ఫిబ్రవరిలో విడుదలైన రవితేజ ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి అది షూటింగ్ లో ఉండగానే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇంకో సినిమా ఇచ్చిన సంగతి తెలిసిందే. దాని చిత్రీకరణ గత ఏడాది నవంబర్ లోపే కొంత భాగం చేశారు. మిరాయ్ టైటిల్ ప్రచారంలో ఉంది కానీ ఇంకా అఫీషియల్ కాలేదు. తేజ సజ్జ, దుల్కర్ సల్మాన్ హీరోలుగా మంచు మనోజ్ విలన్ గా చాలా క్రేజీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాసుకున్నారని అప్పట్లో టాక్ తిరిగింది అయితే హనుమాన్ తర్వాత లెక్కలు మారిపోయాయట. తేజ సజ్జకు మార్కెట్ వచ్చింది. హిందీతో కలిపి ప్యాన్ ఇండియా హక్కులకు డిమాండ్ పెరిగింది.
దీంతో అతను నెక్స్ట్ చేయబోయే మూవీస్ కి సంబంధించి పునఃసమీక్ష చేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే మిరాయ్ కు కొన్ని రిపేర్లు చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. తేజకు లెన్త్ పెంచి దానికి అనుగుణంగా ఏమేం మార్పులు చేయాలో వాటన్నింటి మీద వర్క్ జరుగుతోందట. అందుకే షూట్ కి కొంత బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఏప్రిల్ లేదా మే నుంచి కొనసాగించేలా ప్రణాళిక వేసుకున్నారని తెలిసింది. దీంతో పాటు బాలకృష్ణ 109లో నటిస్తున్న దుల్కర్ సల్మాన్ రెండింటికి సమాంతరంగా కాల్ షీట్స్ ఇచ్చి వేసవిలోగా వాటి పనిని పూర్తి చేసుకునే ప్లానింగ్ లో ఉన్నాడు.
ఒకవేళ ఈగల్ కనక బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఎలా ఉండేదో కానీ దాని ఫలితం కార్తీక్ ఘట్టమనేనిని అలెర్ట్ చేసింది. కేవలం యాక్షన్, ఎలివేషన్లతో పని జరగదని, సరైన ఎమోషన్ లేకుండా వీటితో ప్రేక్షకులను మెప్పించలేమని అర్థం చేసుకున్నాడు. అందుకే మిరాయ్ లో అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్త పడే టైం వచ్చింది. ఇక తేజ సజ్జ వీలైనంత కమర్షియల్ మూస జోలికి వెళ్లకుండా ప్రయోగాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. జై హనుమాన్ లో ఫుల్ లెన్త్ ఉంటుందో లేదో అనే అనుమానాల నేపథ్యంలో తన దగ్గరికొస్తున్న కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.
This post was last modified on March 13, 2024 5:38 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…