బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొని.. ఆపై డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఉచ్చులో పడ్డ రియా చక్రవర్తి.. పెను సంచలనానికి తెర తీసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. తాను డ్రగ్స్ వాడేదాన్నని, సుశాంత్ కూడా డ్రగ్ అడిక్టే అని ఇంతకుముందు రియా ఎన్సీబీ విచారణలో చెప్పినట్లు వార్తలొచ్చాయి. సుశాంత్, రియాలకు ఆమె సోదరుడే డ్రగ్స్ సరఫరా చేసేవాడని కూడా వార్తలొచ్చాయి. అతణ్ని సైతం అరెస్ట్ చేసింది ఎన్సీబీ. కాగా బెయిల్ కోసం వీళ్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇంతలో విచారణలో రియా కొన్ని సంచలన నిజాలు చెప్పినట్లుగా టైమ్స్ నౌ ఛానెల్ ఒక సెన్సేషనల్ స్టోరీ ప్రసారం చేసింది.
ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉండి.. ఇప్పుడు బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ తీసుకునేదని రియా ఎన్సీబీ విచారణలో చెప్పినట్లు ఈ ఛానెల్ వెల్లడించింది. రకుల్తో పాటు సైఫ్ అలీఖాన్ తనయురాలు, సుశాంత్తో ‘కేదార్నాథ్’ సినిమా చేసిన సారా అలీ ఖాన్ సైతం మాదక ద్రవ్యాలు తీసుకునేదని ఆమె పేర్కొందట. అలాగే రియా స్నేహితురాలైన సైమోన్ కంబట్టా సైతం డ్రగ్ అడిక్టే అని ఆమె వెల్లడించిందంటున్నారు. దీనికి సంబంధించిన టైమ్స్ నౌ స్క్రోలింగ్స్ ఇప్పుడు ట్విట్టర్లో వైరల్ అవుతున్నాయి. ఇది రకుల్, సారాలకు తీవ్ర ఆందోళన కలిగించే విషయమే. రియా బాలీవుడ్ డ్రగ్ అడిక్ట్స్ అందరి పేర్లూ బయటపెట్టబోతందని.. మొత్తం 25 మంది దాకా పేర్లు వెలుగులోకి రాబోతున్నాయని మీడియా ఇప్పటికే వార్తలొచ్చాయి. ఒకప్పుడు టాలీవుడ్లో జరిగినట్లే ఇప్పుడు బాలీవుడ్లో పలువురికి నోటీసులు వెళ్లబోతున్నాయని.. వారిని విచారణకు పిలవడంతో పాటు డ్రగ్ టెస్టులు కూడా చేయబోతున్నారని అక్కడి మీడియా వర్గాలంటున్నాయి.
This post was last modified on September 12, 2020 6:45 am
ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ…
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…