ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్న బాలకృష్ణ తర్వాత ఎవరితో చేస్తారనే దాని గురించి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. బోయపాటి శీను దర్శకత్వంలో ప్రాజెక్టు లాక్ అయిన మాట నిజమే అయిన నేపథ్యంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మొదటిసారి బాలయ్య మూవీకి రంగం సిద్ధమైనట్టే. అఖండ 2నా లేక వేరే కొత్త సబ్జెక్టు రాసుకున్నారా అనే దాని గురించి ఇంకా క్లారిటీ లేదు. మొదటి భాగం నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డి అనుమతితోనే సీక్వెల్ కొనసాగించాల్సి ఉంటుంది. ఆయనేమో పెదకాపు డిజాస్టర్ దెబ్బకి ఈ మధ్య బయట కనిపించడం తగ్గించేశారు.
కథ సంగతి కాసేపు పక్కనపెడితే బాలయ్య బోయపాటి నాలుగోసారి చేతులు కలపడం ఖరారే. వచ్చే నెల ఉగాది పండగ పురస్కరించుకుని ఓపెనింగ్ చేయాలనే ఆలోచనలో నిర్మాతలుండగా ఏపీ ఎన్నికల వాతావరణం చాలా వేడిగా ఉండటంతో బాలకృష్ణ డైరీ ఖాళీగా లేదు. ఉన్నంతలో బాబీకే డేట్లు అడ్జస్ట్ చేస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ ఎంత ఆలస్యంగా మొదలుపెట్టినా ముందైతే పూజా కార్యక్రమాలు చేద్దామనే నిర్ణయానికి రావడంతో బాలయ్య ప్రస్తుతం మంచి ముహూర్తం తీయించే పనిలో ఉన్నారని సమాచారం. ఒకవేళ ఓకే అనుకుంటే ఏప్రిల్ 9న ఈ లాంఛనం జరిగిపోవచ్చు.
స్కంద డిజాస్టర్ తర్వాత బోయపాటి శీను బాధ్యత రెట్టింపు అయ్యింది. ఇంకోవైపు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో ఊపు మీదున్న బాలయ్యకు ఎట్టి పరిస్థితుల్లో ఇంకో సూపర్ హిట్ ఇచ్చే తీరాలి. పైగా సింహా, లెజెండ్, అఖండ తర్వాత వచ్చే కాంబినేషన్ కావడంతో సహజంగానే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ చివరి దశ పనుల్లో ఉన్న బోయపాటి అది పూర్తి కాగానే ఫైనల్ నెరేషన్ కు రెడీ అవుతాడు. అల్లు అరవింద్ దగ్గరుండి చూసుకుంటున్నారని వినికిడి. సీనియర్ హీరోల్లో టాప్ ఫామ్ లో దూసుకుపోతున్న బాలయ్యకు లేట్ ఇన్నింగ్స్ కెరీర్ బ్రహ్మాండంగా జరుగుతోంది.
This post was last modified on March 13, 2024 1:33 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…