టాలీవుడ్ యువ కథాానాయకుడు అక్కినేని నాగచైతన్యకు కొన్నేళ్ల నుంచి అంతగా కలిసి రావడం లేదు. తన చివరి రెండు చిత్రాలు కస్టడీ, థ్యాంక్యూ డిజాస్టర్లయ్యాయి. బాలీవుడ్లో అతిథి పాత్రలో నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ కూడా దారుణమైన ఫలితాన్నందుకుంది. అంతకుముందు బంగార్రాజు, లవ్ స్టోరీ, వెంకీ మామ కూడా ఆశించిన ఫలితాలనివ్వలేదు. ఇప్పుడు అతడికి ఒక పెద్ద హిట్ అవసరం.
‘తండేల్’ అలాంటి సినిమానే అవుతుందని ధీమాగా ఉన్నాడు చైతూ. వరుస వైఫల్యాల నేపథ్యంలో ఈసారి చాలా గ్యాప్ తీసుకుని, ఎంతో కసరత్తు చేశాక ఆ సినిమా చేస్తున్నాడు చైతూ. మధ్యలో వేరే కథలు కూడా ఏవీ వినలేదు. ‘తండేల్’ చిత్రీకరణ వేగంగా సాగుతుండటం, ఔట్ పుట్ కూడా చాలా బాగా వస్తుండటంతో ఈ సినిమా మీద ధీమాతో కొత్త కథలు వినడం మొదలుపెట్టాడట చైతూ. తాజాగా అతను ఒక సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది.
‘విరూపాక్ష’తో బ్లాక్ బస్టర్ కొట్టిన యంగ్ డైరెక్టర్ కార్తీక్ దండుతో చైతూ జట్టు కట్టబోతున్నాడట. ‘విరూపాక్ష’ తర్వాత దానికి సీక్వెల్ తీయాలని అనుకున్నాడు కార్తీక్. కానీ ఏవో కారణాల వల్ల అది కుదరలేదు. కొన్నాళ్లు దాని మీద పని చేసి పక్కన పెట్టేశాక చైతూ కోసం వేరే కథ రాయడం.. ఇటీవలే దాన్ని చైతూకు వినిపించి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవడం జరిగాయి. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుందట.
‘విరూపాక్ష’కు భిన్నమైన కథతో ఈసారి సినిమా చేయబోతున్నాడట కార్తీక్. ఇందులో కమర్షియల్ టచ్ ఎక్కువ ఉంటుందట. ‘భమ్ భోలేనాథ్’ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా మారాడు కార్తీక్. కానీ ఆ సినిమా నిరాశపరిచింది. తర్వాత చాలా ఏళ్లు టైం తీసుకుని తన గురువు సుకుమార్ రచనా సహకారంతో చేసిన ‘విరూపాక్ష’ అతడికి ఘనవిజయాన్ని అందించింది.
This post was last modified on March 22, 2024 2:57 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…