Movie News

కార్తికేయకు ఫహద్ ఫాసిల్ డబుల్ బొనాంజా

ఇటీవలే ప్రేమలు డిస్ట్రిబ్యూషన్ తో అటు మార్కెటింగ్ ఇటు బిజినెస్ రెండింట్లోనూ సక్సెస్ సాధించిన ఎస్ఎస్ కార్తికేయ ప్రొడక్షన్ పరంగానూ మంచి అడుగులు వేస్తున్నాడు. రాజమౌళి ప్యాన్ ఇండియా సినిమాలకు సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడంతో పాటు వీటిని సమాంతరంగా నడిపించబోతున్నాడు. అందులో భాగంగా మలయాళం హీరో ఫహద్ ఫాసిల్ తో ఒకటి కాదు ఏకంగా రెండు భారీ చిత్రాల డీల్ కుదుర్చుకున్నాడు. ఆర్కా మీడియా శోభు యార్లగడ్డతో కలిసి వీటి నిర్మాణాన్ని ఇవాళ అధికారికంగా ప్రకటించాడు. ఒకటి ఈ ఏడాది, మరొకటి 2025లో రిలీజ్ కాబోతున్నాయి.

వీటి వెనుక ఉన్న సంగతులేంటో చూద్దాం. మొదటిది ఆక్సిజన్. సిద్దార్థ్ నాదెళ్ల దర్శకుడు. ఇతనికిది డెబ్యూ. సైరా నరసింహారెడ్డికి ఏడిగా పనిచేయడంతో పాటు నటుడిగానూ చేశాడు. సత్యదేవ్ 47 డేస్ లోనూ ఉన్నాడు. ఒక నిజ జీవిత ఘటనను ఆధారంగా చేసుకుని సీరియస్ ఇష్యూ మీద ఉంటుందని పోస్టర్ చూస్తే అర్థమైపోతుంది. వాయు కాలుష్యంని హైలైట్ చేసేలా ఉన్నారు. రెండోది డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఇది ఎంటర్ టైనర్. దర్శకుడు శశాంక్ యేలేటి. మన ముగ్గురి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ తో గతంలో లాంచ్ అయ్యాడు. చంద్రశేఖర్ యేలేటి దగ్గర శిష్యరికం అనుభవం నేర్పింది.

ఈ ఇద్దరు కార్తికేయతో గత కొంత కాలంగా స్క్రిప్ట్ మీద పని చేస్తున్నారు. కథలు చెప్పిన కొంతసేపటికి రెండూ చేయడానికి ఫహద్ ఫాసిల్ ఒప్పుకోవడం పట్ల కార్తికేయ చాలా హ్యాపీగా ఉన్నాడు. సరైన టాలెంట్ ని పసిగట్టడం పెద్ద టాస్క్ గా మారిపోయిన పరిస్థితుల్లో ఇలా కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడం మంచి పరిణామం. క్రియేటివ్ కాన్సెప్ట్స్ కు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందని ఋజువవుతూనే ఉన్నా కథల ఎంపికలో వేసే తప్పటడుగుల వల్ల కొందరు డెబ్యూతోనే మాయమైపోతున్నారు. టైటిల్స్ చూస్తుంటే కార్తికేయ టీమ్ ఏదో కొత్తగా ట్రై చేస్తున్నట్టు కనిపిస్తోంది. చూడాలి ఎలా ఉండబోతున్నాయో.

This post was last modified on March 19, 2024 7:43 pm

Share

Recent Posts

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

17 minutes ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

22 minutes ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

2 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

3 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

4 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

4 hours ago