సినిమా అనేది కళకు సంబందించిన విషయమే అయినా వ్యాపార కోణంలో తీయకపోతే సంతృప్తి మిగులుతుందేమో కానీ చేతులు కాలడం ఖాయం. జాగ్రత్తగా ప్రేక్షకులకు నచ్చేలా తీయకుండా విమర్శకుల ప్రశంసలు, అవార్డుల కోసం తీస్తే ఎలాంటి పరిస్థితి వస్తుందో సాక్ష్యంగా నిలుస్తున్నాడో డైరెక్టర్. ఆయన పేరు దేవశిష్ మఖీజా. గత ఏడాది మనోజ్ బాజ్ పాయ్ తో జొరం అనే మూవీ తీశాడు. బెస్ట్ మూవీ, స్టోరీ విభాగాల్లో రెండు ఫిలిం ఫేర్ పురస్కారాలు దక్కాయి. రివ్యూస్ గొప్పగా మెచ్చుకున్నాయి. జీ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నప్పటికీ ప్రొడక్షన్ భారం ఈయనదే అధికం.
తీరా చూస్తే జొరం థియేటర్లలో ఘోరంగా ఫెయిలయ్యింది. టికెట్లు కొని చూసేందుకు ఆడియన్స్ ఇష్టపడలేదు. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్, థ్రిల్లర్ టచ్ తో ఒక మంచి కాన్సెప్ట్ ని రూపొందించిన విధానం కనెక్ట్ కాలేదు. ఇదంతా దేవశిష్ ఆర్థిక పరిస్థితి మీద తీవ్ర ప్రభావం చూపించింది. ఎంతగా అంటే అయిదు నెలల నుంచి ఇంటి అద్దె కట్టలేకపోతే ఓనర్ ఖాళీ చేయమని ఒత్తిడి చేసేంత. గతంలో ఇలాగే అజ్జి అనే కళాత్మకత చిత్రాన్ని కేవలం 1 కోటితో తీస్తే 15 లక్షలు మాత్రమే వచ్చాయి. అయినా సరే మనసు చంపుకోలేక దర్శకత్వం చేస్తూనే ఉండటం ఇక్కడిదాకా తీసుకొచ్చింది.
అలా అని దేవశిష్ ప్రతిభ చిన్నదేమీ కాదు. చక్కని ట్రాక్ రికార్డు ఉంది. బంటీ ఔర్ బబ్లీ, బ్లాక్ ఫ్రైడే లాంటి క్లాసిక్స్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. చిన్న పిల్లల సాహిత్యంలో బెస్ట్ సెల్లర్స్ గా నిలిచిన పుస్తకాలు రాశాడు. ప్రత్యేకంగా ఈయన షార్ట్ ఫిలింస్ చాలా గొప్ప ఫేమ్ ని తీసుకొచ్చాయి. నాలుగు పదుల వయసులో ఉన్న తనకు కనీసం సైకిల్ కొనుక్కునే డబ్బులు కూడా ఇప్పుడు లేవని వాపోతున్నాడు. 40కి పైగా ఫుల్ బౌండ్ స్క్రిప్టులు తనదగ్గర ఉన్నాయని ఎవరైనా అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు. అయినా ఇప్పటి జనరేషన్ లో మరీ ఆర్ట్ తరహా సినిమాలే తీస్తూ ఉంటే కష్టమేగా.
This post was last modified on March 16, 2024 10:55 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…