలో టబు ఆ పాత్రని అద్దిరిపోయే లెవల్లో పర్ఫార్మ్ చేయడం వల్లే ఆ సినిమా అంతగా క్లిక్ అయింది. తెలుగు రీమేక్లో ఆ పాత్ర ఎవరితో చేయించాలనేది నితిన్కి మొదట్నుంచీ సవాల్గా మారింది. ఆ పాత్ర రేంజ్కి తగ్గట్టు వుండాలని నయనతారలాంటి వాళ్లను కూడా సంప్రదించాడు. కానీ అలాంటి పాత్ర చేయడానికి నయనతార ఏకంగా తొమ్మిది కోట్ల పారితోషికం అడిగిందట.
ఆమెకు అంతిస్తే వ్యాపార పరంగా ‘అంధకారం’ తప్పదని భయపడి టబునే సంప్రదించారు. అయితే ఒకసారి చేసేసిన పాత్ర మళ్లీ చేయడం టబుకి నచ్చదు కనుక ఆమె నో అనేసింది. దీంతో శ్రియ, ప్రియమణి లాంటి వాళ్ల పేర్లు పరిశీలనలో వున్నాయి కానీ ఎవరనేది ఇంకా తేలలేదు. నితిన్ మాత్రం అవుట్డేటెడ్ హీరోయిన్లు చేస్తే ఏమి మజా వుంటుందని అంటున్నట్టు సమాచారం.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…