టాలీవుడ్ యువ కథాానాయకుడు అక్కినేని నాగచైతన్యకు కొన్నేళ్ల నుంచి అంతగా కలిసి రావడం లేదు. తన చివరి రెండు చిత్రాలు కస్టడీ, థ్యాంక్యూ డిజాస్టర్లయ్యాయి. బాలీవుడ్లో అతిథి పాత్రలో నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ కూడా దారుణమైన ఫలితాన్నందుకుంది. అంతకుముందు బంగార్రాజు, లవ్ స్టోరీ, వెంకీ మామ కూడా ఆశించిన ఫలితాలనివ్వలేదు. ఇప్పుడు అతడికి ఒక పెద్ద హిట్ అవసరం.
‘తండేల్’ అలాంటి సినిమానే అవుతుందని ధీమాగా ఉన్నాడు చైతూ. వరుస వైఫల్యాల నేపథ్యంలో ఈసారి చాలా గ్యాప్ తీసుకుని, ఎంతో కసరత్తు చేశాక ఆ సినిమా చేస్తున్నాడు చైతూ. మధ్యలో వేరే కథలు కూడా ఏవీ వినలేదు. ‘తండేల్’ చిత్రీకరణ వేగంగా సాగుతుండటం, ఔట్ పుట్ కూడా చాలా బాగా వస్తుండటంతో ఈ సినిమా మీద ధీమాతో కొత్త కథలు వినడం మొదలుపెట్టాడట చైతూ. తాజాగా అతను ఒక సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది.
‘విరూపాక్ష’తో బ్లాక్ బస్టర్ కొట్టిన యంగ్ డైరెక్టర్ కార్తీక్ దండుతో చైతూ జట్టు కట్టబోతున్నాడట. ‘విరూపాక్ష’ తర్వాత దానికి సీక్వెల్ తీయాలని అనుకున్నాడు కార్తీక్. కానీ ఏవో కారణాల వల్ల అది కుదరలేదు. కొన్నాళ్లు దాని మీద పని చేసి పక్కన పెట్టేశాక చైతూ కోసం వేరే కథ రాయడం.. ఇటీవలే దాన్ని చైతూకు వినిపించి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవడం జరిగాయి. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుందట.
‘విరూపాక్ష’కు భిన్నమైన కథతో ఈసారి సినిమా చేయబోతున్నాడట కార్తీక్. ఇందులో కమర్షియల్ టచ్ ఎక్కువ ఉంటుందట. ‘భమ్ భోలేనాథ్’ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా మారాడు కార్తీక్. కానీ ఆ సినిమా నిరాశపరిచింది. తర్వాత చాలా ఏళ్లు టైం తీసుకుని తన గురువు సుకుమార్ రచనా సహకారంతో చేసిన ‘విరూపాక్ష’ అతడికి ఘనవిజయాన్ని అందించింది.
This post was last modified on March 22, 2024 2:57 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…