Movie News

ఈగల్ దర్శకుడి మల్టీస్టారర్ కు మరమ్మత్తులు

ఫిబ్రవరిలో విడుదలైన రవితేజ ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి అది షూటింగ్ లో ఉండగానే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇంకో సినిమా ఇచ్చిన సంగతి తెలిసిందే. దాని చిత్రీకరణ గత ఏడాది నవంబర్ లోపే కొంత భాగం చేశారు. మిరాయ్ టైటిల్ ప్రచారంలో ఉంది కానీ ఇంకా అఫీషియల్ కాలేదు. తేజ సజ్జ, దుల్కర్ సల్మాన్ హీరోలుగా మంచు మనోజ్ విలన్ గా చాలా క్రేజీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాసుకున్నారని అప్పట్లో టాక్ తిరిగింది అయితే హనుమాన్ తర్వాత లెక్కలు మారిపోయాయట. తేజ సజ్జకు మార్కెట్ వచ్చింది. హిందీతో కలిపి ప్యాన్ ఇండియా హక్కులకు డిమాండ్ పెరిగింది.

దీంతో అతను నెక్స్ట్ చేయబోయే మూవీస్ కి సంబంధించి పునఃసమీక్ష చేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే మిరాయ్ కు కొన్ని రిపేర్లు చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. తేజకు లెన్త్ పెంచి దానికి అనుగుణంగా ఏమేం మార్పులు చేయాలో వాటన్నింటి మీద వర్క్ జరుగుతోందట. అందుకే షూట్ కి కొంత బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఏప్రిల్ లేదా మే నుంచి కొనసాగించేలా ప్రణాళిక వేసుకున్నారని తెలిసింది. దీంతో పాటు బాలకృష్ణ 109లో నటిస్తున్న దుల్కర్ సల్మాన్ రెండింటికి సమాంతరంగా కాల్ షీట్స్ ఇచ్చి వేసవిలోగా వాటి పనిని పూర్తి చేసుకునే ప్లానింగ్ లో ఉన్నాడు.

ఒకవేళ ఈగల్ కనక బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఎలా ఉండేదో కానీ దాని ఫలితం కార్తీక్ ఘట్టమనేనిని అలెర్ట్ చేసింది. కేవలం యాక్షన్, ఎలివేషన్లతో పని జరగదని, సరైన ఎమోషన్ లేకుండా వీటితో ప్రేక్షకులను మెప్పించలేమని అర్థం చేసుకున్నాడు. అందుకే మిరాయ్ లో అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్త పడే టైం వచ్చింది. ఇక తేజ సజ్జ వీలైనంత కమర్షియల్ మూస జోలికి వెళ్లకుండా ప్రయోగాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. జై హనుమాన్ లో ఫుల్ లెన్త్ ఉంటుందో లేదో అనే అనుమానాల నేపథ్యంలో తన దగ్గరికొస్తున్న కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.

This post was last modified on March 13, 2024 5:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమిళనాడులో చంద్రబాబు ప్రచారం… అజెండా ఏంటి?

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున దక్షిణాదిలో ప్రచారం చేయనున్న…

14 minutes ago

వాళ్ల సినిమాలే ఎందుకు ఆడుతున్నాయి?

తెలుగులో సినిమా నిర్మాణం పెద్ద జూదంగా మారిపోయిన పరిస్థితి. సక్సెస్ రేట్ రాను రాను పడిపోతోంది. ప్రేక్షకుల నుంచి సంపూర్ణ…

56 minutes ago

జ‌గ‌న్‌కు రెస్ట్‌… నాయ‌కుల‌కు టార్గెట్‌!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. త‌న స‌తీమ‌ణి భార‌తితో క‌లిసి.. యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి సీబీఐ…

4 hours ago

జ‌నంలోనే కేసీఆర్‌… సమరానికి రెడీనా?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్‌.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ…

6 hours ago

అంబ‌టి దీక్ష‌… మద్దతు శూన్యం!

వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి.. త‌ర‌చుగా కూట‌మి స‌ర్కారు స‌హా.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై విమ‌ర్శ‌లు గుప్పించే అంబ‌టి రాంబాబు.. తాజాగా…

10 hours ago

ప‌వ‌న్‌కు అస‌లేమైంది?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోగ్యం గురించి శ‌నివారం సాయంత్రం సామాజిక మాధ్య‌మాల్లో ఒక్క‌సారిగా పెద్ద చ‌ర్చ మొద‌లైంది. ఉన్న‌ట్లుండి…

12 hours ago