సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీర రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందాని ఎదురు చూసిన అభిమానులకు ఒక శుభవార్త. ఉగాది పండగను పురస్కరించుకుని ఏప్రిల్ 9న ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ ద్వారా జక్కన్న సృష్టించబోయే ప్రపంచం తాలూకు ముఖ్యమైన విషయాలను పంచుకోబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రధాన నిర్మాతగా వ్యవహరిస్తున్న శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ కెఎల్ నారాయణతో పాటు భాగస్వాములుగా ఉన్న జిఎంబి ఎంటర్ టైన్మెంట్స్ తరపున మహేష్, పార్ట్ నర్ కాబోతున్న నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులు ఇందులో ఉంటారని తెలిసింది.
ఆర్ఆర్ఆర్ కు సైతం రాజమౌళి ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యాడు. ఇప్పుడూ కొనసాగించబోతున్నారు. టైటిల్ కూడా ప్రకటించే అవకాశం లేకపోలేదు. మహారాజా, చక్రవర్తి పేర్లు ఆల్రెడీ ప్రచారంలోకి వచ్చాయి కానీ టీమ్ వీటి గురించి మౌనంగా ఉంది. ముందు సంభాషణల రచయితగా ఉన్న సాయిమాధవ్ బుర్రా తప్పుకున్నారనే టాక్ నేపథ్యంలో కొత్తగా ఎవరు చేరారనే అంశం కూడా అదే రోజు ప్రకటించే అవకాశముంది. కీరవాణితో పాటు ఇతర సాంకేతిక నిపుణుల పరిచయం మొత్తం అదే రోజు జరగనుంది. తెలుగువారి ఉగాది పర్వదినం కావడంతో ఇంత కన్నా మంచి డేట్ ఏముంటుంది.
ఇంకా టైం ఉంది కాబట్టి ప్రస్తుతానికి మీడియాకు ఆహ్వానాలు అందలేదు. ఘనంగా చేయబోయే ఈ మీట్ ని లైవ్ కెమెరాల ద్వారా కాకుండా ప్రత్యేకంగా తర్వాత స్ట్రీమింగ్ చేసే ఆలోచన చేస్తున్నట్టు ఇన్ సైడ్ న్యూస్. ప్రస్తుతం యాడ్స్ షూట్ లో బిజీగా ఉన్న మహేష్ త్వరలో అభిమానులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి ఫోటోలు దిగబోతున్నాడు. కొంత కాలం అందుబాటులో ఉండడు కాబట్టి ఆ లోటు తెలియకుండా ఉండటం కోసం ఈ మీటింగన్న మాట. స్క్రిప్ట్ వర్క్ ఒక కొలిక్కి వచ్చిందట కానీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలయ్యేది కూడా ఆ రోజే వెల్లడించే ఛాన్స్ ఉంది. చూద్దాం.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…