ఆ సినిమాలో స్టార్ నటీనటులు లేరు. దర్శకుడు కూడా అంత పేరున్న వాడు కాదు. సినిమా బడ్జెట్ కూడా చాలా తక్కువ. రిలీజయ్యే టైంకి అదొక చిన్న సినిమా. కానీ విడుదల తర్వాత దాని రేంజే మారిపోయింది. భారీ చిత్రాలను మించి వసూళ్ల మోత మోగిస్తూ.. వారాలు గడుస్తున్నా హౌస్ ఫుల్స్తో రన్ అవుతూ.. వేరే రాష్ట్రంలో సైతం సంచలన కలెక్షన్లు సాధిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇప్పుడా చిన్న సినిమా ఆ ఇండస్ట్రీలోనే ఆల్ టైం రికార్డును నమోదు చేసింది. మలయాళ బాక్సాఫీస్ను షేక్ చేసిన ఆ చిత్రమే.. మంజుమ్మెల్ బాయ్స్. విడుదలైన తొలి రోజు నుంచి సంచలన వసూళ్లు సాధిస్తూ అనేక రికార్డులను బద్దలు కొడుతూ సాగిన ఈ మూవీ.. ఇప్పుడు మలయాళంలో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.
గత ఏడాది వేసవిలో విడుదలై రూ.180 కోట్ల వసూళ్లతో మలయాళంలో ఆల్ టైం బ్లాక్బస్టర్గా నిలిచిన 2018 సినిమాను మంజుమ్మెల్ బాయ్స్ అధిగమించింది. వరల్డ్ వైడ్ ఈ సినిమా వసూళ్లు రూ.190 కోట్లకు చేరువగా ఉన్నాయి. త్వరలోనే 200 కోట్ల మార్కును కూడా దాటేయబోతోందీ చిత్రం. తమిళనాట అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా ఈ సినిమా రికార్డు నెలకొల్పింది.
విదేశాల్లో కూడా మాలీవుడ్ రికార్డు బద్దలైంది. కొన్నేళ్ల కిందట కేరళ నుంచి కొందరు యువకుల బృందం.. కోడైకెనాల్ ట్రిప్ వేసింది. అప్పుడు ఆ గ్రూప్లోని ఒకరు గుహలో చిక్కుకుపోయాడు. అతణ్ని అక్కడి నుంచి బయటికి తేవడానికి మిత్ర బృందం ఏం చేసిందనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా సినిమాను తీర్చిదిద్దడంతో ప్రేక్షకులకు మాంచి థ్రిల్ ఇస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…
లెనిన్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు…