సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఓటిటి ద్వారా విడుదల కానుందనే సంగతి విదితమే. జీ 5 ఈ చిత్రం డిజిటల్తో పాటు థియేట్రికల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. అక్టోబర్లో విడుదల చేసుకునేలా తమకు కంటెంట్ అప్పగించాలనే కండిషన్ పెట్టడంతో కరోనాని లెక్క చేయకుండా పరిమిత బృందంతో బ్యాలెన్స్ షూటింగ్ చేసేసారు.
అయితే రెండు పాటలు కూడా తీయాల్సి వుండగా, ఎలాగో ఓటిటి రిలీజ్ కాబట్టి ఇక వాటి అవసరం లేదని భావించి ఆ పాటల చిత్రీకరణ చేయలేదని సమాచారం. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందనే సంగతి సాయి ధరమ్ తేజ్ అఫీషియల్గా ప్రకటించాడు. మాస్క్ లు వేసుకుని షూటింగ్ చేసినపుడు, వేసుకోకుండా చేసినపుడు కూడా చాలా ఎంజాయ్ చేశానని అన్నాడు. ఈ చిత్రం రిలీజ్ సంగతి మాత్రం ఈ టీమ్ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు.
జీ 5 నుంచి కూడా సోలో బ్రతుకే సో బెటర్ డిజిటల్ రిలీజ్ గురించిన ఇన్ఫర్మేషన్ లేదు. బహుశా మంచి రోజు చూసుకుని అధికారిక వార్తతో వద్దామని భావిస్తున్నారేమో. తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు, సుబ్బు అనే కొత్త కుర్రాడు దర్శకుడు.
This post was last modified on September 12, 2020 10:51 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…