యానిమల్ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్నానే కానీ.. ఆ సినిమా రిలీజ్ తర్వాత తక్కువ స్క్రీన్ టైంతోనే ఎక్కువగా జనాల దృష్టిలో పడింది మాత్రం త్రిప్తి దిమ్రినే. సినిమాలో ఆమె మహా అయితే ఓ 20 నిమిషాలు కనిపిస్తుందేమో. కానీ జోయా పాత్రలో ఆమె వేసిన ఇంపాక్ట్ మాత్రం చాలా బలమైంది.
రష్మిక కీలక పాత్రలో అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చినా సరే.. త్రిప్తి బాగా హైలైట్ అయింది. ఆమె అందానికి, తనతో రణబీర్ చేసిన ఇంటిమేట్ సీన్లకు కుర్రాళ్లు బాగా కనెక్ట్ అయ్యారు. యానిమల్ రిలీజైనప్పటి నుంచి సోషల్ మీడియాలో త్రిప్తి ట్రెండ్ అవుతూ వస్తోంది. ఆమెకు అవకాశాలకు కూడా లోటే లేదు. భూల్ భులయియా-2తో పాటు కొన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుంది త్రిప్తి.
ఐతే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. త్రిప్తికి యానిమల్ సినిమాలో నటించినందుకు కేవలం రూ.40 లక్షలు మాత్రమే పారితోషకం కింద ఇచ్చారట. ఈ సినిమా చేసేటప్పటికి త్రిప్తి ఎవరో ప్రేక్షకులకు తెలియదు. కొత్తమ్మాయి.. పైగా తక్కువ నిడివి ఉన్న పాత్ర. కాబట్టి తక్కువ పారితోషకానికే ఒప్పుకుంది. కానీ యానిమల్ మూవీ సెన్సేషనల్ హిట్టయి త్రిప్తి పేరు మార్మోగేలా చేసింది.
ఇప్పుడు చూస్తే ఆమెకు తక్కువ పారితోషకం ఇచ్చారని అనిపిస్తుంది కానీ.. ఆ సినిమా వల్ల వచ్చిన పేరు ప్రఖ్యాతులతో త్రిప్తి కెరీరే మారిపోయింది. ఇప్పుడు భూల్ భులయియాలో చేస్తున్న స్పెషల్ రోల్కు ఆమె కోటి రూపాయలు పుచ్చుకుంటోందట. ఆ సినిమా కూడా బాగా ఆడితే త్రిప్తి పారితోషకం మల్టిప్లై కావడం ఖాయం. ఈ చిత్రం ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on March 14, 2024 7:38 am
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…
సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…
పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…