‘అంధాదూన్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకి చూపించాలనేది నితిన్ ముచ్చట. అత్యద్భుతమైన కథ కథనాలతో అంతర్జాతీయ శ్రేణి సినిమాలకు తీసిపోని ఆ హిందీ చిత్రాన్ని తెలుగు యువత చాలా వరకు చూసేసినా కానీ మెజారిటీ తెలుగు ప్రేక్షకులకు చూపించాలని నితిన్ ఆశ పడుతున్నాడు. అందుకే ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో చేయాలని తలపెట్టాడు.
ఎక్స్ప్రెస్ రాజా దర్శకుడు మేర్లపాక గాంధీ స్క్రిప్ట్ పని కూడా పూర్తి చేసేసాడు. అయితే అంధాధూన్లో హీరో క్యారెక్టర్ కంటే కీలకం ఒక ఆంటీ పాత్ర. హిందీలో టబు ఆ పాత్రని అద్దిరిపోయే లెవల్లో పర్ఫార్మ్ చేయడం వల్లే ఆ సినిమా అంతగా క్లిక్ అయింది. తెలుగు రీమేక్లో ఆ పాత్ర ఎవరితో చేయించాలనేది నితిన్కి మొదట్నుంచీ సవాల్గా మారింది. ఆ పాత్ర రేంజ్కి తగ్గట్టు వుండాలని నయనతారలాంటి వాళ్లను కూడా సంప్రదించాడు. కానీ అలాంటి పాత్ర చేయడానికి నయనతార ఏకంగా తొమ్మిది కోట్ల పారితోషికం అడిగిందట.
ఆమెకు అంతిస్తే వ్యాపార పరంగా ‘అంధకారం’ తప్పదని భయపడి టబునే సంప్రదించారు. అయితే ఒకసారి చేసేసిన పాత్ర మళ్లీ చేయడం టబుకి నచ్చదు కనుక ఆమె నో అనేసింది. దీంతో శ్రియ, ప్రియమణి లాంటి వాళ్ల పేర్లు పరిశీలనలో వున్నాయి కానీ ఎవరనేది ఇంకా తేలలేదు. నితిన్ మాత్రం అవుట్డేటెడ్ హీరోయిన్లు చేస్తే ఏమి మజా వుంటుందని అంటున్నట్టు సమాచారం.
This post was last modified on September 13, 2020 9:31 pm
యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఒకప్పుడు అంకుశం, ఆగ్రహం, మగాడు లాంటి సూపర్ హిట్స్ తో తొంభై దశకంలో మంచి…
ముఖ్యమంత్రి పదవి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి రాజకీయ నేత సీఎం కావాలనే కోరుకుంటారు. ఇక గ్రాండ్…
ఇవాళ అందరూ బైకర్, రాకాస గురించే మాట్లాడుకుంటున్నారు కానీ వీటితో పాటు కార్మేని సెల్వం అనే డబ్బింగ్ సినిమా రిలీజైన…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని జైలుకు వెళ్లేందుకెు సిద్ధపడిపోయారా? అంటే.. అవుననే సమాధానమే…
అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.…
అమెరికాలో ఉంటున్న తెలుగు అమ్మాయి, ఇన్ఫ్లుయెన్సర్ (పికు నెమలి) సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో…