ప్రపంచమంతా మెచ్చుకున్న బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ వచ్చి రెండేళ్లవుతున్నా దానికి సంబంధించిన విశేషాలు, చర్చలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జపాన్ లో ప్రీమియర్ కు ప్రత్యేకంగా హాజరైన దర్శక ధీర రాజమౌళి కొన్ని షాకింగ్ అనిపించే సంగతులు పంచుకున్నారు. కొమరం భీమ్, జెన్నీ జంటకు సంబంధించిన ముఖ్యమైన సీన్లు కొన్ని రాసుకుని తర్వాత ఎడిటింగ్ లో తీసేయాల్సి వచ్చిందని, కొంత భాగం స్క్రిప్ట్ లోనే కోతకు గురయ్యిందని, నిడివి నుంచి వచ్చిన సమస్య వల్ల డైరెక్టర్ గా ఇష్టం లేకపోయినా ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.
జక్కన్న చెప్పిన దాని ప్రకారం జెన్నీ జైల్లో ఉన్న భీమ్ కు సహాయం చేసేందుకు స్వంత బంగాళాలోనే ప్లాన్ పత్రాలు దొంగతనం చేశాక అతనికి స్వయంగా అందించే ఎపిసోడ్ కాస్త లెన్త్ తో ఉంటుందట. బురద నిండిన బూట్లతో వచ్చిన ఆమెను చూసి ఒకరు అనుమానంతో చూడగా అప్పుడు అసలు నిజం బయట పడుతుంది. భీమ్ ని అప్పగించమనే క్రమంలో జరిగిన సంఘర్షణలో తుపాకీ గుళ్ల వల్ల జెన్నీ స్వంతవాళ్ల చేతిలోనే ప్రాణాలు కోల్పోతుంది. ఇది ట్రాజెడీ అవుతుంది కాబట్టి అది ఇష్టం లేక తీసేయాల్సి వచ్చిందని రాజమౌళి చెప్పడం అక్కడున్న వాళ్ళను ఆశ్చర్యానికి గురి చేసింది.
దీన్ని బట్టి రామరాజు, సీత తరహాలోనే రాజమౌళి భీమ్, జెన్నీలకు ట్రాక్ రాసుకున్నారు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తీసేయాల్సి వచ్చిందన్న మాట. ఒకవేళ ఆర్ఆర్ఆర్ కనక రెండు భాగాలు అయ్యుంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు కానీ ఒక్క పార్ట్ కే పరిమితం చేయాలని నిర్ణయించుకోవడంతో మూడు గంటల నాలుగు నిమిషాలకు పరిమితం చేయాల్సి వచ్చింది. ఇదంతా సరే కానీ ఎడిటింగ్ లో ఇలా పక్కకెళ్ళిపోయిన ఫుటేజ్ ని ప్రత్యేకంగా ఆన్ లైన్ లో రిలీజ్ చేయమని జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. రాజమౌళి వాళ్ళ కోరికను మన్నిస్తారేమో చూడాలి.
This post was last modified on March 19, 2024 11:40 am
రణ్బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వచ్చిన ‘యానిమల్’ 2023లో బాక్సాఫీస్ బిగ్ హిట్ గా నిలిచిన విషయం…
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ప్రపంచంలో మరో కోణాన్ని బయటపెట్టాడు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పర్సనల్ చారిటీ వర్క్ గురించి…
వరుణ్ తేజ్ కు చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ఇచ్చిన సినిమాగా కొరియన్ కనకరాజు తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్…
గుజరాత్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. రోజుల పరిధిలోనే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను బలికొనడం భయాందోళన కలిగిస్తుంది.…
కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ…
2027 సంక్రాంతి పందెం క్రమంగా వేడెక్కుతోంది. శర్వానంద్ - శ్రీను వైట్ల కాంబో ' జార్జ్ క్రిష్' జనవరి 14…