గామిని ఓ నలుగురు పెద్దమనుషులు చూసి రెండు ముక్కలు చెబితే బాగుంటుందని విశ్వక్ సేన్ అన్న మాటలు వైరల్ కావడం చూశాం. అయితే గతంలో వేరే ఈవెంట్ లో మాట్లాడుతూ నన్ను ఎవరూ లేపనవసరం లేదు, నన్ను నేనే లేచి గెలిచి చూపిస్తా అంటూ అన్న మాటల వీడియోని బయటికి తీసి కొందరు నెటిజెన్లు ఇప్పుడిలా అడగటం ఏమిటని ప్రశ్నించడం విశ్వక్ దృష్టికి వెళ్ళింది. దానికి సోషల్ మీడియాలోనే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. బ్రేక్ ఈవెన్ జరిగిపోయి లాభాలు వచ్చిన సినిమాను ప్రత్యేకంగా చూడమని ఇప్పుడు ఎందుకు అడుగుతానని పేర్కొన్నాడు.
తాను తప్ప టీమ్ లో అందరూ కొత్తవాళ్లే కాబట్టి గామిని చూసి వాళ్ళను ప్రోత్సహించేలా చెప్పమని అన్నాను తప్పించి ఇంకే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చాడు. నిజానికి విశ్వక్ సేన్ ఇక ఈ టాపిక్ ని ఇక్కడితో వదిలేస్తే బెటర్. ప్రాక్టికల్ గా చూసుకుంటే గామి నిజంగానే బాగా స్లో అయిన మాట వాస్తవం. రెండో వారంలో బిసి సెంటర్స్ షోలు తగ్గించారు. కొత్త రిలీజులు ఎక్కువ ఉండటం కారణమే అయినా ఒకవేళ గామి పెద్ద బ్లాక్ బస్టర్ దిశగా వెళ్లుంటే షోలు, థియేటర్లను హోల్డ్ చేసే వాళ్ళు. కానీ అలా జరగలేదంటే వాస్తవంగా డిస్ట్రిబ్యూటర్లు జరుగుతున్నది ఏమిటో అర్థం చేసుకున్నారు కాబట్టి.
విశ్వక్ చెప్పినట్టు గామికి తెలుగు సినిమాలో ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులో డౌట్ లేదు. దాన్ని మనం పదే పదే చెప్పనక్కర్లేదు. ఆడియన్స్ అన్నారు. విమర్శకులు మెచ్చుకున్నారు. ఇరవై కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. సంతోషం. కమర్షియల్ అంశాలు మచ్చుకు కూడా లేకుండా నెమ్మదిగా నడిచే ఒక స్పిరిచువల్ థ్రిల్లర్ ఇంత స్పందన తెచ్చుకోవడం టాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచిని చాటేదే. మాస్ వర్గాలకు అంత సులభంగా చేరని ఇలాంటి ప్రయోగాలకు వసూళ్ల రూపంలో మద్దతు ఇచ్చారు కాబట్టి గామికి సపోర్ట్ లేదని చెప్పడానికి లేదు. సెలబ్రిటీలు ఏమి అనకపోయినా జనాలు మెచ్చారుగా.
This post was last modified on March 15, 2024 7:10 am
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…