బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొని.. ఆపై డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఉచ్చులో పడ్డ రియా చక్రవర్తి.. పెను సంచలనానికి తెర తీసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. తాను డ్రగ్స్ వాడేదాన్నని, సుశాంత్ కూడా డ్రగ్ అడిక్టే అని ఇంతకుముందు రియా ఎన్సీబీ విచారణలో చెప్పినట్లు వార్తలొచ్చాయి. సుశాంత్, రియాలకు ఆమె సోదరుడే డ్రగ్స్ సరఫరా చేసేవాడని కూడా వార్తలొచ్చాయి. అతణ్ని సైతం అరెస్ట్ చేసింది ఎన్సీబీ. కాగా బెయిల్ కోసం వీళ్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇంతలో విచారణలో రియా కొన్ని సంచలన నిజాలు చెప్పినట్లుగా టైమ్స్ నౌ ఛానెల్ ఒక సెన్సేషనల్ స్టోరీ ప్రసారం చేసింది.
ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉండి.. ఇప్పుడు బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ తీసుకునేదని రియా ఎన్సీబీ విచారణలో చెప్పినట్లు ఈ ఛానెల్ వెల్లడించింది. రకుల్తో పాటు సైఫ్ అలీఖాన్ తనయురాలు, సుశాంత్తో ‘కేదార్నాథ్’ సినిమా చేసిన సారా అలీ ఖాన్ సైతం మాదక ద్రవ్యాలు తీసుకునేదని ఆమె పేర్కొందట. అలాగే రియా స్నేహితురాలైన సైమోన్ కంబట్టా సైతం డ్రగ్ అడిక్టే అని ఆమె వెల్లడించిందంటున్నారు. దీనికి సంబంధించిన టైమ్స్ నౌ స్క్రోలింగ్స్ ఇప్పుడు ట్విట్టర్లో వైరల్ అవుతున్నాయి. ఇది రకుల్, సారాలకు తీవ్ర ఆందోళన కలిగించే విషయమే. రియా బాలీవుడ్ డ్రగ్ అడిక్ట్స్ అందరి పేర్లూ బయటపెట్టబోతందని.. మొత్తం 25 మంది దాకా పేర్లు వెలుగులోకి రాబోతున్నాయని మీడియా ఇప్పటికే వార్తలొచ్చాయి. ఒకప్పుడు టాలీవుడ్లో జరిగినట్లే ఇప్పుడు బాలీవుడ్లో పలువురికి నోటీసులు వెళ్లబోతున్నాయని.. వారిని విచారణకు పిలవడంతో పాటు డ్రగ్ టెస్టులు కూడా చేయబోతున్నారని అక్కడి మీడియా వర్గాలంటున్నాయి.
This post was last modified on September 12, 2020 6:45 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…