ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్న బాలకృష్ణ తర్వాత ఎవరితో చేస్తారనే దాని గురించి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. బోయపాటి శీను దర్శకత్వంలో ప్రాజెక్టు లాక్ అయిన మాట నిజమే అయిన నేపథ్యంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మొదటిసారి బాలయ్య మూవీకి రంగం సిద్ధమైనట్టే. అఖండ 2నా లేక వేరే కొత్త సబ్జెక్టు రాసుకున్నారా అనే దాని గురించి ఇంకా క్లారిటీ లేదు. మొదటి భాగం నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డి అనుమతితోనే సీక్వెల్ కొనసాగించాల్సి ఉంటుంది. ఆయనేమో పెదకాపు డిజాస్టర్ దెబ్బకి ఈ మధ్య బయట కనిపించడం తగ్గించేశారు.
కథ సంగతి కాసేపు పక్కనపెడితే బాలయ్య బోయపాటి నాలుగోసారి చేతులు కలపడం ఖరారే. వచ్చే నెల ఉగాది పండగ పురస్కరించుకుని ఓపెనింగ్ చేయాలనే ఆలోచనలో నిర్మాతలుండగా ఏపీ ఎన్నికల వాతావరణం చాలా వేడిగా ఉండటంతో బాలకృష్ణ డైరీ ఖాళీగా లేదు. ఉన్నంతలో బాబీకే డేట్లు అడ్జస్ట్ చేస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ ఎంత ఆలస్యంగా మొదలుపెట్టినా ముందైతే పూజా కార్యక్రమాలు చేద్దామనే నిర్ణయానికి రావడంతో బాలయ్య ప్రస్తుతం మంచి ముహూర్తం తీయించే పనిలో ఉన్నారని సమాచారం. ఒకవేళ ఓకే అనుకుంటే ఏప్రిల్ 9న ఈ లాంఛనం జరిగిపోవచ్చు.
స్కంద డిజాస్టర్ తర్వాత బోయపాటి శీను బాధ్యత రెట్టింపు అయ్యింది. ఇంకోవైపు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో ఊపు మీదున్న బాలయ్యకు ఎట్టి పరిస్థితుల్లో ఇంకో సూపర్ హిట్ ఇచ్చే తీరాలి. పైగా సింహా, లెజెండ్, అఖండ తర్వాత వచ్చే కాంబినేషన్ కావడంతో సహజంగానే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ చివరి దశ పనుల్లో ఉన్న బోయపాటి అది పూర్తి కాగానే ఫైనల్ నెరేషన్ కు రెడీ అవుతాడు. అల్లు అరవింద్ దగ్గరుండి చూసుకుంటున్నారని వినికిడి. సీనియర్ హీరోల్లో టాప్ ఫామ్ లో దూసుకుపోతున్న బాలయ్యకు లేట్ ఇన్నింగ్స్ కెరీర్ బ్రహ్మాండంగా జరుగుతోంది.
This post was last modified on March 13, 2024 1:33 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…