టాలీవుడ్ యువ కథానాయకుల్లో విశ్వక్సేన్ అదో రకం. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సొంత టాలెంట్తో ఎదిగిన ఈ యంగ్ హీరో.. తన సినిమాల ప్రమోషన్ల కోసం ప్రతిసారీ ఆలౌట్ ఎటాక్ చేస్తుంటాడు. కొన్నిసార్లు వివాదాస్పదంగా మాట్లాడి.. చిత్రమైన పనులేవో చేసి అయినా తన మూవీ చర్చనీయాంశం అయ్యేలా చేస్తుంటాడు. ఐతే ఈ క్రమంలో కొన్నిసార్లు హద్దులు దాటి మాట్లాడటం వల్ల సోషల్ మీడియాకు టార్గెట్ అవుతుంటాడు కూడా. విశ్వక్కు యాటిట్యూడ్ అంటూ అతణ్ని విమర్శిస్తుంటారు నెటిజన్లు. కానీ అవేవీ పట్టించుకోకుండా ముందుకు సాగిపోతుంటాడు. గతంలో ఓ సినిమా వేడుక సందర్భంగా నన్నెవరూ లేపాల్సిన పని లేదు అంటూ అతను చేసిన కామెంట్ వైరల్ అయింది.
అప్పుడలా అన్న వాడు తన కొత్త చిత్రం గామి ప్రమోషన్లలో భాగంగా వినమ్రంగా ఓ విజ్ఞప్తి చేయడం విశేషం. తన టీంతో కలిసి తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన విశ్వక్.. గామి లాంటి మంచి ప్రయత్నానికి అందరూ సపోర్ట్ చేయాలని.. తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు ఈ సినిమా గురించి మాట్లాడి ప్రమోట్ చేయాలని కోరాడు. ఈ కామెంట్ పట్టుకుని కొందరు కామెడీగా మీమ్స్ వదులుతున్నారు.
అప్పుడు నన్నెవరూ లేపాల్సిన పని లేదు అన్న విశ్వక్.. ఇప్పుడు ఇంత వినమ్రంగా మాట్లాడాడేంటి అని ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే.. మలయాళ మూవీ అయిన ప్రేమలును రాజమౌళి, మహేష్ బాబు లాంటి వాళ్లు ప్రమోట్ చేస్తుండగా.. గామి లాంటి మంచి ప్రయోగానికి టాలీవుడ్ నుంచి సపోర్ట్ లేకపోవడం గురించి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో విశ్వక్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయ
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…
వచ్చి దశాబ్దం అవుతున్నా బిచ్చగాడు తెలుగు ప్రేక్షకుల మీద వేసిన ముద్ర మామూలుది కాదు. కేవలం ఈ ఒక్క మూవీ…
అంతా సవ్యంగా జరిగి ఉంటే జూన్ 4 పెద్ది బదులు టాక్సిక్ విడుదలయ్యేది. యష్ అభిమానులు ఇది తలుచుకునే తెగ…
దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఒక స్టైల్ ఉంది. ఇడియట్ నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు దాన్ని గమనించవచ్చు. హీరోయిజంని…
ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు నినాదంతో ఊరూవాడలను ఏకం చేసిన ఉద్యమం నుంచి పుట్టిన విశాఖ ఉక్కు కర్మాగారం.. గత రెండు…