ఆకాశం నీ హద్దురాతో జాతీయ స్థాయి గుర్తింపు, అవార్డులు దక్కించుకున్న దర్శకురాలు సుధా కొంగర హీరో సూర్య కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందని ప్రకటించి అయిదు నెలలు దాటేసింది. పురాననూరు టైటిల్ తో భారీ మల్టీ స్టారర్ గా దీన్ని ప్లాన్ చేసుకున్నారు. దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాసిల్, నజ్రియా, విజయ్ వర్మ లాంటి టాలెంటెడ్ తారాగణాన్ని సెట్ చేసుకున్నారు. కానీ ఇప్పటిదాకా ఇది రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళలేదు. క్యాన్సిలయ్యిందనే వార్త కోలీవుడ్ వర్గాల్లో గుప్పుమనడంతో సూర్య అభిమానులు టెన్షన్ పడ్డారు. నిప్పు లేనిదే పొగరాదనే తరహాలో ప్రచారం జరిగింది.
సూర్య, సుధా కొంగరల మధ్య విభేదాల నేపథ్యంలో ఇలా జరిగిందనే టాక్ వచ్చింది. అయితే సినిమా బృందం వీటిని కొట్టి పారేస్తున్నారు. ఆలస్యమవుతున్న మాట నిజమే కానీ ప్రాజెక్ట్ ఆన్ లోనే ఉందని, అతి త్వరలో సెట్స్ పైకి వెళ్తుందని, మీ ప్రేమకు అభిమానానికి కృతజ్ఞతలని సోషల్ మీడియాలో పేర్కొనడం డౌట్లను క్లియర్ చేసింది. అయినా కూడా అభిమానుల్లో పూర్తిగా అనుమానం తొలగిపోలేదు. ప్రస్తుతం సుధా కొంగర హిందీలో అక్షయ్ కుమార్ తో ఆకాశం నీ హద్దురాని రీమేక్ చేస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తయ్యింది. నిర్మాణ భాగస్వాముల్లో సూర్య, జ్యోతిక ఉన్నారు.
అలాంటప్పుడు అభిప్రాయభేదాలు ఎక్కడ వచ్చాయనేదే సందేహం. దీనికన్నా ముందు సుధా కొంగర విజయ్ తో ఒక సినిమా చేయాలని చాలా ప్రయత్నించింది కానీ సాధ్యపడలేదు. కథ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడం వల్లే ముందుకెళ్లలేదని వినిపించింది. సూర్య కంగువ మీదే పూర్తి ఫోకస్ పెట్టాడు. వెట్రిమారన్ తో చేయాల్సిన వడివాసల్ కూడా ఉంటుందో లేదోనని వార్తలు వస్తున్నాయి. రెండు భాగాల కంగువ తనకు బాహుబలి స్థాయిలో గుర్తింపు తెస్తుందని సూర్య చాలా నమ్మకంగా ఉన్నాడు. అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ లో లాంచ్ చేసిన టీజర్ లో విజువల్స్ అబ్బురపరిచేలా ఉన్నాయి.
This post was last modified on March 20, 2024 10:32 am
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…