సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీర రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందాని ఎదురు చూసిన అభిమానులకు ఒక శుభవార్త. ఉగాది పండగను పురస్కరించుకుని ఏప్రిల్ 9న ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ ద్వారా జక్కన్న సృష్టించబోయే ప్రపంచం తాలూకు ముఖ్యమైన విషయాలను పంచుకోబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రధాన నిర్మాతగా వ్యవహరిస్తున్న శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ కెఎల్ నారాయణతో పాటు భాగస్వాములుగా ఉన్న జిఎంబి ఎంటర్ టైన్మెంట్స్ తరపున మహేష్, పార్ట్ నర్ కాబోతున్న నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులు ఇందులో ఉంటారని తెలిసింది.
ఆర్ఆర్ఆర్ కు సైతం రాజమౌళి ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యాడు. ఇప్పుడూ కొనసాగించబోతున్నారు. టైటిల్ కూడా ప్రకటించే అవకాశం లేకపోలేదు. మహారాజా, చక్రవర్తి పేర్లు ఆల్రెడీ ప్రచారంలోకి వచ్చాయి కానీ టీమ్ వీటి గురించి మౌనంగా ఉంది. ముందు సంభాషణల రచయితగా ఉన్న సాయిమాధవ్ బుర్రా తప్పుకున్నారనే టాక్ నేపథ్యంలో కొత్తగా ఎవరు చేరారనే అంశం కూడా అదే రోజు ప్రకటించే అవకాశముంది. కీరవాణితో పాటు ఇతర సాంకేతిక నిపుణుల పరిచయం మొత్తం అదే రోజు జరగనుంది. తెలుగువారి ఉగాది పర్వదినం కావడంతో ఇంత కన్నా మంచి డేట్ ఏముంటుంది.
ఇంకా టైం ఉంది కాబట్టి ప్రస్తుతానికి మీడియాకు ఆహ్వానాలు అందలేదు. ఘనంగా చేయబోయే ఈ మీట్ ని లైవ్ కెమెరాల ద్వారా కాకుండా ప్రత్యేకంగా తర్వాత స్ట్రీమింగ్ చేసే ఆలోచన చేస్తున్నట్టు ఇన్ సైడ్ న్యూస్. ప్రస్తుతం యాడ్స్ షూట్ లో బిజీగా ఉన్న మహేష్ త్వరలో అభిమానులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి ఫోటోలు దిగబోతున్నాడు. కొంత కాలం అందుబాటులో ఉండడు కాబట్టి ఆ లోటు తెలియకుండా ఉండటం కోసం ఈ మీటింగన్న మాట. స్క్రిప్ట్ వర్క్ ఒక కొలిక్కి వచ్చిందట కానీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలయ్యేది కూడా ఆ రోజే వెల్లడించే ఛాన్స్ ఉంది. చూద్దాం.
This post was last modified on March 14, 2024 4:21 pm
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…