Movie News

సంపంగి మహల్లో ‘ఓమ్ భీమ్ బుష్’ అల్లరి

గత ఏడాది సామజవరగమనతో అదిరిపోయే హిట్టు అందుకున్న శ్రీవిష్ణు ఈసారి ఓం భీమ్ బుష్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. హుషారు, రౌడీ బాయ్స్ ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించగా యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్ తరఫున సునీల్ బలుసు నిర్మించారు. గత కొద్దిరోజులుగా వెరైటీ ప్రమోషన్లతో సోషల్ మీడియాని ఆకట్టుకుంటున్న భీమ్ బుష్ బృందం తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ చేసింది. మార్చి 22 విడుదల కాబోతున్న ఈ థ్రిల్లర్ కామెడీని లాజిక్స్ లేకుండా చూడమంటున్న టీమ్ అంచనాలకు తగ్గ శాంపిల్ ని ఇచ్చారు.

జనాల సమస్యలకు పరిష్కారం చూపిస్తామని మాయమాటలు చెప్పే ముగ్గురు కుర్రాళ్ళ గ్యాంగ్ తమ బృందానికి బ్యాంగ్ బ్రోస్ పేరు పెట్టుకుని ఊరూరా తిరుగుతూ పబ్బం గడుపుకుంటూ ఉంటారు. దీనికి లీడర్ (శ్రీవిష్ణు), ఇద్దరు అసిస్టెంట్లు (ప్రియదర్శి – రాహుల్ రామకృష్ణ). ప్రజలు వీళ్ళ మాయలో పడి డబ్బు దస్కం ఇస్తూ ఉంటారు. కొందరు అఘోరాలు దెయ్యాలు తిరుగుతాయని పేరుబడిన సంపంగి మహల్లోకి వెళ్లి నిధిని తీసుకొచ్చి మగాళ్లని ఋజువు చేసుకోమని సవాలు విసురుతారు. దీంతో భైరవపురంకు బయలుదేరిన బ్యాంగ్ బ్రోస్ ఆసలు పరీక్ష అక్కడ మొదలవుతుంది.

దర్శకుడు శ్రీహర్ష డార్క్, లౌడ్ కామెడీ రెండూ మిక్స్ చేసి ఓమ్ భీమ్ బుష్ ని రూపొందించినట్టు కనిపిస్తోంది. రెండు మూడు అడల్ట్ పదాలు కూడా వినిపించేశారు. హాస్యాన్నే హైలైట్ చేస్తూ కాసింత హారర్, సస్పెన్స్ ని జోడించిన విధానం డిఫరెంట్ గా ఉంది. హీరోయిన్లు ప్రీతీ ముకుందన్, అయేషా ఖాన్ లతో పాటు ఇతర ఆర్టిస్టులను హైలైట్ చేయకుండా ముగ్గురి మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు. సన్నీ ఎంఆర్ సంగీతం సమకూర్చగా రాజ్ తోట ఛాయాగ్రహణం అందించారు. మండు వేసవిలో సరైన సినిమా లేక అల్లాడిపోతున్న టాలీవుడ్ ఫ్యాన్స్ కి సేద తీర్చాల్సింది ఓమ్ భీమ్ బుషే.

This post was last modified on March 15, 2024 8:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

2 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

3 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

4 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

4 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

6 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

7 hours ago