Movie News

బాక్సాఫీసుని టెన్షన్ పెడుతున్న ఎన్నికల జ్వరం

ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే జనాల్లో ఎలక్షన్ ఫీవర్ మొదలైపోయింది. తెలంగాణలో జరిగినప్పుడు ఈ స్థాయి హీట్ కనిపించని మాట వాస్తవం. వార్ వన్ సైడని ముందే డిసైడవ్వడంతో విపరీతమైన ఆసక్తి కనిపించలేదు. కానీ ఏపీ కేసు వేరు. అధికార వైసిపి, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ మధ్య యుద్ధం రసవత్తరంగా జరిగేలా ఉంది. టికెట్ల ప్రకటనతో మొదలుపెట్టి ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఇటీవలే చనిపోయిన గీతాంజలి అనే వివాహిత మరణం విషయంలో ఎంత రచ్చ జరుగుతోందో చూస్తున్నాం. పరస్పర ఆరోపణలు ఘాటుగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో వీటి ప్రభావం బాక్సాఫీస్ మీద పడుతోంది. ఫిబ్రవరి నుంచి థియేటర్ల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఊరిపేరు భైరవకోన, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు లాంటివి ఏదో కాస్త ఊరట కలిగించాయి కానీ ఇంకా పూర్తి స్థాయిలో పికప్ ఇవ్వలేకపోయాయి. మొదటి మూడు రోజులు స్పీడ్ చూపించిన గామి ఒక్కసారిగా నెమ్మదించింది. ప్రేమలు ఊపందుకుంటున్నా మరీ భారీగా అయితే కాదు. ఈ వారం తొమ్మిది దాకా సినిమాలు వస్తున్నా వేటి మీదా మొదటి రోజే చూడాలన్న ఎగ్జైట్ మెంట్ ఆడియన్స్ లో కలిగించలేకపోయాయి. టాక్ గొప్పగా తెచ్చుకుంటే తప్ప నిలవడం కష్టం.

ఒక నలుగురు టీ స్టాల్ దగ్గర కలుసుకున్నా, ఫోన్ లో చాటింగ్ చేసుకున్నా, ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాలన్నా ఎక్కువ ఫోకస్ పవన్ కళ్యాణ్ సీట్ల కేటాయింపు, చంద్రబాబు ఎలక్షన్ క్యాంపైన్, జగన్ ఎత్తుగడలు ఇలా వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. పత్రికలు, న్యూస్ ఛానల్స్ లో ఇవే హైలైట్ అవుతున్నాయి. పైగా ప్రచారాలు మొదలైపోవడంతో నాలుగు డబ్బులు వస్తాయని యువత ఎక్కువగా పార్టీల వెంట తిరుగుతున్నారు. సో జనాల్లో సినిమా మూడ్ రావాలంటే హనుమాన్ రేంజ్ లో బ్లాక్ బస్టర్ బొమ్మ ఒకటి పడాలి. అప్పుడే కోరుకున్న జోష్ వచ్చి మళ్ళీ థియేటర్లు కళకళలాడతాయి.

This post was last modified on March 14, 2024 2:03 pm

Share

Recent Posts

రోలెక్స్… ఏమో తెలియదన్న సూర్య

లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్‌‌ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…

39 minutes ago

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…

1 hour ago

ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి

గుజరాత్‌లో చాందిపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…

1 hour ago

సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు…

2 hours ago

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

3 hours ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

6 hours ago