గత ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హాట్ టాపిక్.. వైఎస్ రాజశేఖర్ తమ్ముడు, వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్యే. ముందు ఆయనది సహజ మరణం అని.. గుండెపోటుతోనే ఆయన చనిపోయారని స్వయంగా సాక్షి మీడియాలో వార్తలు వచ్చాయి. వైకాపా నేతలు కూడా కొందరు అదే ప్రకటన చేశారు. తీరా చూస్తే ఆయనది దారుణ హత్య అనే విషయం వెల్లడైంది. అప్పుడు వివేకాను చంపించింది నారా చంద్రబాబు నాయుడే అని సాక్షి మీడియా, వైకాపా నేతలు ఎలా ప్రచారం చేశారో తెలిసిందే. ఐ
తే జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక ఈ విషయాన్ని రుజువు చేయలేకపోయింది. ఈ కేసులో సీబీఐ విచారణ సైతం వద్దని జగన్ చెప్పడం చర్చనీయాంశం అయింది. రోజులు గడిచేకొద్దీ వివేకా హత్యకు సంబంధించి వేళ్లన్నీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు జగన్ వైపు చూపించాయి. గత ఎన్నికల లాగే ఈసారి కూడా వివేకా హత్య కేసు చర్చనీయాంశం అవుతోంది.
ఇలాంటి తరుణంలో వివేకా మీద ఒక బయోపిక్ సైతం రెడీ అవడం విశేషం. దీని వెనుక ఎవరున్నారో ఏంటో కానీ.. ఈ రోజు రిలీజైన వివేకా బయోపిక్ ‘వివేకం’ ట్రైలర్ చూస్తే.. టార్గెట్ జగన్ అండ్ కోనే అని అర్థమవుతుంది. వైఎస్ మరణానంతరం జగన్ సొంతంగా పార్టీ పెట్టడం, కాంగ్రెస్లోనే ఉండాలని భావించిన వివేకాను కుటుంబం ద్వారా ఒత్తిడి చేయించి వైకాపాలో చేరేలా చూడడం.. ఆ తర్వాత ఆయన్ని ఓడించేందుకు తెర వెనుక కుయుక్తులు పన్నడం.. చివరికి ఆయన హత్యకు గురి కావడం.. ఆపై పరిణామాలు అన్నింటినీ ఈ సినిమలో చూపించారు.
ఈ మూవీలో ఎవరూ పేరున్న నటీనటులు నటించలేదు. అందరూ దాదాపుగా కొత్తవాళ్లే. నేరుగా జగన్, వివేకా, చంద్రబాబు.. ఇలా ఒరిజినల్ పేర్లనే వాడేశారు. మరి ఇలా పేర్లు పెట్టి సినిమాలు తీస్తే లీగల్ చిక్కులు తప్పకపోవచ్చు. సినిమా అయితే జగన్ అండ్ కోను టార్గెట్ చేసినట్లే కనిపిస్తోంది. మరి ఈ సినిమా ఏ అడ్డంకులూ లేకుండా విడుదల కాగలదా అన్నది చూడాలి.
This post was last modified on March 17, 2024 4:12 pm
వరస ఫెయిల్యూర్స్ తో మార్కెట్ ని రిస్క్ లో పెట్టుకున్న విజయ్ దేవరకొండకు ది ఫ్యామిలీ స్టార్ ఇచ్చిన షాక్…
నిన్న సాయంత్రం విడుదలైన దేవర పార్ట్ 1 మొదటి ఆడియో సింగల్ ఫియర్ కు ఊహించని స్థాయిలో ఇటు ఛార్ట్…
రవితేజ ‘టచ్ చేసి చూడు’ సినిమా గుర్తుందా ? అందులో అలజడి సృష్టిస్తున్న అల్లరిమూకలను అరికట్టేందుకు రవితేజ పోలీసులకు రౌడీ…
ఇంకో ముప్పై ఏడు రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి ఏడి 2898 కోసం అభిమానులే కాదు యావత్ ఇండస్ట్రీ మొత్తం…
కాలు జారితే తీసుకోవచ్చు. కానీ, నోరు జారితే మాత్రం తీసుకోవడం కష్టం. పైగా ఇది పరువు, ప్రతిష్టలకు కూడా సంబంధించిన…
ఏపీలో ఈ నెల 13న జరిగిన పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చోటు చేసు కున్న హింస..…