samantha
సినిమా స్టార్లు ఎవరికైనా పెద్ద అనారోగ్య సమస్య ఉందని తెలిస్తే దాన్ని బయటపెట్టడానికి ఇష్టపడరు. అది అభిమానులను బాధిస్తుంది. దీనికి తోడు కెరీర్ల మీదా ప్రభావం చూపుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు మయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి సోకాక కొంత కాలం ఆ విషయాన్ని దాచిపెట్టింది.
కానీ చివరికి ఆమె దీని గురించి ఓపెన్ అయిపోయింది. అందుకు తాను నటించిన యశోద మూవీనే కారణం అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది సామ్. ముందు ఈ విషయాన్ని బయటపెట్టాలని అనుకోలేదని.. కానీ యశోద మూవీకి నష్టం జరుగుతోందని భావించి ఆ విషయాన్ని చెప్పాల్సి వచ్చిందని సామ్ తెలిపింది.
ఆ టైంలో తన గురించి రకరకాల రూమర్లు ప్రచారంలోకి వచ్చాయని.. సినిమాకు ప్రమోషన్ లేకపోవడం వల్ల చచ్చిపోయే పరిస్థితి ఉందని నిర్మాత ఆవేదన చెందడంతో తాను బయటికి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వచ్చిందని.. అప్పుడే తనకు మయోసైటిస్ సోకిన విషయాన్ని వెల్లడించానని సమంత చెప్పింది. ఇక తన కెరీర్ పీక్స్లో ఉన్నపుడు కూడా తాను పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయినట్లు సమంత వెల్లడించింది.
తాను అప్పట్లో ఇంపోస్టర్ డిజార్డర్తో ఇబ్బంది పడ్డానని.. తాను సాధించిన సక్సెస్లో తన ప్రమేయం లేదని.. ఈ సక్సెస్ ఎక్కువ కాలం ఉండదని అనిపించేదని.. అందువల్ల జీవితంలో అత్యంత ఆనందకర క్షణాలను కూడా ఆస్వాదించలేకపోయానని సామ్ చెప్పింది. తాను ఒక టైంలో ఎంతో శ్రమించానని.. రోజుకు ఐదు గంటలే పడుకునేదాన్నని.. తీరిక లేకుండా సినిమాలు చేయడంతో పాటు ఎన్నో రకాల పనులు చేసేదాన్నని.. అలా కష్టపడి ఒక స్థాయికి చేరుకున్నానని ఆమె చెప్పింది.
This post was last modified on March 16, 2024 7:22 am
కేంద్రంలోను.. ఢిల్లీ రాజకీయాల్లోనూ ఇప్పటి వరకు వైసీపీ కొంత మేరకు హవా చెలాయిస్తున్న విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు…
దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయకుడు అయినా.. ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…