సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చాక ఎప్పుడేం జరుగుతుందో ఏ మాత్రం ఊహించలేనిది. దీనికి తోడు.. కోట్లాది మంది మెదళ్లకు వచ్చే ఆలోచనలు అందరికి షేర్ కావటం.. అందులో విషయం ఏ మాత్రం ఉన్నా అదే పనిగా వైరల్ కావటం తెలిసిందే. ఈకారణంతో సెలబ్రిటీలు పలువురు అనూహ్యమైన పరిణామాల్ని ఎదుర్కొనాల్సి వస్తోంది. తాజాగా కింగ్ నాగార్జునకు ఇలాంటి పరిస్థితే ఏర్పడిందని చెబుతున్నారు.
బిగ్ బాస్ షోలో ఇప్పటివరకూ ఎప్పుడు లేని రీతిలో గ్రామీణ ప్రాంతానికి చెందిన పెద్దావిడను షోలోకి తీసుకురావటం.. ఇంట్లోకి పంపటం లాంటి వినూత్న ప్రయత్నం చేశారు. ఊహించిన దానికి మించి గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లో రచ్చ చేయటమే కాదు.. ఆమెకు దన్నుగా లక్షలాది మంది ఉన్నామంటున్నారు. ఈసారి సీజన్ లో రెండో రోజు నుంచే ఆర్మీని సొంతం చేసుకున్న ఎవరైనా ఉన్నారంటే మట్టి మనిషి గంగవ్వే.
గంగవ్వను ఉద్దేశించి పెద్దావిడగా నాగ్ వ్యవహరించటంపై సోషల్ మీడియాలో పంచ్ ల మీద పంచ్ లు పడుతున్నాయి. నాగ్ కు 61 ఏళ్లు అని.. గంగవ్వకు 60 ఏళ్లు అని.. అలా చూసినప్పుడు నాగ్ తాత కాకుండా గంగవ్వ బామ్మ ఎందుకు అవుతుందని ప్రశ్నిస్తున్నారు. వయసు మీద పడుతున్నా.. అంతకంతకూ తన అందంతో ఆకర్షణీయంగా కనిపించే నాగ్ కు తాజాగాతెర మీదకు వచ్చిన ‘వయసు’ రచ్చ ఇబ్బందిని కలిగించేదే.
ఏతావాతా చెప్పేదేమంటే.. మిగిలిన కంటెస్టెంట్లను ట్రీట్ చేసినట్లుగా గంగవ్వను ట్రీట్ చేస్తే నాగ్ కు ఇబ్బందే. ఎందుకంటే.. ఇకపై ఆమెను బామ్మగా నాగ్ నోట నుంచి మాట వస్తే జరిగే రచ్చ మామూలుగా ఉండదంటున్నారు. చూస్తుంటే.. గంగవ్వ విషయంలో నాగ్ మరింత కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.
This post was last modified on September 12, 2020 1:35 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…