ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్న బాలకృష్ణ తర్వాత ఎవరితో చేస్తారనే దాని గురించి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. బోయపాటి శీను దర్శకత్వంలో ప్రాజెక్టు లాక్ అయిన మాట నిజమే అయిన నేపథ్యంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మొదటిసారి బాలయ్య మూవీకి రంగం సిద్ధమైనట్టే. అఖండ 2నా లేక వేరే కొత్త సబ్జెక్టు రాసుకున్నారా అనే దాని గురించి ఇంకా క్లారిటీ లేదు. మొదటి భాగం నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డి అనుమతితోనే సీక్వెల్ కొనసాగించాల్సి ఉంటుంది. ఆయనేమో పెదకాపు డిజాస్టర్ దెబ్బకి ఈ మధ్య బయట కనిపించడం తగ్గించేశారు.
కథ సంగతి కాసేపు పక్కనపెడితే బాలయ్య బోయపాటి నాలుగోసారి చేతులు కలపడం ఖరారే. వచ్చే నెల ఉగాది పండగ పురస్కరించుకుని ఓపెనింగ్ చేయాలనే ఆలోచనలో నిర్మాతలుండగా ఏపీ ఎన్నికల వాతావరణం చాలా వేడిగా ఉండటంతో బాలకృష్ణ డైరీ ఖాళీగా లేదు. ఉన్నంతలో బాబీకే డేట్లు అడ్జస్ట్ చేస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ ఎంత ఆలస్యంగా మొదలుపెట్టినా ముందైతే పూజా కార్యక్రమాలు చేద్దామనే నిర్ణయానికి రావడంతో బాలయ్య ప్రస్తుతం మంచి ముహూర్తం తీయించే పనిలో ఉన్నారని సమాచారం. ఒకవేళ ఓకే అనుకుంటే ఏప్రిల్ 9న ఈ లాంఛనం జరిగిపోవచ్చు.
స్కంద డిజాస్టర్ తర్వాత బోయపాటి శీను బాధ్యత రెట్టింపు అయ్యింది. ఇంకోవైపు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో ఊపు మీదున్న బాలయ్యకు ఎట్టి పరిస్థితుల్లో ఇంకో సూపర్ హిట్ ఇచ్చే తీరాలి. పైగా సింహా, లెజెండ్, అఖండ తర్వాత వచ్చే కాంబినేషన్ కావడంతో సహజంగానే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ చివరి దశ పనుల్లో ఉన్న బోయపాటి అది పూర్తి కాగానే ఫైనల్ నెరేషన్ కు రెడీ అవుతాడు. అల్లు అరవింద్ దగ్గరుండి చూసుకుంటున్నారని వినికిడి. సీనియర్ హీరోల్లో టాప్ ఫామ్ లో దూసుకుపోతున్న బాలయ్యకు లేట్ ఇన్నింగ్స్ కెరీర్ బ్రహ్మాండంగా జరుగుతోంది.
This post was last modified on March 13, 2024 1:33 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…