బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొని.. ఆపై డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఉచ్చులో పడ్డ రియా చక్రవర్తి.. పెను సంచలనానికి తెర తీసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. తాను డ్రగ్స్ వాడేదాన్నని, సుశాంత్ కూడా డ్రగ్ అడిక్టే అని ఇంతకుముందు రియా ఎన్సీబీ విచారణలో చెప్పినట్లు వార్తలొచ్చాయి. సుశాంత్, రియాలకు ఆమె సోదరుడే డ్రగ్స్ సరఫరా చేసేవాడని కూడా వార్తలొచ్చాయి. అతణ్ని సైతం అరెస్ట్ చేసింది ఎన్సీబీ. కాగా బెయిల్ కోసం వీళ్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇంతలో విచారణలో రియా కొన్ని సంచలన నిజాలు చెప్పినట్లుగా టైమ్స్ నౌ ఛానెల్ ఒక సెన్సేషనల్ స్టోరీ ప్రసారం చేసింది.
ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉండి.. ఇప్పుడు బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ తీసుకునేదని రియా ఎన్సీబీ విచారణలో చెప్పినట్లు ఈ ఛానెల్ వెల్లడించింది. రకుల్తో పాటు సైఫ్ అలీఖాన్ తనయురాలు, సుశాంత్తో ‘కేదార్నాథ్’ సినిమా చేసిన సారా అలీ ఖాన్ సైతం మాదక ద్రవ్యాలు తీసుకునేదని ఆమె పేర్కొందట. అలాగే రియా స్నేహితురాలైన సైమోన్ కంబట్టా సైతం డ్రగ్ అడిక్టే అని ఆమె వెల్లడించిందంటున్నారు. దీనికి సంబంధించిన టైమ్స్ నౌ స్క్రోలింగ్స్ ఇప్పుడు ట్విట్టర్లో వైరల్ అవుతున్నాయి. ఇది రకుల్, సారాలకు తీవ్ర ఆందోళన కలిగించే విషయమే. రియా బాలీవుడ్ డ్రగ్ అడిక్ట్స్ అందరి పేర్లూ బయటపెట్టబోతందని.. మొత్తం 25 మంది దాకా పేర్లు వెలుగులోకి రాబోతున్నాయని మీడియా ఇప్పటికే వార్తలొచ్చాయి. ఒకప్పుడు టాలీవుడ్లో జరిగినట్లే ఇప్పుడు బాలీవుడ్లో పలువురికి నోటీసులు వెళ్లబోతున్నాయని.. వారిని విచారణకు పిలవడంతో పాటు డ్రగ్ టెస్టులు కూడా చేయబోతున్నారని అక్కడి మీడియా వర్గాలంటున్నాయి.
This post was last modified on September 12, 2020 6:45 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…