ఈ వారం మార్చి 22 విడుదల కాబోతున్న సినిమాల్లో ఓం భీమ్ బుష్ ఒకటే చెప్పుకోదగినది. యువి క్రియేషన్స్ బ్యాకప్ ఉండటంతో మంచి రిలీజ్ ప్లాన్ చేశారు. హీరో శ్రీవిష్ణుతో పాటు ప్రధాన పాత్రలు పోషించిన ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేస్తున్నారు. వెరైటీ కాన్సెప్ట్స్ తో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం జరుగుతోంది. హుషారు ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ కామెడీ థ్రిల్లర్ లో హారర్, సస్పెన్స్ కూడా ఉన్నాయి. దీంతో పాటు రిలీజవుతున్న లైన్ మ్యాన్, హద్దులేదురా, కలియుగ పట్టణంలో లాంటి చిన్న చిత్రాలకు ఏమంత బజ్ లేదు.
ఇదంతా ఓకే కానీ నిజానికి అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు కూడా ముందు ఇదే డేట్ కు ప్లాన్ చేసుకున్నారు. మార్చి మొదటివారంలో పోస్టర్లు కూడా వచ్చాయి. కానీ ట్రైలర్ లాంచ్ నుంచి సీన్ మారిపోయింది. తప్పకోకుండానే తప్పుకున్న సంకేతాలు ఇచ్చారు. అయితే ఓం భీమ్ బుష్ తో పోటీ వద్దనుకుని డ్రాప్ అయ్యిందా లేక ప్రమోషన్లకు టైం సరిపోలేదా, కారణం ఏదైతేనేం ఆ ఒక్కటి అడక్కుకి ఆప్షన్లు క్లిష్టమవుతున్నాయి. మార్చి 29 టిల్లు స్క్వేర్ రావడం పక్కా. దీని క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇంకో రెండు మూడు రోజుల్లో భారీ ఎత్తున ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్నారు.
ఈ లెక్కన శ్రీవిష్ణుతో కాంపిటీషన్ కన్నా సిద్దు జొన్నలగడ్డతో ఫేస్ టు ఫేస్ ఇంకా రిస్క్ అవుతుంది. ఒకవేళ ఏప్రిల్ 5 అనుకుంటే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కాచుకుని ఉన్నాడు. తండ్రి ఈవీవీ క్లాసిక్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్న అల్లరి నరేష్ ఈసారి తన బలమైన జానర్ కి తిరిగి వస్తున్నానన్న నమ్మకంతో ఉన్నాడు. అలాంటప్పుడు వీలైనంత సేఫ్ గేమ్ అవసరం. అసలే బాక్సాఫీస్ దగ్గర ఫిబ్రవరి నుంచి పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఇలాంటి టైంలో ఓం భీమ్ బుష్ తో పాటే వచ్చినా కూడా ఇబ్బంది ఉండేది కాదు కానీ డ్రాప్ కావడం తీవ్ర ఆలోచనలో పడేసింది.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…