గత వారం అజయ్ దేవగన్ షైతాన్ కు మిక్స్డ్ టాక్ వచ్చినా వసూళ్ల పరంగా ఆడియన్స్ నుంచి మద్దతు దక్కించుకుంది. ఒక సీరియస్ హారర్ సినిమా మొదటి వారంలో ఎనభై కోట్ల మార్కు చేరుకోవడం చిన్న విషయం కాదు. అయితే మాస్, ఫ్యామిలీస్ దీనికి దూరంగా ఉన్నాయి. అందుకే నిన్న సిద్దార్థ్ మల్హోత్రా యోధ మీద బయ్యర్లు చెప్పుకోదగ్గ అంచనాలు పెట్టుకుని ఎదురు చూశారు. టాలీవుడ్ భామ రాశిఖన్నా హీరోయిన్ కాగా రాబోయే కల్కిలో ప్రభాస్ సరసన మెరవబోతున్న దిశా పటాని తళుక్కున మెరిసింది. అయితే యోధ ఎక్కిన గాల్లోనే కూలిపోయిందని బాలీవుడ్ టాక్. అదేంటో చూద్దాం.
కథ మరీ కొత్తదేం కాదు. టాస్క్ ఫోర్స్ కమాండర్ గా ఉన్న అరుణ్ కటియాల్(సిద్దార్థ్ మల్హోత్రా)ది దూకుడుగా వెళ్లే మనస్తత్వం. సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం చేసే భార్య ప్రియంవద(రాశిఖన్నా)తో చక్కని ఫ్యామిలీ ఉంటుంది. ఒక ఉగ్రవాదుల మిషన్ వల్ల అరుణ్ చేసిన పొరపాటుకి ఒక సైంటిస్ట్ మరణించడంతో పదవిని వదిలి ఎయిర్ కమెండోగా ఢిల్లీ నుంచి లండన్ వెళ్లే విమానం ఎక్కుతాడు. అయితే ఇతన్నే టార్గెట్ చేసుకుని భారత ప్రభుత్వం దగ్గర డిమాండ్లు తీర్చుకోవాలని ప్లాన్ చేసుకున్న టెర్రరిస్టులు ఫ్లైట్ ని హైజాక్ చేస్తారు. ఆ తర్వాత యోధుడు ఏం చేసి ఉంటాడనేది ఈజీగా ఊహించుకోవచ్చు.
సాగర్ అంబ్రే – పుష్కర్ ఓఝూ సంయుక్తంగా దర్శకత్వం వహించిన యోధలో కొన్ని యాక్షన్ బ్లాక్స్ మినహాయించి మిగిలినదంతా సాదాసీదాగా జరిగిపోవడంతో ప్రత్యేకమైన థ్రిల్ అంటూ ఏమీ ఉండదు. సిద్దార్థ్ రాశిఖన్నాల ట్రాక్ రొటీన్ గా జరిగిపోగా ఫైట్లు చేసే క్యారెక్టర్ లో దిశాపటాని స్పెషల్ సర్ప్రైజ్ గా నిలుస్తుంది. నాగార్జున గగనం తరహా బ్యాక్ డ్రాప్ తీసుకున్నా హై టెన్షన్ థ్రిల్స్ ఇవ్వాలనుకున్న సాగర్ పుష్కర్ లు కథనాన్ని అంత బిగిగా రాసుకోకపోవడంతో సెకండ్ హాఫ్ మొత్తం ఊహించేలా సాగటం మైనస్. మొదటి వీకెండ్ కే వన్ ప్లస్ వన్ టికెట్ల ఆఫర్ పెట్టారంటేనే ఫలితం గురించి వేరే చెప్పాలా.
This post was last modified on March 16, 2024 2:00 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…