టాలీవుడ్ యువ కథానాయకుల్లో విశ్వక్సేన్ అదో రకం. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సొంత టాలెంట్తో ఎదిగిన ఈ యంగ్ హీరో.. తన సినిమాల ప్రమోషన్ల కోసం ప్రతిసారీ ఆలౌట్ ఎటాక్ చేస్తుంటాడు. కొన్నిసార్లు వివాదాస్పదంగా మాట్లాడి.. చిత్రమైన పనులేవో చేసి అయినా తన మూవీ చర్చనీయాంశం అయ్యేలా చేస్తుంటాడు. ఐతే ఈ క్రమంలో కొన్నిసార్లు హద్దులు దాటి మాట్లాడటం వల్ల సోషల్ మీడియాకు టార్గెట్ అవుతుంటాడు కూడా. విశ్వక్కు యాటిట్యూడ్ అంటూ అతణ్ని విమర్శిస్తుంటారు నెటిజన్లు. కానీ అవేవీ పట్టించుకోకుండా ముందుకు సాగిపోతుంటాడు. గతంలో ఓ సినిమా వేడుక సందర్భంగా నన్నెవరూ లేపాల్సిన పని లేదు అంటూ అతను చేసిన కామెంట్ వైరల్ అయింది.
అప్పుడలా అన్న వాడు తన కొత్త చిత్రం గామి ప్రమోషన్లలో భాగంగా వినమ్రంగా ఓ విజ్ఞప్తి చేయడం విశేషం. తన టీంతో కలిసి తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన విశ్వక్.. గామి లాంటి మంచి ప్రయత్నానికి అందరూ సపోర్ట్ చేయాలని.. తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు ఈ సినిమా గురించి మాట్లాడి ప్రమోట్ చేయాలని కోరాడు. ఈ కామెంట్ పట్టుకుని కొందరు కామెడీగా మీమ్స్ వదులుతున్నారు.
అప్పుడు నన్నెవరూ లేపాల్సిన పని లేదు అన్న విశ్వక్.. ఇప్పుడు ఇంత వినమ్రంగా మాట్లాడాడేంటి అని ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే.. మలయాళ మూవీ అయిన ప్రేమలును రాజమౌళి, మహేష్ బాబు లాంటి వాళ్లు ప్రమోట్ చేస్తుండగా.. గామి లాంటి మంచి ప్రయోగానికి టాలీవుడ్ నుంచి సపోర్ట్ లేకపోవడం గురించి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో విశ్వక్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయ
This post was last modified on March 14, 2024 7:34 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…