హీరోలు కండలు పెంచి కనిపించడం, సిక్స్ప్యాక్లు చేయడం ముందుగా బాలీవుడ్లో మొదలైన ట్రెండ్. దాన్ని సౌత్ హీరోలు కొంచెం లేటుగా అందిపుచ్చుకున్నారు. అప్పట్లో అల్లు అర్జున్ ‘దేశముదురు’ కోసం సిక్స్ ప్యాక్ చేస్తే అదో పెద్ద సెన్సేషన్ అయింది. ఆ తర్వాత టాలీవుడ్, కోలీవుడ్లోనూ అది ట్రెండుగా మారింది.
యాక్షన్ ప్రధానంగా సాగే సినిమాల్లో హీరోగా ఫిట్గా కనిపించాల్సిన అవసరం పడితే.. హీరోలు చాలా కష్టపడి అవతారం మార్చుకుంటున్నారు. రామ్ చరణ్ లాంటి హీరోలు కళ్లు చెదిరే రీతిలో బాడీలను బిల్డ్ చేశారు. ఐతే ఇప్పటిదాకా సౌత్ హీరోలందరి చిజిల్డ్ బాడీ లుక్స్ ఒకెత్తయితే.. ఇప్పుడు తమిళ హీరో ఆర్య కొత్త లుక్ మరో ఎత్తు. అతను ‘మిస్టర్ ఎక్స్’ అనే సినిమా కోసం బాడీని పెంచిన తీరు చూస్తే షాకవ్వక మానరు.
తెలుగులో కూడా విడుదలైన ‘ఎఫ్ఐఆర్’ అనే సినిమాకు దర్శకత్వం వహించిన మను ఆనంద్ డైరెక్షన్లో ఆర్య ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం గత ఏడాది ఏప్రిల్లో అతను అవతారం మార్చుకోవడం మొదులపెట్టాడు. వర్కౌట్ మొదలుపెట్టడానికి ముందు తాను ఎలా ఉన్నానో ఒక ఫొటో పెట్టి.. ఆ తర్వాత ఎలాంటి లుక్లోకి వచ్చానో చూపిస్తూ అతను ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఫొటోలు ట్విట్టర్లో షేర్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ గత ఏడాదే పూర్తయిందని.. సినిమాలో పాత్ర పరిణామ క్రమానికి తగ్గట్లు అవతారం మార్చుకున్నానని.. ప్రస్తుతం చివరి షెడ్యూల్ నడుస్తోందని అతను వెల్లడించాడు.
ఆర్య లుక్స్ చూసి ఒక క్యారెక్టర్ కోసం హీరో ఇంతగా కష్టపడతాడా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. తన డెడికేషన్కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఆర్య తెలుగులో ‘వరుడు’, ‘సైజ్ జీరో, ‘సైంధవ్’ లాంటి చిత్రాల్లో నటించాడు.
This post was last modified on March 18, 2024 1:59 pm
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…