టాలీవుడ్ యువ కథాానాయకుడు అక్కినేని నాగచైతన్యకు కొన్నేళ్ల నుంచి అంతగా కలిసి రావడం లేదు. తన చివరి రెండు చిత్రాలు కస్టడీ, థ్యాంక్యూ డిజాస్టర్లయ్యాయి. బాలీవుడ్లో అతిథి పాత్రలో నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ కూడా దారుణమైన ఫలితాన్నందుకుంది. అంతకుముందు బంగార్రాజు, లవ్ స్టోరీ, వెంకీ మామ కూడా ఆశించిన ఫలితాలనివ్వలేదు. ఇప్పుడు అతడికి ఒక పెద్ద హిట్ అవసరం.
‘తండేల్’ అలాంటి సినిమానే అవుతుందని ధీమాగా ఉన్నాడు చైతూ. వరుస వైఫల్యాల నేపథ్యంలో ఈసారి చాలా గ్యాప్ తీసుకుని, ఎంతో కసరత్తు చేశాక ఆ సినిమా చేస్తున్నాడు చైతూ. మధ్యలో వేరే కథలు కూడా ఏవీ వినలేదు. ‘తండేల్’ చిత్రీకరణ వేగంగా సాగుతుండటం, ఔట్ పుట్ కూడా చాలా బాగా వస్తుండటంతో ఈ సినిమా మీద ధీమాతో కొత్త కథలు వినడం మొదలుపెట్టాడట చైతూ. తాజాగా అతను ఒక సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది.
‘విరూపాక్ష’తో బ్లాక్ బస్టర్ కొట్టిన యంగ్ డైరెక్టర్ కార్తీక్ దండుతో చైతూ జట్టు కట్టబోతున్నాడట. ‘విరూపాక్ష’ తర్వాత దానికి సీక్వెల్ తీయాలని అనుకున్నాడు కార్తీక్. కానీ ఏవో కారణాల వల్ల అది కుదరలేదు. కొన్నాళ్లు దాని మీద పని చేసి పక్కన పెట్టేశాక చైతూ కోసం వేరే కథ రాయడం.. ఇటీవలే దాన్ని చైతూకు వినిపించి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవడం జరిగాయి. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుందట.
‘విరూపాక్ష’కు భిన్నమైన కథతో ఈసారి సినిమా చేయబోతున్నాడట కార్తీక్. ఇందులో కమర్షియల్ టచ్ ఎక్కువ ఉంటుందట. ‘భమ్ భోలేనాథ్’ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా మారాడు కార్తీక్. కానీ ఆ సినిమా నిరాశపరిచింది. తర్వాత చాలా ఏళ్లు టైం తీసుకుని తన గురువు సుకుమార్ రచనా సహకారంతో చేసిన ‘విరూపాక్ష’ అతడికి ఘనవిజయాన్ని అందించింది.
This post was last modified on March 22, 2024 2:57 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…