నార్కోటిక్స్ బ్యూరో విచారణలో రియా చక్రవర్తి ఎనభై శాతం బాలీవుడ్ ప్రముఖుల పేర్లు వెల్లడించిందని, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్కి సమన్లు ఇచ్చిందని వార్తల్లో వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అంత రచ్చ జరుగుతోన్నా కానీ రకుల్ లేదా సారా స్పందించలేదు. బహుశా వాళ్లు ముందు కాదని, తర్వాత నిజంగా విచారణకు హాజరు కావాల్సి వస్తే మీడియాలో ఆగం ఆగం అయిపోతుందని భయపడి వుంటారు.
అయితే ఎన్సిబి ప్రకటనలో అలాంటి లిస్టేమీ తయారు చేయలేదని, ఎవరికీ సమన్లు పంపలేదని స్పష్టం చేసింది. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ సేఫ్ అని తేలిపోయింది. నిన్నంతా రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ప్రముఖంగా ట్రెండ్ అయింది. కొన్ని వార్తాసంస్థలయితే ఒక అడుగు ముందుకెళ్లి క్రిష్ సినిమా షూటింగ్ నుంచి రకుల్ ప్రీత్ సింగ్ వెళ్లిపోయిందని, లాయర్లను వెతుక్కునే పనిలో పడిందని రిపోర్ట్ చేసాయి.
ఇదిలావుంటే రియా చక్రవర్తికి సపోర్ట్ అన్ని వైపుల నుంచీ పెరుగుతోంది. తన ప్రియుడు డ్రగ్స్కి బానిస అయితే ఈమె మూల్యం చెల్లించాల్సి రావడమేంటని, సతీ సహగమనానికి, దీనికీ తేడా ఏముందని ప్రశ్నిస్తున్నారు. ప్రపంచం అంతా ఏకమై తనపై దాడి చేస్తోన్నా తొణకని ఆమె తెగువను మహిళా రైటర్లు తెగ పొగిడేస్తున్నారు.
This post was last modified on September 13, 2020 9:18 pm
వీవీఐపీలు…ప్రత్యేకించి ముఖ్యమంత్రుల కాన్వాయ్ లు వెళ్లే దారిలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. అనుకోని కారణాల వల్ల సీఎం వెళ్లడం కాస్తంత…
తమిళనాడు రాజకీయం రంజుగా సాగుతోంది. గతంలో ఎన్నడూ లేనన్ని ట్విస్టులు అక్కడ చోటుచేసుకుంటున్నాయి. ఇందుకు కారణం నిన్నటిదాకా అక్కడ ఉన్నవి…
దేశంలో అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలు ముగిశాయి. మూడు రాష్ట్రాల్లో అధికార పార్టీలు పరాజయం…
అవును.. దళపతి విజయ్ ఏడ్చేశాడు. అవేమీ తమిళనాడు ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినందుకు వచ్చిన ఆనంద భాష్పాలు కావు. తన…
అందరూ తమిళ రాజకీయాలు, విజయ్ గెలుపు ముచ్చట్లలో పడిపోయారు కానీ పెద్ది ఇంకో ఇరవై ఎనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న…
భాగ్యనగరం హైదరాబాద్లో మహిళల దుస్థితి ఎలా ఉందో.. ఒంటరి మహిళల పట్ల సమాజం ఎలా వ్యవహరిస్తోందో తెలుసుకునే ప్రయత్నం చేసిన…