రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ ఇండియా మూవీకి పెద్ది టైటిల్ ఖరారైనట్టుగా వచ్చిన వార్త చక్కర్లు కొడుతోంది. నిప్పు లేనిదే పొగరాదు కాబట్టి కొట్టిపారేయడానికి లేదు. వచ్చే వారం మార్చి 20న ఓపెనింగ్ చేయబోతున్న దృష్ట్యా ఈ న్యూస్ లీక్ కావడం చూస్తే నిజమనుకోవడానికే ఎక్కువ స్కోప్ ఉంది. అయితే ఇది గతంలో జూనియర్ ఎన్టీఆర్ కోసం తయారు చేసుకున్న కథని, తారక్ చేయాలని ఉన్నా డేట్లు సర్దుబాటు చేయలేని పరిస్థితిలో ఉండటంతో దాన్ని స్నేహితుడైన చరణ్ దగ్గరకు పంపించినట్టు టాక్ ఉంది కానీ వాస్తవమేంటో బుచ్చిబాబుకే తెలుసు.
దీని గురించి ఇద్దరి అభిమానులు వాదోపవాదాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక విషయం మర్చిపోకూడదు. పెద్ది నిజంగానే తారక్ నుంచి చరణ్ కు వచ్చినా షాక్ అవ్వడానికి లేదు. ఎందుకంటే గతంలో ఎన్నో సందర్భాల్లో ఎందరో హీరోలు బ్లాక్ బస్టర్ కథలను వేర్వేరు కారణాల వల్ల వదులుకున్నారు. త్రివిక్రమ్ చెప్పినప్పుడు నిద్ర రాకపోయి ఉంటే అతడులో పవన్ కళ్యాణ్ ఉండేవాడు. సరిగ్గా అర్థం చేసుకుని ఉంటే ఇడియట్ రికార్డులు దక్కేవి. నువ్వే కావాలి వదులుకోవడం గురించి సుమంత్ ఇప్పటికీ చెబుతూ ఉంటాడు. ఇలా బోలెడు ఉదాహరణలు టాలీవుడ్ చరిత్రలో ఉన్నాయి.
ఒక ఇంటర్వ్యూలో బుచ్చిబాబు ఇది వేరే కథని చెప్పిన వీడియో క్లిప్ ని చరణ్ ఫ్యాన్స్ బయటికి తీశారు. పెద్ది ఎవరిదైనా ఆర్ఆర్ఆర్ హీరోల మధ్య వ్యక్తిగతంగా ఎంత బాండింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆన్ లైన్ లో ఫ్యాన్స్ గొడవపడటం తప్పించి ఆ ఫ్రెండ్స్ మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవు. కమిట్ మెంట్ల వల్ల సాధ్యపడదు కానీ ఆర్ఆర్ఆర్ 2 తీయాలనుకుంటే ఇద్దరూ సంసిద్ధంగా ఉంటారు. కాబట్టి స్టోరీ ఎవరి నుంచి ఎవరికి వచ్చినా ఒరిగేది, నష్టపోయేది ఏమీ లేదు. కొంత ఆలస్యంగా అయినా సరే బుచ్చిబాబు ఏదో రోజు దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ ఇవ్వడం ఖాయం. వెయిట్ చేద్దాం.
This post was last modified on March 15, 2024 7:51 pm
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…