Movie News

జాన్వి కపూర్‌ది మామూలు భక్తి కాదు

జాన్వి కపూర్.. ఈ పేరు చూసి ఉత్తరాది అమ్మాయి ఫిక్స్ అయిపోవచ్చు. కానీ ఆమెలో దక్షిణాది మూలాలు ఉన్న సంగతి మరువరాదు. ఆమె తెలుగు కుటుంబంలో పుట్టిన అతిలోక సుందరి శ్రీదేవి తనయురాలు కావడంతో సౌత్ కనెక్షన్‌‌ను ఎప్పుడూ మరిచిపోలేదు. చిన్నతనం నుంచే తెలుగు సినిమాలు చూస్తూ తెలుగు సంస్కృతిని అనుసరిస్తూ సాగుతోంది జాన్వి. అంతే కాదు.. తన తల్లి లాగే ఆమెకు తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే విపరీతమైన భక్తి. చిన్నతనం నుంచి జాన్వి తిరుమలకు రాని సంవత్సరమే లేదట.

ఒక వయసు వచ్చేవరకు తల్లిదండ్రులతో కలిసి తిరుమలకు వచ్చేది జాన్వి. యుక్త వయసుకు వచ్చే తనే స్నేహితులతో కలిసి తిరుమలను దర్శిస్తోంది. కొన్ని నెలల కిందటే తిరుమలకు వచ్చిన జాన్వి.. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా తన కొత్త చిత్రం మొదలైన నేపథ్యంలో మరోసారి శ్రీవారిని దర్శించుకుంది.

ఈసారి ప్రత్యేకత ఏంటంటే.. మెట్ల మార్గంలో కాలి నడకన జాన్వి తిరుమలకు చేరుకుంది. దీని కంటే విశేషం ఏంటంటే.. ఆమె మోకాళ్ల మీద శ్రీవారి మెట్లను ఎక్కింది. మెట్ల మీద మామూలుగా నడవడమే కష్టం అంటే.. మోకాళ్ల మీద వెళ్లడమంటే ఇంకా కష్టం. ఒక స్టార్ హీరోయిన్ ఇలా చేయడం అరుదైన విషయం. దీన్ని బట్టే జాన్వికి తిరుమల శ్రీనివాసుడంటే ఎంత భక్తో అర్థం చేసుకోవచ్చు.

జాన్వి ఇప్పటిదాకా 50 సార్లకు పైగానే తిరుమలకు వచ్చిందట. తాను మెట్ల మీద మోకాళ్లతో నడుస్తూ తిరుమలకు చేరుకున్న విషయాన్ని వెల్లడిస్తూ ఈ విషయం చెప్పింది జాన్వి. ఆమెతో పాటు ఇద్దరు స్నేహితులు వచ్చారు. ఇదిలా ఉంటే.. జాన్వి నెమ్మదిగా తెలుగు సినిమాల్లో బిజీ అవుతూ ఇక్కడ టాప్ హీరోయిన్లలో ఒకరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్ అరంగేట్రమే ఎన్టీఆర్ మూవీ ‘దేవర’తో చేస్తున్న ఆమె.. ఇప్పుడు చరణ్‌తో నటించబోతోంది.

This post was last modified on March 22, 2024 1:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మోడీ – షా’లకు పరాభవం స్వయంకృతమే!

వరుసబెట్టి మూడు పర్యాయాలు కేంద్రంలో అధికారం దక్కించుకున్న ఎన్డీఏ కూటమికి శుక్రవారం గట్టి షాకే తగిలింది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఏళ్ల తరబడి…

59 minutes ago

జైల‌ర్‌-2 నుంచి కంటెంట్ లీక్‌?

విడుద‌ల కోసం ఎదురు చూస్తున్న‌ జ‌న‌నాగ‌య‌న్ లాంటి భారీ చిత్రాన్ని ఆన్ లైన్‌లో లీక్ అయిపోవ‌డం ఎంత సంచ‌ల‌నం రేపిందో…

3 hours ago

మ‌హాసేన రాజేష్ వాట్ నెక్ట్స్‌… !

మహాసేన రాజేష్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కరలేదు. యూట్యూబ‌ర్‌గా ప్రారంభమైన రాజేష్ ప్రస్థానం తర్వాత కాలంలో రాజకీయాల వైపు…

7 hours ago

లోకేష్ టీం.. బ‌రువు బాధ్య‌త‌లు ఎక్కువే!

టీడీపీ రాష్ట్ర, జాతీయ క‌మిటీల‌ను తాజాగా ప్ర‌క‌టించారు. వీటిలో మెజారిటీ ప‌ద‌వుల‌ను యువ‌త‌కు కేటా యించారు. దీనినే పార్టీలో కొంద‌రు…

7 hours ago

‘మమ్మీ’ అభిమానులకు దెయ్యం షాక్

ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం 1999లో విడుదలైన ది మమ్మీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా కల్ట్ ఫాలోయింగ్ ఉంది. రెండో భాగంగా…

9 hours ago

100 కోట్ల హీరో… ముందే హింట్ ఇచ్చాడు

ఏ బ్యాగ్రౌండ్ లేని ఒక కొత్త కుర్రాడు.. లుక్స్ పరంగా చూస్తే హీరోలా అనిపించడు.. అలాంటోడు తొలి చిత్రంతోనే వంద…

9 hours ago