ప్రభాస్ కొత్త సినిమా ‘ఆదిపురుష్’ను ప్రకటించినప్పటికీ అది వార్తల్లో నిలుస్తోంది. దీని బడ్జెట్, కాస్టింగ్, టెక్నీషియన్ల గురించి అనేక రకాల వార్తలొస్తున్నాయి. ఇండియాలో అత్యధికంగా రూ.500 కోట్ల బడ్జెట్లో తెరకెక్కనున్న చిత్రంగా ‘ఆదిపురుష్’ను చెబుతున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పని చేయనున్నారు. ప్రి ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనుండగా.. అతడిని ఢీకొట్టే రావణుడి పాత్రకు సైఫ్ అలీ ఖాన్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ సరసన సీతగా కనిపించే నటి ఎవరనే విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముందు ఈ పాత్రకు కీర్తి సురేష్ పేరు వినిపించింది. ఐతే బాలీవుడ్ నటి అయితేనే ఈ సినిమాకు కలిసొస్తుందన్న అభిప్రాయం చాలామందిలో కలిగింది. ఆ తర్వాత కియారా అద్వానీ పేరు తెరపైకి వచ్చింది.
ఐతే ‘లస్ట్ స్టోరీస్’ లాంటి ఎరోటిక్ వెబ్ సిరీస్లో నటించిన కియారాను సీతగా చూపిస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారా అన్న ప్రశ్న తలెత్తింది. ఈలోపు సీతగా కొత్త పేరు ప్రచారంలోకి వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్, క్రికెటర్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మదే ఆ పేరు కావడం విశేషం. బాలీవుడ్ మీడియాలో సీతగా అనుష్క అంటూ గట్టిగా ప్రచారం జరుగుతుండటం విశేషం.
ఐతే ప్రస్తుతం అనుష్క గర్భవతి అనే విషయం మరిచిపోతున్నారు. 2021 తొలి నెలలో ఆమెకు ప్రసవం జరగబోతోంది. ఆ సమయానికి ‘ఆది పురుష్’ చిత్రీకరణ మొదలుపెట్టాలనుకుంటున్నారు. వచ్చే ఏడాదే సినిమా కూడా పూర్తి చేయాలన్న టార్గెట్ పెట్టుకున్నారు. ప్రసవం తర్వాత కొన్ని నెలల్లోనే చిత్రీకరణకు హాజరవ్వాలని అనుష్క అనుకుంటుందా.. కోహ్లి అందుకు అనుమతిస్తాడా అన్నది సందేహం.
అనుష్క ఇప్పటికే సినిమాలు తగ్గించేసింది. ఆమెను బాలీవుడ్ ఫిలిం మేకర్స్ సంప్రదించడం మానేశారు. అలాంటిది గర్భవతిగా ఉన్న ఆమెను ‘ఆదిపురుష్’ టీం ఎందుకు సంప్రదిస్తుంది? ఇంత చిన్న లాజిక్ పట్టించుకోకుండా సీతగా అనుష్క అంటూ ఎలా ప్రచారం చేస్తున్నారో?
This post was last modified on September 12, 2020 7:33 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…