ప్రపంచమంతా మెచ్చుకున్న బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ వచ్చి రెండేళ్లవుతున్నా దానికి సంబంధించిన విశేషాలు, చర్చలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జపాన్ లో ప్రీమియర్ కు ప్రత్యేకంగా హాజరైన దర్శక ధీర రాజమౌళి కొన్ని షాకింగ్ అనిపించే సంగతులు పంచుకున్నారు. కొమరం భీమ్, జెన్నీ జంటకు సంబంధించిన ముఖ్యమైన సీన్లు కొన్ని రాసుకుని తర్వాత ఎడిటింగ్ లో తీసేయాల్సి వచ్చిందని, కొంత భాగం స్క్రిప్ట్ లోనే కోతకు గురయ్యిందని, నిడివి నుంచి వచ్చిన సమస్య వల్ల డైరెక్టర్ గా ఇష్టం లేకపోయినా ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.
జక్కన్న చెప్పిన దాని ప్రకారం జెన్నీ జైల్లో ఉన్న భీమ్ కు సహాయం చేసేందుకు స్వంత బంగాళాలోనే ప్లాన్ పత్రాలు దొంగతనం చేశాక అతనికి స్వయంగా అందించే ఎపిసోడ్ కాస్త లెన్త్ తో ఉంటుందట. బురద నిండిన బూట్లతో వచ్చిన ఆమెను చూసి ఒకరు అనుమానంతో చూడగా అప్పుడు అసలు నిజం బయట పడుతుంది. భీమ్ ని అప్పగించమనే క్రమంలో జరిగిన సంఘర్షణలో తుపాకీ గుళ్ల వల్ల జెన్నీ స్వంతవాళ్ల చేతిలోనే ప్రాణాలు కోల్పోతుంది. ఇది ట్రాజెడీ అవుతుంది కాబట్టి అది ఇష్టం లేక తీసేయాల్సి వచ్చిందని రాజమౌళి చెప్పడం అక్కడున్న వాళ్ళను ఆశ్చర్యానికి గురి చేసింది.
దీన్ని బట్టి రామరాజు, సీత తరహాలోనే రాజమౌళి భీమ్, జెన్నీలకు ట్రాక్ రాసుకున్నారు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తీసేయాల్సి వచ్చిందన్న మాట. ఒకవేళ ఆర్ఆర్ఆర్ కనక రెండు భాగాలు అయ్యుంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు కానీ ఒక్క పార్ట్ కే పరిమితం చేయాలని నిర్ణయించుకోవడంతో మూడు గంటల నాలుగు నిమిషాలకు పరిమితం చేయాల్సి వచ్చింది. ఇదంతా సరే కానీ ఎడిటింగ్ లో ఇలా పక్కకెళ్ళిపోయిన ఫుటేజ్ ని ప్రత్యేకంగా ఆన్ లైన్ లో రిలీజ్ చేయమని జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. రాజమౌళి వాళ్ళ కోరికను మన్నిస్తారేమో చూడాలి.
This post was last modified on March 19, 2024 11:40 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…