రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ ఇండియా మూవీకి పెద్ది టైటిల్ ఖరారైనట్టుగా వచ్చిన వార్త చక్కర్లు కొడుతోంది. నిప్పు లేనిదే పొగరాదు కాబట్టి కొట్టిపారేయడానికి లేదు. వచ్చే వారం మార్చి 20న ఓపెనింగ్ చేయబోతున్న దృష్ట్యా ఈ న్యూస్ లీక్ కావడం చూస్తే నిజమనుకోవడానికే ఎక్కువ స్కోప్ ఉంది. అయితే ఇది గతంలో జూనియర్ ఎన్టీఆర్ కోసం తయారు చేసుకున్న కథని, తారక్ చేయాలని ఉన్నా డేట్లు సర్దుబాటు చేయలేని పరిస్థితిలో ఉండటంతో దాన్ని స్నేహితుడైన చరణ్ దగ్గరకు పంపించినట్టు టాక్ ఉంది కానీ వాస్తవమేంటో బుచ్చిబాబుకే తెలుసు.
దీని గురించి ఇద్దరి అభిమానులు వాదోపవాదాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక విషయం మర్చిపోకూడదు. పెద్ది నిజంగానే తారక్ నుంచి చరణ్ కు వచ్చినా షాక్ అవ్వడానికి లేదు. ఎందుకంటే గతంలో ఎన్నో సందర్భాల్లో ఎందరో హీరోలు బ్లాక్ బస్టర్ కథలను వేర్వేరు కారణాల వల్ల వదులుకున్నారు. త్రివిక్రమ్ చెప్పినప్పుడు నిద్ర రాకపోయి ఉంటే అతడులో పవన్ కళ్యాణ్ ఉండేవాడు. సరిగ్గా అర్థం చేసుకుని ఉంటే ఇడియట్ రికార్డులు దక్కేవి. నువ్వే కావాలి వదులుకోవడం గురించి సుమంత్ ఇప్పటికీ చెబుతూ ఉంటాడు. ఇలా బోలెడు ఉదాహరణలు టాలీవుడ్ చరిత్రలో ఉన్నాయి.
ఒక ఇంటర్వ్యూలో బుచ్చిబాబు ఇది వేరే కథని చెప్పిన వీడియో క్లిప్ ని చరణ్ ఫ్యాన్స్ బయటికి తీశారు. పెద్ది ఎవరిదైనా ఆర్ఆర్ఆర్ హీరోల మధ్య వ్యక్తిగతంగా ఎంత బాండింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆన్ లైన్ లో ఫ్యాన్స్ గొడవపడటం తప్పించి ఆ ఫ్రెండ్స్ మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవు. కమిట్ మెంట్ల వల్ల సాధ్యపడదు కానీ ఆర్ఆర్ఆర్ 2 తీయాలనుకుంటే ఇద్దరూ సంసిద్ధంగా ఉంటారు. కాబట్టి స్టోరీ ఎవరి నుంచి ఎవరికి వచ్చినా ఒరిగేది, నష్టపోయేది ఏమీ లేదు. కొంత ఆలస్యంగా అయినా సరే బుచ్చిబాబు ఏదో రోజు దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ ఇవ్వడం ఖాయం. వెయిట్ చేద్దాం.
దక్షిణాది గానకోకిలగా కోట్లాది మంది అభిమానుల ప్రేమను సొంతం చేసుకున్న ప్రముఖ గాయని ఎస్. జానకి (88) కన్నుమూశారు. ఆమె…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…
విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర…