యానిమల్ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్నానే కానీ.. ఆ సినిమా రిలీజ్ తర్వాత తక్కువ స్క్రీన్ టైంతోనే ఎక్కువగా జనాల దృష్టిలో పడింది మాత్రం త్రిప్తి దిమ్రినే. సినిమాలో ఆమె మహా అయితే ఓ 20 నిమిషాలు కనిపిస్తుందేమో. కానీ జోయా పాత్రలో ఆమె వేసిన ఇంపాక్ట్ మాత్రం చాలా బలమైంది.
రష్మిక కీలక పాత్రలో అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చినా సరే.. త్రిప్తి బాగా హైలైట్ అయింది. ఆమె అందానికి, తనతో రణబీర్ చేసిన ఇంటిమేట్ సీన్లకు కుర్రాళ్లు బాగా కనెక్ట్ అయ్యారు. యానిమల్ రిలీజైనప్పటి నుంచి సోషల్ మీడియాలో త్రిప్తి ట్రెండ్ అవుతూ వస్తోంది. ఆమెకు అవకాశాలకు కూడా లోటే లేదు. భూల్ భులయియా-2తో పాటు కొన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుంది త్రిప్తి.
ఐతే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. త్రిప్తికి యానిమల్ సినిమాలో నటించినందుకు కేవలం రూ.40 లక్షలు మాత్రమే పారితోషకం కింద ఇచ్చారట. ఈ సినిమా చేసేటప్పటికి త్రిప్తి ఎవరో ప్రేక్షకులకు తెలియదు. కొత్తమ్మాయి.. పైగా తక్కువ నిడివి ఉన్న పాత్ర. కాబట్టి తక్కువ పారితోషకానికే ఒప్పుకుంది. కానీ యానిమల్ మూవీ సెన్సేషనల్ హిట్టయి త్రిప్తి పేరు మార్మోగేలా చేసింది.
ఇప్పుడు చూస్తే ఆమెకు తక్కువ పారితోషకం ఇచ్చారని అనిపిస్తుంది కానీ.. ఆ సినిమా వల్ల వచ్చిన పేరు ప్రఖ్యాతులతో త్రిప్తి కెరీరే మారిపోయింది. ఇప్పుడు భూల్ భులయియాలో చేస్తున్న స్పెషల్ రోల్కు ఆమె కోటి రూపాయలు పుచ్చుకుంటోందట. ఆ సినిమా కూడా బాగా ఆడితే త్రిప్తి పారితోషకం మల్టిప్లై కావడం ఖాయం. ఈ చిత్రం ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
స్టార్ హీరోయిన్లు ఏదైనా రామాయణ లాంటి పెద్ద సినిమాలో నటించినపుడు వారి ఇమేజ్కు తగ్గ పాత్రలు లేకపోతే.. అభిమానులు ఫీలవడం…
ఏపీలో కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు పూర్తి అయిపోయింది. ఇంకో మూడేళ్లు ఉంటే మరో ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి.…
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…