సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చాక ఎప్పుడేం జరుగుతుందో ఏ మాత్రం ఊహించలేనిది. దీనికి తోడు.. కోట్లాది మంది మెదళ్లకు వచ్చే ఆలోచనలు అందరికి షేర్ కావటం.. అందులో విషయం ఏ మాత్రం ఉన్నా అదే పనిగా వైరల్ కావటం తెలిసిందే. ఈకారణంతో సెలబ్రిటీలు పలువురు అనూహ్యమైన పరిణామాల్ని ఎదుర్కొనాల్సి వస్తోంది. తాజాగా కింగ్ నాగార్జునకు ఇలాంటి పరిస్థితే ఏర్పడిందని చెబుతున్నారు.
బిగ్ బాస్ షోలో ఇప్పటివరకూ ఎప్పుడు లేని రీతిలో గ్రామీణ ప్రాంతానికి చెందిన పెద్దావిడను షోలోకి తీసుకురావటం.. ఇంట్లోకి పంపటం లాంటి వినూత్న ప్రయత్నం చేశారు. ఊహించిన దానికి మించి గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లో రచ్చ చేయటమే కాదు.. ఆమెకు దన్నుగా లక్షలాది మంది ఉన్నామంటున్నారు. ఈసారి సీజన్ లో రెండో రోజు నుంచే ఆర్మీని సొంతం చేసుకున్న ఎవరైనా ఉన్నారంటే మట్టి మనిషి గంగవ్వే.
గంగవ్వను ఉద్దేశించి పెద్దావిడగా నాగ్ వ్యవహరించటంపై సోషల్ మీడియాలో పంచ్ ల మీద పంచ్ లు పడుతున్నాయి. నాగ్ కు 61 ఏళ్లు అని.. గంగవ్వకు 60 ఏళ్లు అని.. అలా చూసినప్పుడు నాగ్ తాత కాకుండా గంగవ్వ బామ్మ ఎందుకు అవుతుందని ప్రశ్నిస్తున్నారు. వయసు మీద పడుతున్నా.. అంతకంతకూ తన అందంతో ఆకర్షణీయంగా కనిపించే నాగ్ కు తాజాగాతెర మీదకు వచ్చిన ‘వయసు’ రచ్చ ఇబ్బందిని కలిగించేదే.
ఏతావాతా చెప్పేదేమంటే.. మిగిలిన కంటెస్టెంట్లను ట్రీట్ చేసినట్లుగా గంగవ్వను ట్రీట్ చేస్తే నాగ్ కు ఇబ్బందే. ఎందుకంటే.. ఇకపై ఆమెను బామ్మగా నాగ్ నోట నుంచి మాట వస్తే జరిగే రచ్చ మామూలుగా ఉండదంటున్నారు. చూస్తుంటే.. గంగవ్వ విషయంలో నాగ్ మరింత కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.
This post was last modified on September 12, 2020 1:35 pm
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. తమిళనాడు, కేరళలో ప్రభుత్వాలు…
తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…
హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…
నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా సింగిల్ థియేటర్ల రెవెన్యూ విషయమై నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఎంత గొడవ నడుస్తోందో తెలిసిందే.…
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సుమారు 70 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో…