గామిని ఓ నలుగురు పెద్దమనుషులు చూసి రెండు ముక్కలు చెబితే బాగుంటుందని విశ్వక్ సేన్ అన్న మాటలు వైరల్ కావడం చూశాం. అయితే గతంలో వేరే ఈవెంట్ లో మాట్లాడుతూ నన్ను ఎవరూ లేపనవసరం లేదు, నన్ను నేనే లేచి గెలిచి చూపిస్తా అంటూ అన్న మాటల వీడియోని బయటికి తీసి కొందరు నెటిజెన్లు ఇప్పుడిలా అడగటం ఏమిటని ప్రశ్నించడం విశ్వక్ దృష్టికి వెళ్ళింది. దానికి సోషల్ మీడియాలోనే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. బ్రేక్ ఈవెన్ జరిగిపోయి లాభాలు వచ్చిన సినిమాను ప్రత్యేకంగా చూడమని ఇప్పుడు ఎందుకు అడుగుతానని పేర్కొన్నాడు.
తాను తప్ప టీమ్ లో అందరూ కొత్తవాళ్లే కాబట్టి గామిని చూసి వాళ్ళను ప్రోత్సహించేలా చెప్పమని అన్నాను తప్పించి ఇంకే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చాడు. నిజానికి విశ్వక్ సేన్ ఇక ఈ టాపిక్ ని ఇక్కడితో వదిలేస్తే బెటర్. ప్రాక్టికల్ గా చూసుకుంటే గామి నిజంగానే బాగా స్లో అయిన మాట వాస్తవం. రెండో వారంలో బిసి సెంటర్స్ షోలు తగ్గించారు. కొత్త రిలీజులు ఎక్కువ ఉండటం కారణమే అయినా ఒకవేళ గామి పెద్ద బ్లాక్ బస్టర్ దిశగా వెళ్లుంటే షోలు, థియేటర్లను హోల్డ్ చేసే వాళ్ళు. కానీ అలా జరగలేదంటే వాస్తవంగా డిస్ట్రిబ్యూటర్లు జరుగుతున్నది ఏమిటో అర్థం చేసుకున్నారు కాబట్టి.
విశ్వక్ చెప్పినట్టు గామికి తెలుగు సినిమాలో ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులో డౌట్ లేదు. దాన్ని మనం పదే పదే చెప్పనక్కర్లేదు. ఆడియన్స్ అన్నారు. విమర్శకులు మెచ్చుకున్నారు. ఇరవై కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. సంతోషం. కమర్షియల్ అంశాలు మచ్చుకు కూడా లేకుండా నెమ్మదిగా నడిచే ఒక స్పిరిచువల్ థ్రిల్లర్ ఇంత స్పందన తెచ్చుకోవడం టాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచిని చాటేదే. మాస్ వర్గాలకు అంత సులభంగా చేరని ఇలాంటి ప్రయోగాలకు వసూళ్ల రూపంలో మద్దతు ఇచ్చారు కాబట్టి గామికి సపోర్ట్ లేదని చెప్పడానికి లేదు. సెలబ్రిటీలు ఏమి అనకపోయినా జనాలు మెచ్చారుగా.
This post was last modified on March 15, 2024 7:10 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…