ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్న బాలకృష్ణ తర్వాత ఎవరితో చేస్తారనే దాని గురించి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. బోయపాటి శీను దర్శకత్వంలో ప్రాజెక్టు లాక్ అయిన మాట నిజమే అయిన నేపథ్యంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మొదటిసారి బాలయ్య మూవీకి రంగం సిద్ధమైనట్టే. అఖండ 2నా లేక వేరే కొత్త సబ్జెక్టు రాసుకున్నారా అనే దాని గురించి ఇంకా క్లారిటీ లేదు. మొదటి భాగం నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డి అనుమతితోనే సీక్వెల్ కొనసాగించాల్సి ఉంటుంది. ఆయనేమో పెదకాపు డిజాస్టర్ దెబ్బకి ఈ మధ్య బయట కనిపించడం తగ్గించేశారు.
కథ సంగతి కాసేపు పక్కనపెడితే బాలయ్య బోయపాటి నాలుగోసారి చేతులు కలపడం ఖరారే. వచ్చే నెల ఉగాది పండగ పురస్కరించుకుని ఓపెనింగ్ చేయాలనే ఆలోచనలో నిర్మాతలుండగా ఏపీ ఎన్నికల వాతావరణం చాలా వేడిగా ఉండటంతో బాలకృష్ణ డైరీ ఖాళీగా లేదు. ఉన్నంతలో బాబీకే డేట్లు అడ్జస్ట్ చేస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ ఎంత ఆలస్యంగా మొదలుపెట్టినా ముందైతే పూజా కార్యక్రమాలు చేద్దామనే నిర్ణయానికి రావడంతో బాలయ్య ప్రస్తుతం మంచి ముహూర్తం తీయించే పనిలో ఉన్నారని సమాచారం. ఒకవేళ ఓకే అనుకుంటే ఏప్రిల్ 9న ఈ లాంఛనం జరిగిపోవచ్చు.
స్కంద డిజాస్టర్ తర్వాత బోయపాటి శీను బాధ్యత రెట్టింపు అయ్యింది. ఇంకోవైపు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో ఊపు మీదున్న బాలయ్యకు ఎట్టి పరిస్థితుల్లో ఇంకో సూపర్ హిట్ ఇచ్చే తీరాలి. పైగా సింహా, లెజెండ్, అఖండ తర్వాత వచ్చే కాంబినేషన్ కావడంతో సహజంగానే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ చివరి దశ పనుల్లో ఉన్న బోయపాటి అది పూర్తి కాగానే ఫైనల్ నెరేషన్ కు రెడీ అవుతాడు. అల్లు అరవింద్ దగ్గరుండి చూసుకుంటున్నారని వినికిడి. సీనియర్ హీరోల్లో టాప్ ఫామ్ లో దూసుకుపోతున్న బాలయ్యకు లేట్ ఇన్నింగ్స్ కెరీర్ బ్రహ్మాండంగా జరుగుతోంది.
This post was last modified on March 13, 2024 1:33 pm
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…