నిన్న ప్రారంభోత్సవం జరుపుకున్న రామ్ చరణ్ 16 ఇంకా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లకుండానే విపరీతమైన చర్చల్లో నిలుస్తోంది. ఓపెనింగ్ కు ముందే ఇందులో కీలక పాత్ర చేస్తున్న కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇస్తున్న వీడియోలు ఆల్రెడీ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరో అప్డేట్ క్రేజీగా ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ ఆర్సి 16లో విలన్ గా బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ ని తీసుకొస్తున్నారట. ఆల్రెడీ రామ్, పూరి జగన్నాధ్ డబుల్ ఇస్మార్ట్ లో నెగటివ్ రోల్ చేస్తున్న సంజు బాబా చరణ్ మూవీకి కూడా ఓకే చెప్పినట్టు ముంబై టాక్.
చూస్తుంటే బుచ్చిబాబు ఆషామాషీగా క్యాస్టింగ్ ని సెట్ చేసుకోవడం లేదనిపిస్తోంది. పెద్ది టైటిల్ ని దాదాపు ఖరారు చేయొచ్చట. రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి 27 ఒక పోస్టర్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది టీమ్. హిందీ నుంచి జాన్వీ కపూర్ – సంజయ్ దత్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్ ఇలా క్రేజీ నటీనటులను ఏరికోరి తీసుకొస్తున్న ఈ ఉప్పెన దర్శకుడు ఇంకో రెండు కీలక పాత్రల కోసం ఓ మలయాళ నటుడు, మరో హిందీ సీనియర్ స్టార్ ని ట్రై చేస్తున్నట్టు సమాచారం. మొదట్లో విజయ్ సేతుపతిని అనుకున్నా డేట్ల సమస్య వల్ల ఆ ఛాన్స్ కాస్తా శాండల్ వుడ్ స్టార్ కొట్టేశారు.
రాబోయే రోజుల్లో మరింత ఎగ్జైట్ మెంట్ కలిగించే విషయాలు దీని గురించి వినిపిస్తాయని తెలుస్తోంది. ఏఆర్ రెహమాన్ ఇప్పటికే మూడు పాటలు ఇచ్చేశారు. మరో మూడు వేసవిలోగా అయిపోతాయి. గేమ్ ఛేంజర్ నుంచి బయటికి రాగానే చిన్న విశ్రాంతి తీసుకుని చరణ్ ఈ సెట్లో అడుగు పెడతాడు. కథ చాలా షాకింగ్ గా ఉంటుందని, పల్లెటూరి నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ కమర్షియల్ అంశాలను బుచ్చిబాబు రాసుకున్న తీరు సుకుమార్ ని సైతం విపరీతంగా మెప్పించిందట. ఇవన్నీ చూస్తూ మెగా ఫ్యాన్స్ ఆనందం ఏ స్థాయిలో ఉంటుందో వేరే చెప్పాలా.
This post was last modified on March 21, 2024 3:40 pm
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్కు…
ఎన్నికలు ఏవైనా.. ప్రజలకు 'ఫ్రీ బీస్' ఉండాల్సిందే. అవి స్థానికమా.. అసెంబ్లీనా, పార్లమెంటా? అనే విషయంతో సంబంధం లేకుండా పోయింది.…