టాలీవుడ్ టాప్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా చరణ్ అభిమానులు ఎప్పుడూ చెప్పుకునే సినిమాల్లో రంగస్థలం ఒకటి. పెర్ఫార్మన్స్ వరంగా ఆర్ఆర్ఆర్ కంటే దీన్నే బెస్ట్ మూవీగా వాళ్ళు ఫీలవ్వడంలో తప్పేం లేదు. దర్శకుడు సుకుమార్ ని ఒక్కసారిగా అగ్ర పీఠం కోసం పోటీ పడేలా చేసింది కూడా ఈ చిత్రమే. అలాంటి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కావాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. అల్లు అర్జున్ తో పుష్ప రెండు భాగాలు కమిటయ్యాక నాలుగేళ్లకు పైగా సుకుమార్ లాక్ అయిపోయాడు. పైగా దాని ఫలితం ప్యాన్ ఇండియా రేంజ్ చేరుకోవడంతో బ్రాండ్ ఇమేజ్ కూడా పెరిగిపోయింది.
సో సరైన సమయంలో మళ్ళీ ఈ కాంబో కార్యరూపం దాల్చబోతోంది. మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజున మైత్రి మూవీ మేకర్స్ దీన్ని అఫీషియల్ గా ప్రకటించబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఈ విషయాన్ని మొన్న పద్నాలుగో తేదినే మా సైట్ ఎక్స్ క్లూజివ్ గా బహిర్గత పరిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే ఖరారుగా ప్రకటన రూపంలో బర్త్ డే కానుకగా ఇవ్వబోతున్నట్టు తెలిసింది. అయితే షూటింగ్ కు వెళ్ళడానికి టైం చాలా పడుతుంది. ఎందుకంటే పుష్ప 2 ది రూల్ ఆగస్ట్ 15 విడుదలయ్యే దాకా సుకుమార్ ఫ్రీ అవ్వలేడు. ఆ తర్వాతే చరణ్ ప్రాజెక్టు తాలూకు స్క్రిప్ట్ పనులు చూసుకోవాల్సి ఉంటుంది.
ఇంకోవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి విముక్తి పొందగానే నిన్న లాంఛనంగా మొదలైన బుచ్చిబాబు సినిమా సెట్లో అడుగు పెట్టాలి. కనీసం ఏడాది నిర్మాణానికి వేసుకున్నా 2025 సమ్మర్ దాటిపోతుంది. అప్పటికంత సుకుమార్ ఫైనల్ వెర్షన్ ని సిద్ధం చేసుకోవచ్చు. ఒకవేళ పుష్ప 3 ఉండే పనైతే ఈ గ్యాప్ ఇంకాస్త పెరుగుతుంది. రంగస్థలంని మించి మరో మాస్ డ్రామాని ఆ కలయికలో ఆశించవచ్చు. సంగీతం దేవిశ్రీ ప్రసాదే అందిస్తాడని మరో న్యూస్. చరణ్ ఇమేజ్ లో అమాంతం పెరిగిపోయిన దృష్ట్యా ఈసారి సుకుమార్ చూపించబోయే ఎలివేషన్లు మాములుగా ఉండవని వేరే చెప్పాలా.
This post was last modified on March 21, 2024 12:08 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…