ప్రభాస్ కొత్త సినిమా ‘ఆదిపురుష్’ను ప్రకటించినప్పటికీ అది వార్తల్లో నిలుస్తోంది. దీని బడ్జెట్, కాస్టింగ్, టెక్నీషియన్ల గురించి అనేక రకాల వార్తలొస్తున్నాయి. ఇండియాలో అత్యధికంగా రూ.500 కోట్ల బడ్జెట్లో తెరకెక్కనున్న చిత్రంగా ‘ఆదిపురుష్’ను చెబుతున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పని చేయనున్నారు. ప్రి ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనుండగా.. అతడిని ఢీకొట్టే రావణుడి పాత్రకు సైఫ్ అలీ ఖాన్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ సరసన సీతగా కనిపించే నటి ఎవరనే విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముందు ఈ పాత్రకు కీర్తి సురేష్ పేరు వినిపించింది. ఐతే బాలీవుడ్ నటి అయితేనే ఈ సినిమాకు కలిసొస్తుందన్న అభిప్రాయం చాలామందిలో కలిగింది. ఆ తర్వాత కియారా అద్వానీ పేరు తెరపైకి వచ్చింది.
ఐతే ‘లస్ట్ స్టోరీస్’ లాంటి ఎరోటిక్ వెబ్ సిరీస్లో నటించిన కియారాను సీతగా చూపిస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారా అన్న ప్రశ్న తలెత్తింది. ఈలోపు సీతగా కొత్త పేరు ప్రచారంలోకి వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్, క్రికెటర్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మదే ఆ పేరు కావడం విశేషం. బాలీవుడ్ మీడియాలో సీతగా అనుష్క అంటూ గట్టిగా ప్రచారం జరుగుతుండటం విశేషం.
ఐతే ప్రస్తుతం అనుష్క గర్భవతి అనే విషయం మరిచిపోతున్నారు. 2021 తొలి నెలలో ఆమెకు ప్రసవం జరగబోతోంది. ఆ సమయానికి ‘ఆది పురుష్’ చిత్రీకరణ మొదలుపెట్టాలనుకుంటున్నారు. వచ్చే ఏడాదే సినిమా కూడా పూర్తి చేయాలన్న టార్గెట్ పెట్టుకున్నారు. ప్రసవం తర్వాత కొన్ని నెలల్లోనే చిత్రీకరణకు హాజరవ్వాలని అనుష్క అనుకుంటుందా.. కోహ్లి అందుకు అనుమతిస్తాడా అన్నది సందేహం.
అనుష్క ఇప్పటికే సినిమాలు తగ్గించేసింది. ఆమెను బాలీవుడ్ ఫిలిం మేకర్స్ సంప్రదించడం మానేశారు. అలాంటిది గర్భవతిగా ఉన్న ఆమెను ‘ఆదిపురుష్’ టీం ఎందుకు సంప్రదిస్తుంది? ఇంత చిన్న లాజిక్ పట్టించుకోకుండా సీతగా అనుష్క అంటూ ఎలా ప్రచారం చేస్తున్నారో?
This post was last modified on September 12, 2020 7:33 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…