సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీర రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందాని ఎదురు చూసిన అభిమానులకు ఒక శుభవార్త. ఉగాది పండగను పురస్కరించుకుని ఏప్రిల్ 9న ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ ద్వారా జక్కన్న సృష్టించబోయే ప్రపంచం తాలూకు ముఖ్యమైన విషయాలను పంచుకోబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రధాన నిర్మాతగా వ్యవహరిస్తున్న శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ కెఎల్ నారాయణతో పాటు భాగస్వాములుగా ఉన్న జిఎంబి ఎంటర్ టైన్మెంట్స్ తరపున మహేష్, పార్ట్ నర్ కాబోతున్న నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులు ఇందులో ఉంటారని తెలిసింది.
ఆర్ఆర్ఆర్ కు సైతం రాజమౌళి ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యాడు. ఇప్పుడూ కొనసాగించబోతున్నారు. టైటిల్ కూడా ప్రకటించే అవకాశం లేకపోలేదు. మహారాజా, చక్రవర్తి పేర్లు ఆల్రెడీ ప్రచారంలోకి వచ్చాయి కానీ టీమ్ వీటి గురించి మౌనంగా ఉంది. ముందు సంభాషణల రచయితగా ఉన్న సాయిమాధవ్ బుర్రా తప్పుకున్నారనే టాక్ నేపథ్యంలో కొత్తగా ఎవరు చేరారనే అంశం కూడా అదే రోజు ప్రకటించే అవకాశముంది. కీరవాణితో పాటు ఇతర సాంకేతిక నిపుణుల పరిచయం మొత్తం అదే రోజు జరగనుంది. తెలుగువారి ఉగాది పర్వదినం కావడంతో ఇంత కన్నా మంచి డేట్ ఏముంటుంది.
ఇంకా టైం ఉంది కాబట్టి ప్రస్తుతానికి మీడియాకు ఆహ్వానాలు అందలేదు. ఘనంగా చేయబోయే ఈ మీట్ ని లైవ్ కెమెరాల ద్వారా కాకుండా ప్రత్యేకంగా తర్వాత స్ట్రీమింగ్ చేసే ఆలోచన చేస్తున్నట్టు ఇన్ సైడ్ న్యూస్. ప్రస్తుతం యాడ్స్ షూట్ లో బిజీగా ఉన్న మహేష్ త్వరలో అభిమానులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి ఫోటోలు దిగబోతున్నాడు. కొంత కాలం అందుబాటులో ఉండడు కాబట్టి ఆ లోటు తెలియకుండా ఉండటం కోసం ఈ మీటింగన్న మాట. స్క్రిప్ట్ వర్క్ ఒక కొలిక్కి వచ్చిందట కానీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలయ్యేది కూడా ఆ రోజే వెల్లడించే ఛాన్స్ ఉంది. చూద్దాం.
This post was last modified on March 14, 2024 4:21 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…