సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఓటిటి ద్వారా విడుదల కానుందనే సంగతి విదితమే. జీ 5 ఈ చిత్రం డిజిటల్తో పాటు థియేట్రికల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. అక్టోబర్లో విడుదల చేసుకునేలా తమకు కంటెంట్ అప్పగించాలనే కండిషన్ పెట్టడంతో కరోనాని లెక్క చేయకుండా పరిమిత బృందంతో బ్యాలెన్స్ షూటింగ్ చేసేసారు.
అయితే రెండు పాటలు కూడా తీయాల్సి వుండగా, ఎలాగో ఓటిటి రిలీజ్ కాబట్టి ఇక వాటి అవసరం లేదని భావించి ఆ పాటల చిత్రీకరణ చేయలేదని సమాచారం. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందనే సంగతి సాయి ధరమ్ తేజ్ అఫీషియల్గా ప్రకటించాడు. మాస్క్ లు వేసుకుని షూటింగ్ చేసినపుడు, వేసుకోకుండా చేసినపుడు కూడా చాలా ఎంజాయ్ చేశానని అన్నాడు. ఈ చిత్రం రిలీజ్ సంగతి మాత్రం ఈ టీమ్ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు.
జీ 5 నుంచి కూడా సోలో బ్రతుకే సో బెటర్ డిజిటల్ రిలీజ్ గురించిన ఇన్ఫర్మేషన్ లేదు. బహుశా మంచి రోజు చూసుకుని అధికారిక వార్తతో వద్దామని భావిస్తున్నారేమో. తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు, సుబ్బు అనే కొత్త కుర్రాడు దర్శకుడు.
This post was last modified on September 12, 2020 10:51 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…