ప్రపంచమంతా మెచ్చుకున్న బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ వచ్చి రెండేళ్లవుతున్నా దానికి సంబంధించిన విశేషాలు, చర్చలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జపాన్ లో ప్రీమియర్ కు ప్రత్యేకంగా హాజరైన దర్శక ధీర రాజమౌళి కొన్ని షాకింగ్ అనిపించే సంగతులు పంచుకున్నారు. కొమరం భీమ్, జెన్నీ జంటకు సంబంధించిన ముఖ్యమైన సీన్లు కొన్ని రాసుకుని తర్వాత ఎడిటింగ్ లో తీసేయాల్సి వచ్చిందని, కొంత భాగం స్క్రిప్ట్ లోనే కోతకు గురయ్యిందని, నిడివి నుంచి వచ్చిన సమస్య వల్ల డైరెక్టర్ గా ఇష్టం లేకపోయినా ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.
జక్కన్న చెప్పిన దాని ప్రకారం జెన్నీ జైల్లో ఉన్న భీమ్ కు సహాయం చేసేందుకు స్వంత బంగాళాలోనే ప్లాన్ పత్రాలు దొంగతనం చేశాక అతనికి స్వయంగా అందించే ఎపిసోడ్ కాస్త లెన్త్ తో ఉంటుందట. బురద నిండిన బూట్లతో వచ్చిన ఆమెను చూసి ఒకరు అనుమానంతో చూడగా అప్పుడు అసలు నిజం బయట పడుతుంది. భీమ్ ని అప్పగించమనే క్రమంలో జరిగిన సంఘర్షణలో తుపాకీ గుళ్ల వల్ల జెన్నీ స్వంతవాళ్ల చేతిలోనే ప్రాణాలు కోల్పోతుంది. ఇది ట్రాజెడీ అవుతుంది కాబట్టి అది ఇష్టం లేక తీసేయాల్సి వచ్చిందని రాజమౌళి చెప్పడం అక్కడున్న వాళ్ళను ఆశ్చర్యానికి గురి చేసింది.
దీన్ని బట్టి రామరాజు, సీత తరహాలోనే రాజమౌళి భీమ్, జెన్నీలకు ట్రాక్ రాసుకున్నారు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తీసేయాల్సి వచ్చిందన్న మాట. ఒకవేళ ఆర్ఆర్ఆర్ కనక రెండు భాగాలు అయ్యుంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు కానీ ఒక్క పార్ట్ కే పరిమితం చేయాలని నిర్ణయించుకోవడంతో మూడు గంటల నాలుగు నిమిషాలకు పరిమితం చేయాల్సి వచ్చింది. ఇదంతా సరే కానీ ఎడిటింగ్ లో ఇలా పక్కకెళ్ళిపోయిన ఫుటేజ్ ని ప్రత్యేకంగా ఆన్ లైన్ లో రిలీజ్ చేయమని జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. రాజమౌళి వాళ్ళ కోరికను మన్నిస్తారేమో చూడాలి.
This post was last modified on March 19, 2024 11:40 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…