గామిని ఓ నలుగురు పెద్దమనుషులు చూసి రెండు ముక్కలు చెబితే బాగుంటుందని విశ్వక్ సేన్ అన్న మాటలు వైరల్ కావడం చూశాం. అయితే గతంలో వేరే ఈవెంట్ లో మాట్లాడుతూ నన్ను ఎవరూ లేపనవసరం లేదు, నన్ను నేనే లేచి గెలిచి చూపిస్తా అంటూ అన్న మాటల వీడియోని బయటికి తీసి కొందరు నెటిజెన్లు ఇప్పుడిలా అడగటం ఏమిటని ప్రశ్నించడం విశ్వక్ దృష్టికి వెళ్ళింది. దానికి సోషల్ మీడియాలోనే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. బ్రేక్ ఈవెన్ జరిగిపోయి లాభాలు వచ్చిన సినిమాను ప్రత్యేకంగా చూడమని ఇప్పుడు ఎందుకు అడుగుతానని పేర్కొన్నాడు.
తాను తప్ప టీమ్ లో అందరూ కొత్తవాళ్లే కాబట్టి గామిని చూసి వాళ్ళను ప్రోత్సహించేలా చెప్పమని అన్నాను తప్పించి ఇంకే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చాడు. నిజానికి విశ్వక్ సేన్ ఇక ఈ టాపిక్ ని ఇక్కడితో వదిలేస్తే బెటర్. ప్రాక్టికల్ గా చూసుకుంటే గామి నిజంగానే బాగా స్లో అయిన మాట వాస్తవం. రెండో వారంలో బిసి సెంటర్స్ షోలు తగ్గించారు. కొత్త రిలీజులు ఎక్కువ ఉండటం కారణమే అయినా ఒకవేళ గామి పెద్ద బ్లాక్ బస్టర్ దిశగా వెళ్లుంటే షోలు, థియేటర్లను హోల్డ్ చేసే వాళ్ళు. కానీ అలా జరగలేదంటే వాస్తవంగా డిస్ట్రిబ్యూటర్లు జరుగుతున్నది ఏమిటో అర్థం చేసుకున్నారు కాబట్టి.
విశ్వక్ చెప్పినట్టు గామికి తెలుగు సినిమాలో ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులో డౌట్ లేదు. దాన్ని మనం పదే పదే చెప్పనక్కర్లేదు. ఆడియన్స్ అన్నారు. విమర్శకులు మెచ్చుకున్నారు. ఇరవై కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. సంతోషం. కమర్షియల్ అంశాలు మచ్చుకు కూడా లేకుండా నెమ్మదిగా నడిచే ఒక స్పిరిచువల్ థ్రిల్లర్ ఇంత స్పందన తెచ్చుకోవడం టాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచిని చాటేదే. మాస్ వర్గాలకు అంత సులభంగా చేరని ఇలాంటి ప్రయోగాలకు వసూళ్ల రూపంలో మద్దతు ఇచ్చారు కాబట్టి గామికి సపోర్ట్ లేదని చెప్పడానికి లేదు. సెలబ్రిటీలు ఏమి అనకపోయినా జనాలు మెచ్చారుగా.
This post was last modified on March 15, 2024 7:10 am
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…
రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…
టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్లోని…
టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…