దర్శకుడు బుచ్చిబాబు డెబ్యూ ఉప్పెన మూడేళ్ళ క్రితం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఒక సున్నితమైన పాయింట్ ని హ్యాండిల్ చేసిన విధానం, సాధారణంగా తెలుగు ప్రేక్షకులు అంగీకరించని హీరో ట్రీట్మెంట్ ని చూపించిన వైనం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలు ఒక్కసారిగా మోస్ట్ వాంటెడ్ లిస్టులోకి చేరిపోయారు. తర్వాత దాన్ని నిలబెట్టుకునే దిశగా సినిమాలు ఎంచుకోకపోవడం వేరే విషయం. ఇంత విజయం సాధించినా ఉప్పెన ఏ భాషలోనూ రీమేక్ కాలేదు. ఎవరూ హక్కులు అడగలేదో లేక మైత్రి వాళ్ళు ఇవ్వలేదో ఇంకా సస్పెన్సే.
అలాంటి ఉప్పెన మీద జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ మనసు పడ్డారు. రెండో కూతురు ఖుషి కపూర్ తో తీస్తే బాగుంటుందనే ఆలోచన ఆయన మనసులో బలంగా ఉంది. నిన్న రామ్ చరణ్ 16 ఓపెనింగ్ సందర్భంగా ఈ విషయం చెప్పడంతో ఆ దిశగా అడుగులు పడొచ్చని ఇన్ సైడ్ టాక్. అయితే ఉప్పెన హిందీలో వర్కౌట్ కావడం ఈజీ కాదు. మన ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కావడానికి కారణం నేటివిటీ. బుచ్చిబాబు దాన్ని ఒడిసిపట్టిన తీరు, సహజంగా తీర్చిదిద్దిన పాత్రలు మరింత చేరువ చేశాయి. అదే మేజిక్ ని బాలీవుడ్ లో రిపీట్ చేయడం మాములు రిస్క్ కాదు.
పైగా ఖుషి కపూర్ తెరంగేట్రం చేసిన ఆర్చీస్ లో నెగటివ్ మార్కులు పడ్డాయి. ఉప్పెన లాంటి ఛాలెంజింగ్ సబ్జెక్టుకి తను సూట్ అవుతుందో చూసుకోవాలి. బోనీ కపూర్ మాత్రం రకరకాల కాంబోలు చూస్తున్నారని వినికిడి. బుచ్చిబాబు చేయలేడు కాబట్టి సమర్ధవంతంగా రీమేక్ చేసే డైరెక్టర్ దొరకాలి. ఇదో పెద్ద తలనెప్పి. జాన్వీని ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలతో మొదలుపెట్టి మెల్లగా సౌత్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ల సరసన అవకాశాలు వచ్చేదాకా సక్సెసయ్యాడు కానీ ఖుషీ కపూర్ ని అదే స్థాయిలో నిలబెట్టడం ఆయనకో సవాల్ గా మారుతోంది.
This post was last modified on March 23, 2024 8:30 am
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…