ఇటీవలే ప్రేమలు డిస్ట్రిబ్యూషన్ తో అటు మార్కెటింగ్ ఇటు బిజినెస్ రెండింట్లోనూ సక్సెస్ సాధించిన ఎస్ఎస్ కార్తికేయ ప్రొడక్షన్ పరంగానూ మంచి అడుగులు వేస్తున్నాడు. రాజమౌళి ప్యాన్ ఇండియా సినిమాలకు సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడంతో పాటు వీటిని సమాంతరంగా నడిపించబోతున్నాడు. అందులో భాగంగా మలయాళం హీరో ఫహద్ ఫాసిల్ తో ఒకటి కాదు ఏకంగా రెండు భారీ చిత్రాల డీల్ కుదుర్చుకున్నాడు. ఆర్కా మీడియా శోభు యార్లగడ్డతో కలిసి వీటి నిర్మాణాన్ని ఇవాళ అధికారికంగా ప్రకటించాడు. ఒకటి ఈ ఏడాది, మరొకటి 2025లో రిలీజ్ కాబోతున్నాయి.
వీటి వెనుక ఉన్న సంగతులేంటో చూద్దాం. మొదటిది ఆక్సిజన్. సిద్దార్థ్ నాదెళ్ల దర్శకుడు. ఇతనికిది డెబ్యూ. సైరా నరసింహారెడ్డికి ఏడిగా పనిచేయడంతో పాటు నటుడిగానూ చేశాడు. సత్యదేవ్ 47 డేస్ లోనూ ఉన్నాడు. ఒక నిజ జీవిత ఘటనను ఆధారంగా చేసుకుని సీరియస్ ఇష్యూ మీద ఉంటుందని పోస్టర్ చూస్తే అర్థమైపోతుంది. వాయు కాలుష్యంని హైలైట్ చేసేలా ఉన్నారు. రెండోది డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఇది ఎంటర్ టైనర్. దర్శకుడు శశాంక్ యేలేటి. మన ముగ్గురి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ తో గతంలో లాంచ్ అయ్యాడు. చంద్రశేఖర్ యేలేటి దగ్గర శిష్యరికం అనుభవం నేర్పింది.
ఈ ఇద్దరు కార్తికేయతో గత కొంత కాలంగా స్క్రిప్ట్ మీద పని చేస్తున్నారు. కథలు చెప్పిన కొంతసేపటికి రెండూ చేయడానికి ఫహద్ ఫాసిల్ ఒప్పుకోవడం పట్ల కార్తికేయ చాలా హ్యాపీగా ఉన్నాడు. సరైన టాలెంట్ ని పసిగట్టడం పెద్ద టాస్క్ గా మారిపోయిన పరిస్థితుల్లో ఇలా కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడం మంచి పరిణామం. క్రియేటివ్ కాన్సెప్ట్స్ కు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందని ఋజువవుతూనే ఉన్నా కథల ఎంపికలో వేసే తప్పటడుగుల వల్ల కొందరు డెబ్యూతోనే మాయమైపోతున్నారు. టైటిల్స్ చూస్తుంటే కార్తికేయ టీమ్ ఏదో కొత్తగా ట్రై చేస్తున్నట్టు కనిపిస్తోంది. చూడాలి ఎలా ఉండబోతున్నాయో.
వైసిపి నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరిన మాజీమంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ పరిస్థితి అగమ్య గోచరంగా…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో…
పెద్ది వీకెండ్ ఘనంగా పూర్తి చేసుకుంది. టాక్స్, రివ్యూస్, కాంట్రావర్సీ సంగతి ఎలా ఉన్నా జనం థియేటర్లకు పోటెత్తిన మాట…
అందరూ సవాళ్లు రువ్వుతున్నారు.. తాను మాత్రం తక్కువ తిన్నానా.. అని అనుకున్నారో ఏమో.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు.. ఆసక్తికర…
ఇంకో మూడు రోజుల్లో జూన్ 10 బాలకృష్ణ పుట్టినరోజు రానుంది. ఈసారి గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకునేందుకు అభిమానులు రెడీ…
బాహుబలి సినిమాను అప్పట్లో టాలీవుడ్ను మించి బాలీవుడ్యే ఎక్కువగా మోసింది. అందుక్కారణం అగ్ర నిర్మాత కరణ్ జోహార్ ఆ చిత్రాన్ని…