జాన్వి కపూర్.. ఈ పేరు చూసి ఉత్తరాది అమ్మాయి ఫిక్స్ అయిపోవచ్చు. కానీ ఆమెలో దక్షిణాది మూలాలు ఉన్న సంగతి మరువరాదు. ఆమె తెలుగు కుటుంబంలో పుట్టిన అతిలోక సుందరి శ్రీదేవి తనయురాలు కావడంతో సౌత్ కనెక్షన్ను ఎప్పుడూ మరిచిపోలేదు. చిన్నతనం నుంచే తెలుగు సినిమాలు చూస్తూ తెలుగు సంస్కృతిని అనుసరిస్తూ సాగుతోంది జాన్వి. అంతే కాదు.. తన తల్లి లాగే ఆమెకు తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే విపరీతమైన భక్తి. చిన్నతనం నుంచి జాన్వి తిరుమలకు రాని సంవత్సరమే లేదట.
ఒక వయసు వచ్చేవరకు తల్లిదండ్రులతో కలిసి తిరుమలకు వచ్చేది జాన్వి. యుక్త వయసుకు వచ్చే తనే స్నేహితులతో కలిసి తిరుమలను దర్శిస్తోంది. కొన్ని నెలల కిందటే తిరుమలకు వచ్చిన జాన్వి.. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా తన కొత్త చిత్రం మొదలైన నేపథ్యంలో మరోసారి శ్రీవారిని దర్శించుకుంది.
ఈసారి ప్రత్యేకత ఏంటంటే.. మెట్ల మార్గంలో కాలి నడకన జాన్వి తిరుమలకు చేరుకుంది. దీని కంటే విశేషం ఏంటంటే.. ఆమె మోకాళ్ల మీద శ్రీవారి మెట్లను ఎక్కింది. మెట్ల మీద మామూలుగా నడవడమే కష్టం అంటే.. మోకాళ్ల మీద వెళ్లడమంటే ఇంకా కష్టం. ఒక స్టార్ హీరోయిన్ ఇలా చేయడం అరుదైన విషయం. దీన్ని బట్టే జాన్వికి తిరుమల శ్రీనివాసుడంటే ఎంత భక్తో అర్థం చేసుకోవచ్చు.
జాన్వి ఇప్పటిదాకా 50 సార్లకు పైగానే తిరుమలకు వచ్చిందట. తాను మెట్ల మీద మోకాళ్లతో నడుస్తూ తిరుమలకు చేరుకున్న విషయాన్ని వెల్లడిస్తూ ఈ విషయం చెప్పింది జాన్వి. ఆమెతో పాటు ఇద్దరు స్నేహితులు వచ్చారు. ఇదిలా ఉంటే.. జాన్వి నెమ్మదిగా తెలుగు సినిమాల్లో బిజీ అవుతూ ఇక్కడ టాప్ హీరోయిన్లలో ఒకరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్ అరంగేట్రమే ఎన్టీఆర్ మూవీ ‘దేవర’తో చేస్తున్న ఆమె.. ఇప్పుడు చరణ్తో నటించబోతోంది.
This post was last modified on March 22, 2024 1:48 pm
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…