సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చాక ఎప్పుడేం జరుగుతుందో ఏ మాత్రం ఊహించలేనిది. దీనికి తోడు.. కోట్లాది మంది మెదళ్లకు వచ్చే ఆలోచనలు అందరికి షేర్ కావటం.. అందులో విషయం ఏ మాత్రం ఉన్నా అదే పనిగా వైరల్ కావటం తెలిసిందే. ఈకారణంతో సెలబ్రిటీలు పలువురు అనూహ్యమైన పరిణామాల్ని ఎదుర్కొనాల్సి వస్తోంది. తాజాగా కింగ్ నాగార్జునకు ఇలాంటి పరిస్థితే ఏర్పడిందని చెబుతున్నారు.
బిగ్ బాస్ షోలో ఇప్పటివరకూ ఎప్పుడు లేని రీతిలో గ్రామీణ ప్రాంతానికి చెందిన పెద్దావిడను షోలోకి తీసుకురావటం.. ఇంట్లోకి పంపటం లాంటి వినూత్న ప్రయత్నం చేశారు. ఊహించిన దానికి మించి గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లో రచ్చ చేయటమే కాదు.. ఆమెకు దన్నుగా లక్షలాది మంది ఉన్నామంటున్నారు. ఈసారి సీజన్ లో రెండో రోజు నుంచే ఆర్మీని సొంతం చేసుకున్న ఎవరైనా ఉన్నారంటే మట్టి మనిషి గంగవ్వే.
గంగవ్వను ఉద్దేశించి పెద్దావిడగా నాగ్ వ్యవహరించటంపై సోషల్ మీడియాలో పంచ్ ల మీద పంచ్ లు పడుతున్నాయి. నాగ్ కు 61 ఏళ్లు అని.. గంగవ్వకు 60 ఏళ్లు అని.. అలా చూసినప్పుడు నాగ్ తాత కాకుండా గంగవ్వ బామ్మ ఎందుకు అవుతుందని ప్రశ్నిస్తున్నారు. వయసు మీద పడుతున్నా.. అంతకంతకూ తన అందంతో ఆకర్షణీయంగా కనిపించే నాగ్ కు తాజాగాతెర మీదకు వచ్చిన ‘వయసు’ రచ్చ ఇబ్బందిని కలిగించేదే.
ఏతావాతా చెప్పేదేమంటే.. మిగిలిన కంటెస్టెంట్లను ట్రీట్ చేసినట్లుగా గంగవ్వను ట్రీట్ చేస్తే నాగ్ కు ఇబ్బందే. ఎందుకంటే.. ఇకపై ఆమెను బామ్మగా నాగ్ నోట నుంచి మాట వస్తే జరిగే రచ్చ మామూలుగా ఉండదంటున్నారు. చూస్తుంటే.. గంగవ్వ విషయంలో నాగ్ మరింత కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.
This post was last modified on September 12, 2020 1:35 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…