హీరోయిన్ పూజా హెగ్డేకు కెరీర్ ప్రారంభంలో వరస ఫ్లాపులు ఉన్నప్పుడు తనకు ఆక్సిజన్ లా పని చేసింది డీజే దువ్వాడ జగన్నాథం సినిమానే. అల్లు అర్జున్ సరసన జోడి కట్టడం ఒక్కసారిగా దశను మార్చేసింది. అదేమీ ఇండస్ట్రీ హిట్ కాకపోయినా మంచి విజయం నమోదు చేసుకుని పూజా టాలెంట్ ని ఎలా వాడుకోవాలో దర్శకుడు హరీష్ శంకర్ రూపంలో చూపించింది. దీనికన్నా మెరుగ్గా త్రివిక్రమ్ అల వైకుంఠపురములో ఈ ఇద్దరు చేసిన సందడిని ప్రేక్షకులు మర్చిపోలేరు. తాజాగా ముచ్చటగా మూడో సారి ఈ దువ్వాడ జట్టు కట్టే ఛాన్స్ ఉందని చెన్నై టాక్.
అట్లీ దర్శకత్వంలో బన్నీ చేయబోయే ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన లీక్ ఆల్రెడీ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. నిన్న తన టీమ్ తో కలిసి స్క్రిప్ట్ డిస్కషన్ చేస్తున్న దర్శకుడు అట్లీ వీడియోని ఆయన భార్య ప్రియా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వైరల్ అయ్యింది. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేనే అనుకుంటున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసుకోలేదు కానీ దాదాపు ఓకే అవ్వొచ్చట. ప్రస్తుతం బుట్ట బొమ్మ చేతిలో ఆహన్ శెట్టి హీరోగా రూపొందుతున్న బాలీవుడ్ మూవీ మాత్రమే ఉంది. అది కూడా షూటింగ్ కీలక దశలో ఉంది.
వేసవికంతా ఈ సినిమా పూర్తయిపోతే ఆ తర్వాత ఫ్రీనే. ప్రస్తుతం అమ్మడు ఫామ్ లో లేకపోయినా అట్లీ ఆ లెక్కలేమి వేసుకోవడం లేదట. కమర్షియల్ గా హీరోయిజంని పీక్స్ లో చూపించే ఇతను హీరోయిన్ కు ప్రాధాన్యం ఇస్తాడు కానీ ప్రత్యేకంగా డిమాండ్ లో ఉన్న వాళ్ళ కోసమే చూడడు. తేరిలో అమీ జాక్సన్ ని తీసుకోవడానికి కారణం ఇదే. కాకపోతే ఇక్కడ బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో గీతా ఆర్ట్స్ భాగస్వామ్యం ఉంటుందని అంటున్నారు కానీ అధికారిక ప్రకటన వచ్చే దాకా వేచి చూడాలి. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ మెంట్ ఉండొచ్చట.
This post was last modified on March 14, 2024 7:24 pm
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ కు ఒక అలవాటు ఉంది.. అదే 'స్లో స్టార్ట్ అండ్ డెడ్లీ ఫినిష్'. ఈ…
నాని ప్యారడైజ్ మీద అంచనాల గురించి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఆగస్ట్ 21 విడుదల కోసం అభిమానులే కాదు మూవీ…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తో 40 ఏళ్ల బంధాన్ని వీడి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరిన సీనియర్…
ఒక డిజాస్టర్ పడితే చాలు దర్శకుడి ట్రాక్ రికార్డు గతంలో ఎంత ఉందనేది నిర్మాతలు పట్టించుకోరు. అందులోనూ వెటరన్ డైరెక్టర్స్…
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఏపీ సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ గా…
మలయాళంలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు వాలా 2. అతి తక్కువ బడ్జెట్ లో రూపొంది రెండు వందల కోట్ల…