ఇటీవలే విడుదలైన మంజుమ్మెల్ బాయ్స్ రెండు వారాలు దాటడం ఆలస్యం వంద కోట్లకు పైగా గ్రాస్ సాధించి నూటా యాభై మైలురాయి వైపు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. మాములుగా మలయాళం సినిమాలకు తక్కువ ఆదరణ ఉండే తమిళనాడులో దీని వసూళ్లు చూసి ట్రేడ్ నివ్వెరపోయారు. తెలుగు డబ్బింగ్ మార్చి 15 వస్తుందని తొలుత ప్రచారం జరిగింది కానీ ఏవో కారణాల వల్ల వాయిదా పడింది. పదకొండు మంది కుర్రాళ్లు కోడైకెనాల్ ట్రిప్ కు వెళ్తే అక్కడో అబ్బాయి గోతిలో పడ్డాక జరిగే పరిణామాలను ఆసక్తికరంగా థ్రిల్లింగ్ గా చూపించారు.
ఇప్పుడు అసలు పాయింట్ కు వద్దాం. కోలీవుడ్ ప్రముఖ రచయిత జయమోహన్ ఈ మంజుమ్మెల్ బాయ్స్ ని తీవ్రంగా విమర్శించారు. కేరళ అడవుల్లో మందు తాగిన కుర్రకారు అక్కడ బాటిల్స్ విసిరేసి చిందరవందర చేస్తారని, దీని వల్ల వందలాది ఏనుగులు, వన్య ప్రాణులు చనిపోతున్నాయని అన్నారు. ఇదేదో ఘనకార్యం లాగా ఈ సినిమాలో నటించిన గ్యాంగ్ మందు తాగి, నిషేధిత గుణ కేవ్స్ లో పడిపోతే దాన్ని గొప్ప విషయంగా చూపించిన తీరు ఏ మాత్రం బాలేదని విరుచుకుపడ్డారు. ఇలాంటివి వాటిని ప్రోత్సహించడం సరికాదని ఓ రేంజ్ లోప్రేక్షకులకు క్లాస్ పీకేశారు.
కమల్ హాసన్, శింబు, శివ కార్తికేయన్ లాంటి వాళ్ళు టీమ్ ని పిలిచి మరీ మెచ్చుకున్న ఇలాంటి బ్లాక్ బస్టర్ ని జయమోహన్ లాంటి సుప్రసిద్ధ రచయిత, స్క్రీన్ రైటర్ తిట్టడం పర్యావరణ ప్రేమికులకు సబబుగానే అనిపిస్తోంది కానీ మూవీ లవర్స్ మాత్రం ఇదెక్కడి ఓర్వలేనితనమంటూ రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు. అయినా ఏదైనా సినిమా హిట్ అయితే అందులో నెగటివ్ కోణాలను వెతికి మరీ వార్తల్లోకి ఎక్కడం ఈ మధ్య ట్రెండ్ గా మారిందని అంటున్నారు. యానిమల్ టైంలో వీటిని కాచుకోవడానికే దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఎక్కువ టైం పట్టింది. ఇప్పుడీ బాయ్స్ కు తప్పేలా లేదు.
This post was last modified on March 12, 2024 7:00 pm
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…