Movie News

ముచ్చటగా మూడోసారి దువ్వాడ జోడి

హీరోయిన్ పూజా హెగ్డేకు కెరీర్ ప్రారంభంలో వరస ఫ్లాపులు ఉన్నప్పుడు తనకు ఆక్సిజన్ లా పని చేసింది డీజే దువ్వాడ జగన్నాథం సినిమానే. అల్లు అర్జున్ సరసన జోడి కట్టడం ఒక్కసారిగా దశను మార్చేసింది. అదేమీ ఇండస్ట్రీ హిట్ కాకపోయినా మంచి విజయం నమోదు చేసుకుని పూజా టాలెంట్ ని ఎలా వాడుకోవాలో దర్శకుడు హరీష్ శంకర్ రూపంలో చూపించింది. దీనికన్నా మెరుగ్గా త్రివిక్రమ్ అల వైకుంఠపురములో ఈ ఇద్దరు చేసిన సందడిని ప్రేక్షకులు మర్చిపోలేరు. తాజాగా ముచ్చటగా మూడో సారి ఈ దువ్వాడ జట్టు కట్టే ఛాన్స్ ఉందని చెన్నై టాక్.

అట్లీ దర్శకత్వంలో బన్నీ చేయబోయే ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన లీక్ ఆల్రెడీ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. నిన్న తన టీమ్ తో కలిసి స్క్రిప్ట్ డిస్కషన్ చేస్తున్న దర్శకుడు అట్లీ వీడియోని ఆయన భార్య ప్రియా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వైరల్ అయ్యింది. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేనే అనుకుంటున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసుకోలేదు కానీ దాదాపు ఓకే అవ్వొచ్చట. ప్రస్తుతం బుట్ట బొమ్మ చేతిలో ఆహన్ శెట్టి హీరోగా రూపొందుతున్న బాలీవుడ్ మూవీ మాత్రమే ఉంది. అది కూడా షూటింగ్ కీలక దశలో ఉంది.

వేసవికంతా ఈ సినిమా పూర్తయిపోతే ఆ తర్వాత ఫ్రీనే. ప్రస్తుతం అమ్మడు ఫామ్ లో లేకపోయినా అట్లీ ఆ లెక్కలేమి వేసుకోవడం లేదట. కమర్షియల్ గా హీరోయిజంని పీక్స్ లో చూపించే ఇతను హీరోయిన్ కు ప్రాధాన్యం ఇస్తాడు కానీ ప్రత్యేకంగా డిమాండ్ లో ఉన్న వాళ్ళ కోసమే చూడడు. తేరిలో అమీ జాక్సన్ ని తీసుకోవడానికి కారణం ఇదే. కాకపోతే ఇక్కడ బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో గీతా ఆర్ట్స్ భాగస్వామ్యం ఉంటుందని అంటున్నారు కానీ అధికారిక ప్రకటన వచ్చే దాకా వేచి చూడాలి. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ మెంట్ ఉండొచ్చట.

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

8 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

8 hours ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

8 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

9 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

9 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

11 hours ago