ఇటీవలే ప్రేమలు డిస్ట్రిబ్యూషన్ తో అటు మార్కెటింగ్ ఇటు బిజినెస్ రెండింట్లోనూ సక్సెస్ సాధించిన ఎస్ఎస్ కార్తికేయ ప్రొడక్షన్ పరంగానూ మంచి అడుగులు వేస్తున్నాడు. రాజమౌళి ప్యాన్ ఇండియా సినిమాలకు సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడంతో పాటు వీటిని సమాంతరంగా నడిపించబోతున్నాడు. అందులో భాగంగా మలయాళం హీరో ఫహద్ ఫాసిల్ తో ఒకటి కాదు ఏకంగా రెండు భారీ చిత్రాల డీల్ కుదుర్చుకున్నాడు. ఆర్కా మీడియా శోభు యార్లగడ్డతో కలిసి వీటి నిర్మాణాన్ని ఇవాళ అధికారికంగా ప్రకటించాడు. ఒకటి ఈ ఏడాది, మరొకటి 2025లో రిలీజ్ కాబోతున్నాయి.
వీటి వెనుక ఉన్న సంగతులేంటో చూద్దాం. మొదటిది ఆక్సిజన్. సిద్దార్థ్ నాదెళ్ల దర్శకుడు. ఇతనికిది డెబ్యూ. సైరా నరసింహారెడ్డికి ఏడిగా పనిచేయడంతో పాటు నటుడిగానూ చేశాడు. సత్యదేవ్ 47 డేస్ లోనూ ఉన్నాడు. ఒక నిజ జీవిత ఘటనను ఆధారంగా చేసుకుని సీరియస్ ఇష్యూ మీద ఉంటుందని పోస్టర్ చూస్తే అర్థమైపోతుంది. వాయు కాలుష్యంని హైలైట్ చేసేలా ఉన్నారు. రెండోది డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఇది ఎంటర్ టైనర్. దర్శకుడు శశాంక్ యేలేటి. మన ముగ్గురి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ తో గతంలో లాంచ్ అయ్యాడు. చంద్రశేఖర్ యేలేటి దగ్గర శిష్యరికం అనుభవం నేర్పింది.
ఈ ఇద్దరు కార్తికేయతో గత కొంత కాలంగా స్క్రిప్ట్ మీద పని చేస్తున్నారు. కథలు చెప్పిన కొంతసేపటికి రెండూ చేయడానికి ఫహద్ ఫాసిల్ ఒప్పుకోవడం పట్ల కార్తికేయ చాలా హ్యాపీగా ఉన్నాడు. సరైన టాలెంట్ ని పసిగట్టడం పెద్ద టాస్క్ గా మారిపోయిన పరిస్థితుల్లో ఇలా కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడం మంచి పరిణామం. క్రియేటివ్ కాన్సెప్ట్స్ కు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందని ఋజువవుతూనే ఉన్నా కథల ఎంపికలో వేసే తప్పటడుగుల వల్ల కొందరు డెబ్యూతోనే మాయమైపోతున్నారు. టైటిల్స్ చూస్తుంటే కార్తికేయ టీమ్ ఏదో కొత్తగా ట్రై చేస్తున్నట్టు కనిపిస్తోంది. చూడాలి ఎలా ఉండబోతున్నాయో.
This post was last modified on March 19, 2024 7:43 pm
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…