ప్రభాస్ దర్శకుడు నాగ అశ్విన్ కాంబోలో రూపొందుతున్న కల్కి 2898 ఏడి షూటింగ్ ఆపకుండా చేస్తూనే ఉన్నారు. ఇటీవలే ఇటలీలో డార్లింగ్, దిశాపటాని పాల్గొనగా ఒక రొమాంటిక్ సాంగ్ తో పాటు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు తీసుకుని వచ్చేశారు. తిరిగి కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరగనుంది. మే 9 విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని నిర్మాత వైపు పదే పడే వక్కాణింపు వస్తున్నా ఇతర ప్రొడ్యూసర్లు మాత్రం ఏమైనా వాయిదా ఉంటుందేమోనని ఆశతో ఎదురు చూస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి సలార్ తప్పుకోవడం వల్ల ఏం జరిగిందో అందరం చూశాం.
ఇప్పుడూ అదే రిపీట్ కావొచ్చని కొందరి ఆశ. అలా వెయిట్ చేస్తున్న వాటిలో ప్యాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి, మీడియం బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. కమల్ హాసన్ భారతీయుడు 2 అందుకే ఏ నిర్ణయం తీసుకోలేక వేచి చూసే ధోరణిలో ఉంది. సుధీర్ బాబు హరోం హర, విశ్వక్ సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరిలు అవకాశం దొరికితే వాడుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఆనంద్ దేవరకొండ గంగం గణేశా లాంటి ఛోటా సినిమాలు సైతం దీని గురించే ఆలోచిస్తున్నాయి. మే ఎంతో దూరంలో లేదు. పైగా తొమ్మిదో తేదీ మంచి హాలిడే సీజన్. అందరూ హ్యాపీగా సెలవుల్లో ఉండే క్రేజీ సమయం.
సో ఇప్పటికిప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పలేం కానీ రాబోయే రోజుల్లో పరిణామాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మే 9 కల్కి రావడం పక్కానే. కానీ యూనిట్ టాక్ ప్రకారం పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్వింగ్ లో ఉన్నప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో నాగ అశ్విన్ రాజీ పడే సమస్యే లేదని చెబుతున్నాడట. తాను కోరుకున్న క్వాలిటీ స్క్రీన్ మీద కనిపిస్తే తప్ప ఫైనల్ కాపీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనని అంటున్నాడని వినికిడి. మహానటి, జగదేకవీరుడు అతిలోకసుందరి, మహానటి సెంటిమెంట్ డేట్ వదలకూడదనేది నిర్మాత అశ్విన్ దత్ కోరిక. చూడాలి మరి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…