జాన్వి కపూర్.. ఈ పేరు చూసి ఉత్తరాది అమ్మాయి ఫిక్స్ అయిపోవచ్చు. కానీ ఆమెలో దక్షిణాది మూలాలు ఉన్న సంగతి మరువరాదు. ఆమె తెలుగు కుటుంబంలో పుట్టిన అతిలోక సుందరి శ్రీదేవి తనయురాలు కావడంతో సౌత్ కనెక్షన్ను ఎప్పుడూ మరిచిపోలేదు. చిన్నతనం నుంచే తెలుగు సినిమాలు చూస్తూ తెలుగు సంస్కృతిని అనుసరిస్తూ సాగుతోంది జాన్వి. అంతే కాదు.. తన తల్లి లాగే ఆమెకు తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే విపరీతమైన భక్తి. చిన్నతనం నుంచి జాన్వి తిరుమలకు రాని సంవత్సరమే లేదట.
ఒక వయసు వచ్చేవరకు తల్లిదండ్రులతో కలిసి తిరుమలకు వచ్చేది జాన్వి. యుక్త వయసుకు వచ్చే తనే స్నేహితులతో కలిసి తిరుమలను దర్శిస్తోంది. కొన్ని నెలల కిందటే తిరుమలకు వచ్చిన జాన్వి.. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా తన కొత్త చిత్రం మొదలైన నేపథ్యంలో మరోసారి శ్రీవారిని దర్శించుకుంది.
ఈసారి ప్రత్యేకత ఏంటంటే.. మెట్ల మార్గంలో కాలి నడకన జాన్వి తిరుమలకు చేరుకుంది. దీని కంటే విశేషం ఏంటంటే.. ఆమె మోకాళ్ల మీద శ్రీవారి మెట్లను ఎక్కింది. మెట్ల మీద మామూలుగా నడవడమే కష్టం అంటే.. మోకాళ్ల మీద వెళ్లడమంటే ఇంకా కష్టం. ఒక స్టార్ హీరోయిన్ ఇలా చేయడం అరుదైన విషయం. దీన్ని బట్టే జాన్వికి తిరుమల శ్రీనివాసుడంటే ఎంత భక్తో అర్థం చేసుకోవచ్చు.
జాన్వి ఇప్పటిదాకా 50 సార్లకు పైగానే తిరుమలకు వచ్చిందట. తాను మెట్ల మీద మోకాళ్లతో నడుస్తూ తిరుమలకు చేరుకున్న విషయాన్ని వెల్లడిస్తూ ఈ విషయం చెప్పింది జాన్వి. ఆమెతో పాటు ఇద్దరు స్నేహితులు వచ్చారు. ఇదిలా ఉంటే.. జాన్వి నెమ్మదిగా తెలుగు సినిమాల్లో బిజీ అవుతూ ఇక్కడ టాప్ హీరోయిన్లలో ఒకరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్ అరంగేట్రమే ఎన్టీఆర్ మూవీ ‘దేవర’తో చేస్తున్న ఆమె.. ఇప్పుడు చరణ్తో నటించబోతోంది.
This post was last modified on March 22, 2024 1:48 pm
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మొన్న పోలీసుల అదుపులోని నిందితుడిపై దాడికి యత్నించడం, ఆపై…
సినిమాల్లో గూఢచారులంటే ప్రేక్షకులకు భలే క్రేజు. సూపర్ స్టార్ కృష్ణ 'గూఢచారి 116'తో మొదలుపెట్టి నవీన్ పోలిశెట్టి 'ఏజెంట్ సాయి…
ఏడేళ్ల క్రితం ఒక చిన్న సీన్ ఆమెకు ఓవర్ నైట్ పాపులారిటీ తెచ్చి పెట్టింది. కుర్రాడిని చూస్తూ కన్నుగీటుతున్న సన్నివేశం…
సజ్జల రామకృష్ణారెడ్డి... అటు సొంత పార్టీ వైైసీపీతో పాటు ఇటు ఆ పార్టీ వైరి వర్గాల్లోనూ నిత్యం నానుతూ ఉండే పేరిది.…
ఈ వారం విడుదల కాబోతున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతిలో క్లైమాక్స్ గురించి టీమ్ పదే పదే హైలైట్ చేస్తూ చెప్పడం…
నిన్న ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ మ్యాచ్ చూసి క్రికెట్ అభిమానులు ఊగిపోయారు. ముఖ్యంగా అభిషేక్…