మాములుగా స్టార్ల సినిమా క్లైమాక్స్ లు చాలా భారీగా ఉంటాయి. విలన్ డెన్ను, ఫైట్లు, సవాళ్లు విసురుకుంటూ చెప్పే డైలాగులు అబ్బో వ్యవహారం మాములుగా ఉండదు. అలాంటిది హీరోతో ఒక్క డైలాగు చెప్పించకుండా, కేవలం హీరోయిన్ తో మాట్లాడించి చివర్లో అసలు ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకుండా తీస్తే ఎలా ఉంటుంది. అబ్బే అసలు ఆడదనుకుంటాం కదా. కానీ ఈ థియరీని పూర్తిగా మార్చి నిరూపించిన సినిమా రాజా. పాతికేళ్ల క్రితం1999 ఇదే మార్చి 18న విడుదలై ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ లో చోటు సంపాదించుకున్న రాజా వెనుక ఉన్న ప్రత్యేకమైన విశేషాలేంటో చూద్దాం.
1998 తమిళంలో కార్తీక్, రోజా జంటగా విక్రమన్ దర్శకత్వంలో ఉన్నైడతిల్ ఎన్నై కొడుతేన్ వచ్చింది. ఊహించని స్థాయిలో గొప్ప విజయం సాధించింది. నాన్ స్టాప్ గా 250 రోజులు ఆడి రికార్డులు సృష్టించింది. దీన్ని తెలుగులో రీమేక్ చేసే ఉద్దేశంతో ఆర్బి చౌదరి హక్కులు కొని వెంకటేష్, సౌందర్య తో ముప్పలనేని డైరెక్షన్ లో రూపొందించారు. మాస్ నుంచి ఫ్యామిలీస్ కి షిఫ్ట్ అయ్యే క్రమంలో దీన్ని ఎంచుకోవడం వెంకటేష్ ఆలోచనధోరణిని మార్చేసింది. ఒక అమ్మాయి జీవితంలో పైకి రావడం కోసం ఎంతో త్యాగం చేసి కష్టపడే పాత్రలో వెంకీ నటన క్లాసు మాసు తేడా లేకుండా కట్టిపడేసింది.
దెబ్బకు మాస్ చిత్రాల రేంజ్ లో రాజాకు కనకవర్షం కురిసింది. సెంటిమెంటుకి మగాళ్లు కూడా కదిలిపోయారు. ప్రారంభంలో కాసేపు దొంగగా కనిపించి ఆ తర్వాత పూర్తి సాత్వికంగా మారిపోయి సౌందర్యను గొప్ప స్థాయికి తీసుకెళ్లే క్యారెక్టర్ లో వెంకటేష్ జీవించాడు. సౌందర్యతో పాటు ఇతర ఆర్టిస్టులు ప్రాణం పోయడం ఒరిజినల్ వెర్షన్ కన్నా మిన్నగా రాజాని తీర్చిదిద్దింది. ఎస్ఎ రాజ్ కుమార్ స్వరపరిచిన పాటలు ఊరు వాడా మ్రోగిపోయాయి. 71 కేంద్రాల్లో శతదినోత్సవం, 4 సెంటర్లలో రజతోత్సవం జరుపుకున్న రాజాకు ఇవాళ సిల్వర్ జూబ్లీ ఇయర్. రీమేక్ అయినా ఎమోషన్ సరిగ్గా పండితే ఏమవుతుందో రాజానే ఉదాహరణ.
This post was last modified on March 18, 2024 4:20 pm
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…