యానిమల్ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్నానే కానీ.. ఆ సినిమా రిలీజ్ తర్వాత తక్కువ స్క్రీన్ టైంతోనే ఎక్కువగా జనాల దృష్టిలో పడింది మాత్రం త్రిప్తి దిమ్రినే. సినిమాలో ఆమె మహా అయితే ఓ 20 నిమిషాలు కనిపిస్తుందేమో. కానీ జోయా పాత్రలో ఆమె వేసిన ఇంపాక్ట్ మాత్రం చాలా బలమైంది.
రష్మిక కీలక పాత్రలో అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చినా సరే.. త్రిప్తి బాగా హైలైట్ అయింది. ఆమె అందానికి, తనతో రణబీర్ చేసిన ఇంటిమేట్ సీన్లకు కుర్రాళ్లు బాగా కనెక్ట్ అయ్యారు. యానిమల్ రిలీజైనప్పటి నుంచి సోషల్ మీడియాలో త్రిప్తి ట్రెండ్ అవుతూ వస్తోంది. ఆమెకు అవకాశాలకు కూడా లోటే లేదు. భూల్ భులయియా-2తో పాటు కొన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుంది త్రిప్తి.
ఐతే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. త్రిప్తికి యానిమల్ సినిమాలో నటించినందుకు కేవలం రూ.40 లక్షలు మాత్రమే పారితోషకం కింద ఇచ్చారట. ఈ సినిమా చేసేటప్పటికి త్రిప్తి ఎవరో ప్రేక్షకులకు తెలియదు. కొత్తమ్మాయి.. పైగా తక్కువ నిడివి ఉన్న పాత్ర. కాబట్టి తక్కువ పారితోషకానికే ఒప్పుకుంది. కానీ యానిమల్ మూవీ సెన్సేషనల్ హిట్టయి త్రిప్తి పేరు మార్మోగేలా చేసింది.
ఇప్పుడు చూస్తే ఆమెకు తక్కువ పారితోషకం ఇచ్చారని అనిపిస్తుంది కానీ.. ఆ సినిమా వల్ల వచ్చిన పేరు ప్రఖ్యాతులతో త్రిప్తి కెరీరే మారిపోయింది. ఇప్పుడు భూల్ భులయియాలో చేస్తున్న స్పెషల్ రోల్కు ఆమె కోటి రూపాయలు పుచ్చుకుంటోందట. ఆ సినిమా కూడా బాగా ఆడితే త్రిప్తి పారితోషకం మల్టిప్లై కావడం ఖాయం. ఈ చిత్రం ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on March 14, 2024 7:38 am
ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను నిలువరించలేక పోయిన.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా కలెక్టరు, ముగ్గురు ఎస్పీలు) వేటు…
ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష,…
మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…