ప్రభాస్ దర్శకుడు నాగ అశ్విన్ కాంబోలో రూపొందుతున్న కల్కి 2898 ఏడి షూటింగ్ ఆపకుండా చేస్తూనే ఉన్నారు. ఇటీవలే ఇటలీలో డార్లింగ్, దిశాపటాని పాల్గొనగా ఒక రొమాంటిక్ సాంగ్ తో పాటు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు తీసుకుని వచ్చేశారు. తిరిగి కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరగనుంది. మే 9 విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని నిర్మాత వైపు పదే పడే వక్కాణింపు వస్తున్నా ఇతర ప్రొడ్యూసర్లు మాత్రం ఏమైనా వాయిదా ఉంటుందేమోనని ఆశతో ఎదురు చూస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి సలార్ తప్పుకోవడం వల్ల ఏం జరిగిందో అందరం చూశాం.
ఇప్పుడూ అదే రిపీట్ కావొచ్చని కొందరి ఆశ. అలా వెయిట్ చేస్తున్న వాటిలో ప్యాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి, మీడియం బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. కమల్ హాసన్ భారతీయుడు 2 అందుకే ఏ నిర్ణయం తీసుకోలేక వేచి చూసే ధోరణిలో ఉంది. సుధీర్ బాబు హరోం హర, విశ్వక్ సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరిలు అవకాశం దొరికితే వాడుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఆనంద్ దేవరకొండ గంగం గణేశా లాంటి ఛోటా సినిమాలు సైతం దీని గురించే ఆలోచిస్తున్నాయి. మే ఎంతో దూరంలో లేదు. పైగా తొమ్మిదో తేదీ మంచి హాలిడే సీజన్. అందరూ హ్యాపీగా సెలవుల్లో ఉండే క్రేజీ సమయం.
సో ఇప్పటికిప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పలేం కానీ రాబోయే రోజుల్లో పరిణామాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మే 9 కల్కి రావడం పక్కానే. కానీ యూనిట్ టాక్ ప్రకారం పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్వింగ్ లో ఉన్నప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో నాగ అశ్విన్ రాజీ పడే సమస్యే లేదని చెబుతున్నాడట. తాను కోరుకున్న క్వాలిటీ స్క్రీన్ మీద కనిపిస్తే తప్ప ఫైనల్ కాపీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనని అంటున్నాడని వినికిడి. మహానటి, జగదేకవీరుడు అతిలోకసుందరి, మహానటి సెంటిమెంట్ డేట్ వదలకూడదనేది నిర్మాత అశ్విన్ దత్ కోరిక. చూడాలి మరి.
This post was last modified on March 16, 2024 12:41 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…