బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొని.. ఆపై డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఉచ్చులో పడ్డ రియా చక్రవర్తి.. పెను సంచలనానికి తెర తీసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. తాను డ్రగ్స్ వాడేదాన్నని, సుశాంత్ కూడా డ్రగ్ అడిక్టే అని ఇంతకుముందు రియా ఎన్సీబీ విచారణలో చెప్పినట్లు వార్తలొచ్చాయి. సుశాంత్, రియాలకు ఆమె సోదరుడే డ్రగ్స్ సరఫరా చేసేవాడని కూడా వార్తలొచ్చాయి. అతణ్ని సైతం అరెస్ట్ చేసింది ఎన్సీబీ. కాగా బెయిల్ కోసం వీళ్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇంతలో విచారణలో రియా కొన్ని సంచలన నిజాలు చెప్పినట్లుగా టైమ్స్ నౌ ఛానెల్ ఒక సెన్సేషనల్ స్టోరీ ప్రసారం చేసింది.
ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉండి.. ఇప్పుడు బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ తీసుకునేదని రియా ఎన్సీబీ విచారణలో చెప్పినట్లు ఈ ఛానెల్ వెల్లడించింది. రకుల్తో పాటు సైఫ్ అలీఖాన్ తనయురాలు, సుశాంత్తో ‘కేదార్నాథ్’ సినిమా చేసిన సారా అలీ ఖాన్ సైతం మాదక ద్రవ్యాలు తీసుకునేదని ఆమె పేర్కొందట. అలాగే రియా స్నేహితురాలైన సైమోన్ కంబట్టా సైతం డ్రగ్ అడిక్టే అని ఆమె వెల్లడించిందంటున్నారు. దీనికి సంబంధించిన టైమ్స్ నౌ స్క్రోలింగ్స్ ఇప్పుడు ట్విట్టర్లో వైరల్ అవుతున్నాయి. ఇది రకుల్, సారాలకు తీవ్ర ఆందోళన కలిగించే విషయమే. రియా బాలీవుడ్ డ్రగ్ అడిక్ట్స్ అందరి పేర్లూ బయటపెట్టబోతందని.. మొత్తం 25 మంది దాకా పేర్లు వెలుగులోకి రాబోతున్నాయని మీడియా ఇప్పటికే వార్తలొచ్చాయి. ఒకప్పుడు టాలీవుడ్లో జరిగినట్లే ఇప్పుడు బాలీవుడ్లో పలువురికి నోటీసులు వెళ్లబోతున్నాయని.. వారిని విచారణకు పిలవడంతో పాటు డ్రగ్ టెస్టులు కూడా చేయబోతున్నారని అక్కడి మీడియా వర్గాలంటున్నాయి.
This post was last modified on September 12, 2020 6:45 am
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…
మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…
సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…