సిద్ధు జొన్నలగడ్డ క్రేజీ సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ సెట్స్ మీదికి వెళ్లడానికి ముందు హీరోయిన్ ఎంపిక వ్యవహారం హాట్ టాపిక్గా మారడం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రానికి ఒక పట్టాన హీరోయిన్ సెట్ కాలేదు. రకరకాల పేర్లను పరిశీలించారు. కొందరికి లుక్ టెస్టులు కూడా చేశారు. కానీ ఎవరూ సెట్ కాక చివరికి అనుపమ పరమేశ్వరన్ను కథానాయికగా ఎంచుకుంటే.. ఆమె అర్ధంతరంగా సినిమా నుంచి తప్పుకున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ కొన్నాళ్లకు ఆమే ఈ చిత్రంలో నటించింది.
ఈ సినిమాకు సంబంధించి ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్లో అనుపమ తాను ఈ సినిమాలో లిల్లీ పాత్రను తిరస్కరించడం గురించి పరోక్షంగా స్పందించింది. ఇలాంటి పాత్రను వదులుకుంటే తాను స్టుపిడ్ అయ్యేదాన్నని పేర్కొంది.
కాగా ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’ దర్శకుడు మల్లిక్ రామ్ కూడా హీరోయిన్ ఎంపిక విషయంలో జరిగిన తతంగం గురించి మ ాట్లాడాడు. అనుపమ పరమేశ్వరన్ ముందు ఈ సినిమాకు ఓకే చెప్పి తర్వాత తప్పుకోవడం.. మళ్లీ సినిమాలో జాయిన్ కావడం నిజమేనని అతను వెల్లడించాడు. ముందు అనుపమనే కాక మడోన్నా సెబాస్టియన్, మీనాక్షి చౌదరి.. ఇలా రకరకాల పేర్లను పరిశీలించినట్లు.. కొందరికి లుక్ టెస్ట్స్ కూడా చేసినట్లు అతను తెలిపాడు.
ఐతే అనుపమే లిల్లీ పాత్రకు న్యాయం చేయగలదని భావించి ఆమెనే ఫైనల్ చేశామని.. కానీ ఆమె తర్వాత సినిమా నుంచి తప్పుకుని.. మళ్లీ ఈ ప్రాజెక్టులోకి తిరిగొచ్చిందని చెప్పాడు. కథలో బోల్డ్ అంశాలు నచ్చక, ఇంకేవో కారణాలతో అనుపమ తప్పుకున్నట్లు అప్పుడు ప్రచారం జరిగిందని.. కానీ డేట్లు సర్దుబాటు కాకే ముందు సినిమా నుంచి తప్పుకుందని.. తర్వాత సర్దుబాటు చేసుకుని నటించిందని మల్లిక్ తెలిపాడు.
This post was last modified on March 22, 2024 1:56 pm
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తాడిపత్రిలో ఎన్నికల అనంతరం తీవ్ర హింస చెలరేగింది. ఇక్కడ పోటీలో ఉన్న జేసీ…